చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==పరిచయం==
[[కౌండిన్యులు|కౌండిన్యస]] గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్యదంపతులకు [[1942]] ఏప్రియల్4న అంటే చిత్రభాను సంవత్సర చైత్ర బహుళ తదియ శనివారం రాజోలు తాలూకా మలికిపురం మండలం మోరి గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు.1942మే నెలనుంచి ఈమె [[దానవాయిపేట]] ఇంటినెంబర్ 46-18-11లోనే నివసిస్తున్నారు.ఈ ఇంటిపేరే ప్రణవకుటి.డాక్టర్ (మేజర్) సత్యవాణి ఎం.ఏ (హిందీ) సాహిత్యరత్న, ఎం.ఏ (రాజనీతి శాస్త్రం, ఎం.ఏ (ఫిలాసఫీ, ఎం.ఇడి, ఎం.ఫిల్, పిహెచ్.డి.పూర్తిచేశారు.శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో లెక్షరర్ గా పనిచేసిన ఈమె ఎన్.సి.సి ఆఫీసరుగా, ఎన్ఎ.స్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా సేవలందించారు.ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చారు.పదవీ విరమణచేసాక, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి, కళాశాల అభివృద్ధికి బాటలువేశారు.ప్రస్తుతం డైరక్టర్ గా కొనసాగుతున్నారు.
==ఆధ్యాత్మిక సంపదను [[పంచుతూ]]==
ఓ పుస్తకం వేయడమే చాలా కష్టం. అలాంటిది అంత్యంత నాణ్యతతో, అరుదైన ఫోటోలు సేకరించి మరీ, పుస్తకాలమీద పుస్తకాలు వేయడం ఆషామాషీ కాదు. పైగా ఎవరి సాయం లేకుండా తన సొంత ధనం వెచ్చించి, ఆధ్యాత్మిక సంపదగా మలచి, పదుగురికే పంచడం ఆమెకే చెల్లింది. ఈవిధంగా తాను పొందుతున్న పుణ్యాన్ని పదిమందికీ పంచుతున్నారని ప్రశంసించని వారు లేరు.గడిచిన 16 ఏళ్లుగా ఈ యజ్ఞం కొనసాగిస్తున్నారు.దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ ఆలయాలను దర్శించి, వాటి విశిష్టత అవగతం చేసుకుంటారు. ఇక అక్కడకు ఎలావెళ్ళాలి వంటి విషయాలంటిని పొందుపరుస్తూ, వ్యాసాలను పత్రికలకు అందించడమేకాదు, మళ్ళీ వాటన్నింటినీ క్రోడీకరించి, పుస్తక రూపంతెచ్చి, ఉచితంగా పంచిపెట్టడం ఈమె సహజ లక్షణం. ఈవిధంగా ఇప్పటివరకూ ఈమె 25పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు.
==డాక్టర్ ఏ.బీ.పై పరిశోధనకు ఎం.ఫిల్==
నిష్కళంక దేశభక్తుడు, నిస్వార్ధ నాయకుడు, మాజీమంత్రి డాక్టర్ఎ.బి నాగేశ్వరరావు-రాజకీయ జీవితంపై డాక్టర్ సత్యవాణి పరిశోధనచేసి ఎం.ఫిల్ సాధించారు.
==విజయలక్ష్మి పండిట్ పై పరిశోధనకు డాక్టరేట్==
శ్రీమతిరుశ్రీమతి విజయలక్ష్మి పండిట్-రాజకీయ జీవనంపై పరిశోధనకు డాక్టరేట్ పొందారుపొందా.
==రఘుపతి వెంకయ్య స్వర్ణ పతక పురస్కారం==
2006లో ఆంధ్రా యూనివర్సిటీనుంచి'సర్ రఘుపతి వెంకట రత్నంనాయుడు'స్వర్ణ పతక పురస్కారం అందుకున్న డాక్టర్ సత్యవాణి, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితినుంచి అన్నపూర్ణయ్య పురస్కారం పొందారు. ఇంకా ఎన్నో సత్కారాలు అందుకున్నారు.జూనియర్ చాంబర్ ఇంటర్ నేషనల్ (జె.సి.సి) ప్రతిఆధ్వర్యాన యేటా వారోత్సవాలలో ఇచ్చే పురస్కారంలో భాగంగా 2016 సెప్టెంబర్ 18వతేదీ సాయంత్రం రాజమహేంద్రవరం జాపేట శ్రీ ఉమా రామలింగేశ్వర కల్యాణ మంటపంలో నిర్వహించిన జెసిఐ గ్రేట్ డేలో సమాచారమ్ దినపత్రిక దివంగత సంపాదకులు శ్రీ గంధం నాగ సుబ్రహ్మణ్యం స్మారక జెసిఐ అవార్డుని డాక్టర్ (మేజర్) చల్లా సత్యవాణికి అందజేశారు. ఇక ఈమె రంచించే ప్రతి పుస్తకంలోకూడా శ్రీ సుబ్రహ్మణ్యంగార్ని తలుచుకోవడం, ఫోటో ముద్రించడం చేస్తూనే ఉండడం విశేషం. అవార్డు స్వీకారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యంపై ఈమె ఓ చిన్న బుక్ లెట్ కూడా వేసి, పంచిపెట్టారు.
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు