ముదిగంటి సుజాతారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చి →విశేషాలు |
|||
పంక్తి 1:
'''ముదిగంటి సుజాతారెడ్డి''' ప్రఖ్యాత రచయిత్రి.
==విశేషాలు==
ఈమె [[నల్లగొండ జిల్లా]], [[నకిరేకల్]] మండలం, [[ఆకారం (శాలిగౌరారం)|ఆకారం]] గ్రామంలో వెంకటమ్మ, రాంరెడ్డి దంపతులకు దొరల కుటుంబంలో జన్మించింది. చిన్న వయసులో, అక్షరాభ్యాసం జరిగిన కొద్దిరోజులకు, ఒకరాత్రి కొందరు కర్రలతో బర్చీలతో వారి బంగ్లాకు వచ్చారు. “మేం చాలా చాలా చిన్నపిల్లలం. నిశ్శబ్దమైన చింతాకులమైన ఏదో గంభీరంగా ఒత్తిడులతో నిండిన ఆ వాతావరణంతో కూడిన దృశ్యాన్ని రాత్రి అంధకారంలో నూనెతో వెలిగే చిన్న చిన్న దీపాల వెలుతురులో నిలబడి చూసిన గుర్తు.” దస్తర్లు, రికార్డులు, ఇంట్లో ఉన్న తల్వార్లు, బర్చీలని ఆ గుంపు ముందు పెట్టారట. ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడూ మునపటిలా వైభవంగా లేదు. చాలామంది దొరలు, బాగా బతికే కుటుంబాల లాగానే వీరి కుటుంబం కూడా ఆంధ్రప్రాంతాలకు వలస వెళ్ళింది. కొన్నాళ్ళు గుంటూరు జిల్లా అద్దంకిలోనూ, ఆ తర్వాత నరసరావుపేటలోనూ, వారి కుటుంబం, మేనమామ కుటుంబం కలిసి నివసించారు. పెద్ద బంగ్లాలో ఆడబాపలు, నౌకర్లతో బతికిన కుటుంబం, ఊరి గాని ఊర్లో, ఇరుకుగదుల అద్దె ఇళ్ళలో వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ, దూరంగా ఉన్న గుండ్లకమ్మ నుంచి మంచినీరు మోసుకు తెచ్చుకోవలసి ఉండటం కష్టమయింది. కొత్త సంస్కృతితో వలసదార్లు పడే ఇతర ఇబ్బందులు సరేసరి.
ఈమె [[నల్లగొండ జిల్లా]], [[నకిరేకల్]] మండలం, [[ఆకారం (శాలిగౌరారం)|ఆకారం]] గ్రామంలో వెంకటమ్మ, రాంరెడ్డి దంపతులకు జన్మించింది. ఈమె ఉస్మానియా [[విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ., చదివి “మను, వసు చరిత్రల తులనాత్మక పరిశీలనం” అనే సిద్ధాంత వ్యాసానికి 1976లో పి.హెచ్.డి పట్టా పొందింది. 1970లో తెలుగు అధ్యాపకురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి ముప్పై యేళ్ళ తర్వాత పదవీ విరమణ చేసింది. 1966-69 మధ్య కాలంలో [[జర్మనీ]] దేశంలోని టుబింగన్ విశ్వవిద్యాలయం [[గ్రంథాలయం]]<nowiki/>లోని ఓరియంటల్ విభాగంలో భారతాధ్యయన గ్రంథాలను ‘సబ్జెక్టు క్యాటలాగ్’ చేయడంలో సహకారం అందించింది. అప్పడు సేకరించిన సమాచారంతోనే “సంస్కృత సాహిత్య చరిత్ర”ను వ్రాసింది. ఈమె ప్రామాణికంగా 6 సాహిత్య విమర్శ గ్రంథాల్ని, 3 నవలల్ని 4 కథా సంపుటాల్ని, 4 సాహిత్య చరిత్ర గ్రంథాల్ని, 2 యాత్రా కథన రచనల్ని, మరిన్ని స్త్రీలకు, తెలుగు సాహిత్యానికి, మానవ సంబంధిత గ్రంథాలను వెలువరించింది.ఈమె [[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వం]] ప్రవేశపెట్టిన నూతన సిలబస్ కమిటీలో సలహాదారుగా, పాఠశాల టెక్ట్బుక్ కమిటీలో సభ్యు రాలిగా, తెలంగాణ సారస్వత పరిషత్తులో ఉపాధ్యక్షురాలుగా ఉంటూ [[సాహిత్యం|సాహిత్య]] కృషి చేస్తున్నది. ఇప్పటికి ఆమె రచనలపై ఒక పి.హెచ్.డి, రెండు ఎం.ఫిల్. గ్రంథాలు వచ్చాయి. ఇంకా ఎందరో పరిశోధకులు ఆమె [[కథలు]], [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లపై పరిశోధనలు సాగిస్తున్నారు<ref>{{cite news|last1=సంపాదకుడు|title=అనుపమ అక్షర కృషీవలురు తెలంగాణ తేజాలు|url=http://manatelangana.news/2016/06/telangana-poets-in-telangana/|accessdate=10 April 2017|work=మన తెలంగాణ|date=13 Jun 2016}}</ref>.▼
తెలంగాణా విమోచనం జరిగి, కమ్యూనిస్టు పోరాటం ఉధృతం తగ్గాక వారు తమ ప్రాంతానికి తిరిగి వచ్చారు. వారి బంగ్లా ధ్వంసమై ఉంది. కొన్నాళ్ళు మేనమామల ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత నల్గొండకు మకాం మార్చారు. సుజాత 1950లో నల్లగొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నాల్గవ తరగతిలో చేరారు. అప్పుడే ‘వెల్లోడి’ ప్రభుత్వంలో స్కూళ్ళలో ఉర్దూ బదులు తెలుగు మాధ్యమం వచ్చింది. హెచెస్సి (టెంత్ క్లాస్) పాస్ అయ్యాక ఇంట్లో ఒక చిన్న మహాబారత యుద్ధం జరిగింది. చివరకు, పెండ్లి కుదిరేంతవరకూ చదువుకుంటుంది అని కాలేజీలో చేరటానికి ఇంట్లో అంగీకరించారు. 1956లో రాజ బహద్దరు వెంకట రామా రెడ్డి మహిళాకళాశాల (ఆర్బివీఅర్ఆర్ ఉమెన్స్ కాలేజ్)లో పియుసీలో చేరారు. అక్కడే రెడ్డి హాస్టల్లో వసతి. ఇంగ్లీషు మాధ్యమంతోనూ, నగర సంస్కృతితోనూ కొన్ని ఇబ్బందులు. పియుసీ అయేటప్పటికి నల్గొండలో నాగార్జున కాలేజీ ఏర్పడింది. అక్కడ బి.ఏ మొదటి సంవత్సరం చదివాక గోపాల్ రెడ్డిగారితో 1959లో వివాహమైంది.
గోపాల్ రెడ్డి కుటుంబం ఆర్యసమాజానికి చెందినవారు. చిన్నతనంలోనే వారి తండ్రి గోపాల్రెడ్డిని అతని తమ్ముణ్ణి హరిద్వారం సమీపంలో ఉన్న కాంగ్లీలో ఆర్యసమాజపు గురుకులానికి పంపించి చదివించారు. అక్కడ గోపాల్రెడ్డి వివిధ భాషలు, వేదాలు నేర్చుకుని, ముఖ్యంగా సంస్కృతంలో పాండిత్యం సంపాదించుకుని, సంస్కృతంలోనే ఎం.ఏ. చదివారు. ఆర్యసమాజపు ప్రభావం వల్ల వారి కుటుంబ సంస్కృతి వేరేగా ఉండేది. ఈ వైరుధ్యాలవల్ల పెళ్ళి ఎలా జరగాలి అన్న విషయంలో కొంత ఘర్షణ జరిగింది. పండిట్ గోపదేవ్, రుద్రదేవ్ల ఆధ్వర్యంలో చాలావరకూ ఆర్యసమాజ పద్ధతిలో వారి పెళ్ళి జరిగింది. పుస్తె కట్టడం, మట్టెలు పెట్టడం, కన్యాదానం ఆచారాలను మాత్రం పాటించారు.
▲
==సాహిత్యసేవ==
|