జటప్రోలు సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: నేను అదే ఊరు మా తాతలు చెప్పిన ఆధారాల మూలంగా
పంక్తి 3:
[[File:Sri Venugopala Swamy Temple, Jataprolu.jpg|thumb|శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం, జటప్రోలు]]
==స్థాపన==
పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానాధీశుల యొక్క మూలపురుషుడే కాక, [[గంజాం]] జిల్లాలోని [[బొబ్బిలి]] రాజ వంశము, [[గోదావరి జిల్లాలోనిజిల్లా]]లోని [[పిఠాపురం]], [[కృష్ణా జిల్లా]] లోని [[మల్లేశ్వరం]] మరియు [[నెల్లూరు]] జిల్లాలోని [[వెంకటగిరి]] మొదలైన రాజ వంశములకు మూలపురుషుడని భావిస్తారు. 15వ శతాబ్దం చివరిలో ఈ వంశానికి చెందిన మాదానాయుడు [[కృష్ణ]], [[తుంగభద్ర]] సంగమ సమీపంలోని [[జటప్రోలు]] ప్రాంతానికి వచ్చి అక్కడ కోటను కట్టడం ప్రారంభించాడు. మూడు తరాల తర్వాత ఈయన వారసులలో ఒకడైన మల్ల భూపతినాయుడు 1507లో [[విజయనగర]] రాజులనుండి ఈ ప్రాంతాన్ని పాలించడానికి సనదు (ప్రభుత్వ ఉత్తర్వు) ను పొందాడు. [[శ్రీకృష్ణదేవరాయలు|కృష్ణదేవరాయల]] పట్టాభిషేకానికి వెలుగోటి నాయకునిగా విచ్చేసిన సామంతుడు ఈయనేనని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు ఈ సంస్థానాధీశులకు సైనిక పోషణకై పట్టాలిచ్చారు. కానీ ఆయా సామ్రాజ్యల పతనం చెందినప్పుడు సంస్థానాధీశులు చాకచక్యంతో తమ రాజ్యాన్ని నిలబెట్టుకొని దక్షిణాపథంలో కొత్తగా ఆవిర్భవించిన శక్తులతో మనగలిగారు. 1513లో అప్పుడే కొత్తగా ఏర్పడిన [[గోల్కొండ|గోల్కొండ సామ్రాజ్యం]]పై దండయాత్రకు సన్నాహాలు చేస్తూ, కృష్ణదేవరాయలు యుద్ధబలగాలను బేరీజు వేయటానికి, ఇతర సామంతులతో పాటు జటప్రోలు రాజు వెలుగోటి యాచమ నాయున్ని కూడా పిలిపించాడు. ఆ సంవత్సరం [[రాయచూరు అంతర్వేది]]లో జరిగిన యుద్ధంలో జటప్రోలు సంస్థానము కూడా పాల్గొన్నది.
 
[[ఔరంగజేబు]] దక్షిణాపథంపై దండెత్తి [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీ]]లను ఓడించినప్పుడు స్థానిక రాజవంశాలను నిర్మూలించక, వాటిని తన నియమించిన దండనాయకుని ఆధీనంలో వీటిని తన రాజ్యంలో సామంతులుగా విలీనం చేసుకున్నాడు. అప్పటి నుండి జటప్రోలు సంస్థానం యొక్క స్వాధికారత మరియు ప్రాబల్యం పెరగటం ప్రారంభమైంది. అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు జటప్రోలు యొక్క ప్రాబల్యాన్ని దక్షిణాన [[జటప్రోలు]] నుండి ఉత్తరాన [[పానగల్]], [[యల్జల్ల]] వరకు విస్తరించి పటిష్ఠపరచాడు. 1694లో సంస్థానాధీశుడైన నరసింగరావు మొఘలులపై తిరుగుబాటు చేసి మొఘులుల మల్లయోధున్ని బంధించి, గంజికోట ([[గండికోట]]) మరియు [[శ్రీకాకుళం]]పై ఆధిపత్యం కావాలని పట్టుబట్టాడు. మొఘలులు ఈయన్ను తృప్తిపరచడానికి వీటిపై అధికారమిచ్చారు. జటప్రోలుకు తొంభై మైళ్ళు దక్షిణాన ఉన్న గండికోటను[[గండికోట]]ను అడగటంలోని ఆర్ధం ఉంది కానీ, ఉత్తరాంధ్రలోని [[శ్రీకాకుళం]] అడగటానికి హేతువు తెలియుటలేదు.<ref>[http://books.google.com/books?id=aWZFmoE3SaIC&pg=PA32&lpg=PA32&dq=jataprolu#v=onepage&q=jataprolu&f=false Kingship and Colonialism in India's Deccan: 1850-1948]</ref>
 
