వాసిరెడ్డి వారికమ్మరాజుల మొదటి ప్రస్తావన [[పిఠాపురం]]లో దొరికిన క్రీ.శ. 1413 నాటి ఒక [[శాసనము]]లో గలదు. వాసిరెడ్డి పోతినీడు అను రాజు ఈ ప్రాంతమును [[ముసునూరి నాయకులు|ముసునూరి నాయకుల]] సామంతునిగా పాలించినట్టుగా ఉంది. పోతినీడు [[గోదావరి|గోదావరీ]] తీర ప్రాంతములో పలు దేవాలయాలు కట్టించాడు. 4,60,000 [[తాడి చెట్టు|తాడి చెట్లు]] నాటించి తన శాసనములలో తాడిచెట్ల ప్రయోజనాలను పేర్కొన్నాడు.