కాసు బ్రహ్మానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
== రాష్ట్రప్రగతి కి సోపానాలు ==
రాష్ట్ర ప్రగతికి బ్రహ్మానంద రెడ్డి అహర్నిశలు శ్రమించాడు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు పరిచాడు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించాడు. బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ పనులు కాసు హయాంలోనే పూర్తయ్యాయి. సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తపన పడ్డాడు. [[నాగార్జునసాగర్]] మొదటిదశ పూర్తి కాగానే, 1966 ఫిబ్రవరి ఆగస్టు 3న నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]] ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతానికి వరదాయిని అయిన [[తుంగభద్ర ప్రాజెక్టు]] హైలెవల్ కెనాల్ ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సుల మంజూరు, నిధులు సమకూర్చడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి కృషి చేసాడు. [[పోచంపాడు]] ప్రాజెక్టు కు రూపకల్పన చేసాడు. అప్పట్లో ఎల్.ఐ.సి.నుంచి పది కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బలహీనవర్గాల వారికి ఇళ్లు నిర్మించాడు. ఆయన హయాంలో పంచాయతీ చట్టం అమలులోకి వచ్చింది. [[సికింద్రాబాదు]] కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే మండలం ఏర్పాటు కావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.
 
== మరణం ==