19వ శతాబ్దం చివరలో జటప్రోలు సంస్థాధీశునికి సంతానము కలుగక వారసుడు లేని పరిస్థితి వచ్చింది. అప్పటికే పొరుగు సంస్థానాలైన [[వనపర్తి]], గద్వాలలో[[గద్వాల]]లో జరుగుతున్న వారసత్వపు పోరులను గమనించిన జటప్రోలు రాజు, ముందు జాగ్రత్త చర్యగా [[వెంకటగిరి]] రాజకుమారున్ని దత్తత పుచ్చుకున్నాడు. ఈయన జటప్రోలు రాజా సింహాసనము అధిరోహించిన తర్వాత తన అసలు పేరు నవనీతకృష్ణ యాచేంద్రను విడిచి ''రాజా వెంకట లక్ష్మణరావు బహుదూర్‌'' అనే పట్టము స్వీకరించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వెంకట లక్ష్మణరావు [[1929]]లో మరణించాడు.
[[బొమ్మ:Wooden Ratha Jataprolu.JPG|right|thumb|జటప్రోలు సంస్థానానికి చెందిన [[రథం]] <br /> (''[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియమ్]] లో భద్రపరచినది'') ]]
జటప్రోలు సంస్థానాన్ని సుమారు పదహారు తరాలుగా కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన 'సురభి' రాజులంటే కొల్లాపూర్ ప్రాంత జనులకు వల్లమాలిన అభిమానం. వీరి పరిపాలన 7, 8 వందల సంవత్సరాల క్రితం నుంచే ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతారు. [[కొల్లాపూర్]] ప్రాంతంలో చారిత్రక భవనాలు, దేవాలయాలతో పాటు అనేకం సురభి రాజ వంశీయులు నిర్మించినవే. జటప్రోలు సంస్థానాధీశుల కోటను మల్ల నాయుడు నిర్మించగా, [[సింగపట్నం]]లోని నృసింహ సాగరాన్నిి సింగమనాయుడు, [[పెంట్లవెల్లి]] గ్రామంలోని కోటను, చెరువును, శివ కేశవాలయాన్ని చిన్నమాధవ రావు, [[కొల్లాపూర్]] కోటను ప్రథమ వేంకటలక్ష్మా రావు, [[జటప్రోలు]] మదన గోపాల స్వామి ఆలయాన్ని మాధవరాయులు, [[బెక్కం]], [[చిన్నమారూర్|చిన్నమారూరు]] కోటల్ని నరసింగ రావులు నిర్మించారు. వీటితో పాటు శింగవట్నంలోని శ్రీవారి సముద్రం, జటప్రోలు హజ్రత్ ఇనాయత్ షా ఖాద్రి దర్గా, అద్దాల మేడ, కొల్లాపూర్ లోని న్యాయ దర్బార్ గా పిలిచే గుండు బంగ్లా, జైలు ఖానాలను సురభి రాజులు వారి పాలనలో నిర్మించారు.
 
సురభి వంశస్తుల పాలనలో కొల్లాపూర్ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. 1871 లో నిర్మించిన [[కొల్లాపూర్]] రాజా బంగ్లాను చంద్ర మహల్, మంత్ర మహల్, [[రాణి మహల్]] గా విభజించి సుందరంగా నిర్మించారు. 140 సంవత్సరాల క్రితం నాటి మునసబ్ కోర్టు జిల్లాలోనే ప్రథమ న్యాయస్థానం ఇక్కడ ఉంది. కొల్లాపూర్ పట్టణంలో విశాలమైన రహదారులు, రహదారులకిరు వైపులా చెట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేసారు. జనరేటర్ ఉపయోగించి విద్యుత్తును వినియోగించిన ఘనత కూడా వారికే దక్కుతుంది. త్రాగునీటి సరఫరా పైపులైను ఏర్పాటు చేసి కుళాయిలు ఆనాడే ఏర్పాటు చేసారు. 18 వ శతాబ్దం కాలంలోనే జటప్రోలు సంస్థానాధీశుల అధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ధర్మాసుపత్రిని కూడా ఏర్పాటు చేసారు. హైటెక్ పరిజ్ఞాన వినియోగంలో సురభి వంశస్థులదే అందె వేసిన చేయి. సురభి వంశస్థులు ప్రపంచ విపణిలో ఏ కొత్త వస్తువు వచ్చినా వాటిని వినియోగించుకునేవారు. వీరికి ఒక సొంత విమానం కూడా ఉండేదని. దానికి ఎయిర్ పోర్టుగా కొల్లాపూర్ పట్టణంలోని జఫర్ మైదానాన్ని ఉపయోగించినట్లుగా చెబుతారు.
 
సురభి రాజ వంశ వారసుడైన బాలాదిత్య లక్ష్మారావు (ఇతను సంస్థానం చివరి రాజు జగన్నాథరావు కుమారుడు) [[హైదరాబాదు]]లో నివాసం ఏర్పరుచుకున్నారు. కొల్లాపూర్ సంస్థానానికి మంత్రిగా పనిచేసిన మియాపురం రామకృష్ణారావు ప్రముఖ బ్రాహ్మణుడు. వీరు గొప్ప కవి. ఎన్నో గేయాలు రచించారు.
"https://te.wikipedia.org/wiki/జటప్రోలు_సంస్థానం" నుండి వెలికితీశారు