శ్రీనివాస మంగాపురం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 2:
'''శ్రీనివాస మంగాపురం''' [[తిరుపతి]]కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి [[నారాయణవనం]]లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు [[పద్మావతి]] అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.
[[
గతంలో మంగాపురంలో రైల్వే స్టేషను కూడా వుండేది. భక్తులు ఇక్కడ దిగి ముందు స్వామివారిని దర్శించుకొని తిరుమలకు వెళ్లేవారు. శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు. చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు. కాని అలిపిరి వద్ద నున్న మెట్లదారి గుండా పైకి ఎక్కి నూరు మెట్ల దారి గుండా దిగే వారు ఎవరు ఉండరు. తిరుపతి చూడ నవసరం లేదనుకొనే వారు మాత్రం గతంలో ఈ దారినే ఎక్కువగా వాడే వారు. అప్పట్లో శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుని దర్శించుకునే భక్తులు చాల తక్కువ. ఇక్కడ భక్తుల రద్దీ తిరుమలతో పోలిస్తే చాల తక్కువ గాన తనివి తీర శ్రీనివాసుని దర్శించు కోవచ్చు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య బాగ పెరిగింది.
|