గోవిందరాజు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
 
'''గోవిందరాజులు సుబ్బారావు''' ([[1895]] - [[అక్టోబరు 29]], [[1959]]) వైద్యులు, సాహిత్య ప్రియులు, [[రచయిత]], [[తెలుగు]] సినిమాలలో మరియు నాటకాలలో తొలితరం నటుడు.
 
వీరు [[1895]] సంవత్సరంలో జన్మించారు. వీరు వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణులై డాక్టరుగా [[తెనాలి]]లో స్థిరపడి, దానివలన పేరుప్రతిష్టలు సంపాదించారు. తరువాత కాలంలో వీరు [[హోమియోపతి]] వైద్యానికి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి, [[ఐన్ స్టీన్]]తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. అయితే ఆంధ్ర రాష్ట్రమంతా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరి నటనా వైదుష్యం.
 
పాఠశాలలో చదివేటప్పుడు, వార్షికోత్సవ సందర్భంలో '[[మర్చంట్ ఆఫ్ వెనిస్]]' అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో వీరి నట జీవితం ప్రారంభమైంది. వీరు 20 ప్రముఖ రాగాలు పాడాటం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో [[గయోపాఖ్యానం]] నాటకంలో [[సాత్యకి]]గా, [[భీముడు]]గా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. [[తెనాలి]]లో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని 'బొబ్బిలి'లో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. '[[కన్యాశుల్కం]]'లో లుబ్ధావధానులు పాత్రవలననూ, '[[ప్రతాపరుద్రీయం]]'లో పిచ్చివాడు పాత్రవలననూ సుబ్బారావు ఆంధ్రదేశంలో[[ఆంధ్రదేశం]]లో అసమాన ఖ్యతిని పొందారు.
 
సినిమా రంగంలో వీరు ఎంతగానో రాణించారు. [[మాలపిల్ల]]లో సుందర రామశాస్త్రిగా, [[షావుకారు]]లో చెంగయ్య, '[[బాలనాగమ్మ]]'లో మాయల మరాఠీగా వీరు ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందారు.