దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయన తల్లిగారు [[ద్రాక్షారామం]] వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్తె. శివరావుగారి సతీమణి [[విశాఖపట్టణం]]కు వాస్తవ్యులు బుధ్ధిరాజు మూర్తిరాజు గారి కుమార్తె కమల. శివరావుగారు వృత్తిరీత్యా 1922 నుండీ [[విజయవాడ]]లో ప్రఖ్యాత [[న్యాయవాది]]. అంతేకాక వారు చరిత్ర పరిశోధకుడుగా గ్రంథ కర్తగా ప్రసిధ్ధి.<ref>The National Biography of Indian Literature 1901-1953 సాహిత్య ఎకాడమీ, కొత్తఢిల్లీ, వాల్యూం 4, పేజీలు 251,416,417,419</ref><ref>నా జీవితగాధ-నవ్యాంధ్రము (1959) అయ్యదేవర కాళేశ్వరరావు పేజీ155-159</ref>,<ref>మిత్రులు నేను [[గొర్రెపాటి వెంకట సుబ్బయ్య]] (1970) పేజీ 186-193</ref>, గాంధీ వాది. గాంధీ ప్రవేశపెట్టిన అనే క సత్యాగ్రహ ఉద్యమములో వారి సేవ విశేషమైనది.<ref>[[ఆంధ్రజ్యోతి]] అక్టోబరు10,1966 "నేనెరిగిన శివరావుగారు" [[కాకాని వెంకటరత్నం]]</ref>. జైలుకు వెళ్ళటానికి ఏరోజుకారోజు సంసిధులైయ్యుండికూడా [[బ్రిటిష్]] ప్రభుత్వచేసే అన్యాయమును ప్రజలకు కాంగ్రెస్సు కార్యకర్తలకు తెలిసేటట్టు ఉదృతముగా ఆనేక రచనలు కాంగ్రెస్సువాదిగను వ్యక్తిగతముగను చేశారు. నిశతమైన [[న్యాయవాది]]గా వృత్తి రీత్యా వారు ప్రముఖులైనప్పటికి నీ వారు కేవలం వృత్తికే అంకితం అయి ధన సంపాదనే లక్ష్యం చేసు కోలేదు. విద్యార్థిగా చదువుకుంటున్న రోజలనుంచే దేశ చరిత్ర, స్వతంత్ర ఉద్యమాలకు తోట్పడుటకు దోహదం మైన వారి ఉపాధ్యాయుల ప్రసంగాలు, రచనలు, వారి పై ప్రభావం చూపటంవల్లం వారు వృత్తిలో ప్రవేశిస్తూనే ఆకాలంనాటి కాంగ్రెస్సు రాజకీయల్లో పాలుపంచుకుంటూ ఇంకో ప్రక్క ఏమాత్రం సమయం వృధాచేయకుండా వారు సాహిత్యకృషిలో మునిగి తేలుతూ వుండేవారు. చరిత్రకు సంబంధించి ఇంకా వెలుగు చూడని క్రొత్త విషయాలు చదవాలి వ్రాయాలి అనేది ఆయనకు లక్ష్యంగా వుండేది. అనేక పుస్తాకాలు చదివి చారిత్రాత్మకమైన అనే క అపురూపమైన వ్యాసములు, పుస్తకములు వ్రాశారు.<ref>" ప్రామాణిక చరిత్రకారులు ",అక్కిరాజు రమాపతి రావు ఆంధ్ర ప్రభ ఫిబ్రవరి 15,1988</ref> వారు నీతి నిజాయితీకి మరోపేరు.<ref>ఆంధ్రపత్రిక నవంబరు 9, 1986 "ద్రిషణా ధురంధరుడు" ప్రకాశచంద్ర శతపధి</ref> [[అవినీతి]] ఆటగోడుతనంసహించేవారు కాదు. కల్లాకపటం వారి దరిదాపుల్లోకి రావటానికి సాహచించేవికావు. 1930–1947 మధ్యకాలంలో గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమం పిలుపులో వారు [[సాహిత్యం|సాహిత్య]], [[రాజకీయాలు|రాజకీయ]], [[న్యాయవాది|న్యాయవాద]] పరిజ్ఞానంతో చేసిన కృషి అపారం. [[ఉపన్యాసాలు]] ఇవ్వటం ఉపన్యాసాలకి వెళ్ళ టం వారు అరుదుగా చేశేవారు. [[స్వాతంత్ర్య సమరయోధులుగాసమరయోధులు]]<nowiki/>గా ఎటువంటి గౌరవాలు సన్మానాలు స్వీకరించేవారు కాదు. తను వృత్తిరీత్య న్యాయవాదినని, జైలుకు పోలేదని కారణాలు చెప్పి నిరాకరించేవారు. వినపట్టం కొంచంగా తక్కువ కావటంతోనే 1965 లోనే కోర్టుకు వెళ్లడం మానేశారు. అప్పటికి వారికి చాల పెద్ద పెద్ద కేసులు విచారణకుండేవి. ఆత్మగౌరవం వారికి సంధిపడరాని విషయం. కోర్టు మానేసినప్పటికీ వారి సలహాకోసం కక్షిదారులు వస్తూవుండేవారు. అలాగ వారు న్యాయ సలహాలు ఇస్తూ 1980 దాకా [[విజయవాడ]]లోనే వుండేవారు. వారి సతీమణి కమల 1978 లో పరమదించారు. 1980 లో 83 ఏండ్లు పైబడ్డ తరువారు శివరావుగారు హైదరాబాదులో వారి కుమార్ల వద్ద వుండేవారు. వారు [[సాహిత్యం|సాహిత్య]] కృషి మాత్రం మానకుండా జీవితాంతం చదవుతూ వ్రాస్తూ వుండి చివరకు 95 పైబడినతరువాత 03-10-1992 న [[భోపాల్]] నగరంలో “a narrative of the campaign in India which terminated the war with Tippusultan in 1792” అనే పుస్తకం చదువూతూనే వారి కుమారుని వద్ద చివరి శ్వాస వదిలారు. వారి సాహిత్య కృషే వారి జీవిత చరిత్రలో చాల పెద్ద పర్వం. వారు దాదాపుగా 40 పుస్తాకాలు, 400 వ్యాసాలు వాశారు. వారు వ్రాసిన వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రకటితమయ్యేవి అనేక చారిత్రక విషయములు ఎక్కడెక్కడనుంచో త్రవ్వి బహువిధ కృషితో వాటిని తెలుగువారి కోసం సరళమైన తెలుగులో మంచి శైలిలో వెలుగులోకి తీసుకుచ్చారు. శివరావు గారు తన సమకాలికులు, మిత్రుల కంటే దీర్ఘ కాలం జీవించారు వారిజ్ఞాపక శక్తి అపారం. కచ్చితమైన తారీఖులు పేర్లు సంఖ్యలు వారికి కొట్టిన పిండి. వారి చేతివ్రేళ్ళమీద వుండేవి. కట్టల కట్టలుగా వ్రాసుకునియన్న నోట్సుల్లోంచి ఏ విషయంపైన కావలసినా చాల సునాయాసంగా బయటకు తీయగలిగేవారు. మొదటినుంచీ పుస్తకం చదువుతు న్నప్పుడే నోట్సు వ్రాసుకోటం వారికి చిరకాలపు అలవాటు. ఆ విధంగా వారు చరిత్ర పరిశోధన చేసి వ్రాసిపెట్టుకున్నఅనేక నోట్సుల కట్టలు చాలవిలువైన ఖజానాలాంటివి చరిత్రపరిశోధకులకు చాల ఉపయోగ పడగలవి ఇంకా ఉన్నాయి. వారి అముద్రిత గ్రంథములు, వ్యాసములు కూడా చాలవున్నవి. ముఖ్యంగా [[కథలు]] గాథలు 5 మరియ 6 భాగములు చాల విలువైనవి. వెంటనే ముద్రింప తగినవి. వారు చేసిన సాహిత్యకృషి వారి పుస్తకాలు వ్యాసాలు చెప్ప గలవు. న్యాయవాది వృత్తి, సాహిత్య కృషి, స్వాతంత్ర్యోద్యమములో జైలుకి[[కారాగారము|జైలు]]<nowiki/>కి వెళ్ళటం అనివార్యమైన స్థితిలో కూడా వారు వివిధరకాలుగా చేసిన కృషి విషేంచి చెప్పదగినవి. వాటిల్లో కొన్ని క్లుప్తంగా
# [[ఆంధ్ర]] [[మద్రాసు]] ప్రావిన్సల పై విపులమైన సమాచారము [[గాంధీ]]గారి హయామ్ లో కాంగ్రెసు అధిష్ఠానానికి పంపిచారు
# స్వాతంత్ర్యోద్యమములో [[కాంగ్రెసు]] కార్యకర్తలకు బోధపడేటట్లు కీలక రాజకీయ విషయములు, ప్రజాప్రభుత్వ విధానములు, బ్రిటిషవారు మనదేశంలో చేస్తున్నపక్షపాతపు పరిపాలన, వారు మనప్రజలను మన దేశ నిధులను ఏవిధంగా దోచుకుంటున్నదీ మొదలగు విషయముల గురించి అనేక కరపత్రములు వ్రాశారు
పంక్తి 56:
# ఆంధ్ర ప్రభుత్వమువారు వారి జ్ఞాపకాలను రికార్డు చేసారు. ఆవిధంగా వారు చేసిన కృషి వివరాలు వారి సాహిత్య కృషితో జతపర్చటమైనది.
“Family History and diary of chronological events” అని పేరుతో ఒక పెద్ద డైరీలో 1815 నుండీ వారు తన సొంత విషయాల్తో పాటుగా ఆకాలంనాటి గోదావరి ప్రోవిన్సు, పిఠాపురం జమీందారీ ఎస్తేటు పరిసర ప్రాంతాలకు సంబంధించినవి కూడా వ్రాశారు. ఎందువలనంటే వారి పితామహులైన దిగవల్లి తిమ్మరాజుగారు ఆకాలంలో రాజమండ్రి- [[కాకినాడ]]- పిఠాపురం (ఆనాటి రాజమండ్రీ జిల్లా) లో కంపెనీ ప్రభుత్వము వారి వున్నతో ద్యోగి (1820లోఇంగ్లిషు రికార్డు కీపర్ తరువాత 1850 లో హుజూర్ సిరస్తదారు). వారి పితామహుని కాలం నాటివి గోదావరి జిల్లాకి, [[పిఠాపురం]] జమీందారీకి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ రికార్డులు నుంచి శివరావు గారు బహుముఖ కృషితో సంపాదించి వ్రాశారు. వారి తండ్రి గారి కాలం 1850 -1908 మరియు తన జీవితకాలం 1898-1992 మధ్య కాలం లోని సంఘటనలు శివరావుగారి డైరీలో వ్రాశారు . 1923 నుండీ 1947 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో[[కృష్ణాజిల్లా]]<nowiki/>లో ముఖ్యంగా బెజవాడలో[[బెజవాడ]]<nowiki/>లో గాంధీమహాత్ముని సహాయనిరాకరణోద్యమము ఉప్పు సత్యాగ్రహము మొదలగు స్వాతంత్ర్య పోరాటమునకు సంబంధించన ఉద్యమాల సంఘటనలు చాలా విపులంగా వ్రాసుకున్నారు. ఆంతేకాక తన డైరీలో “Reminiscences” అని పేరుతో వారికి ప్రీతి కరమైన విషయాల పై విశదంగా అనుభవాలు జ్ఞాపకాలు వ్రశారు. ఉదాహరణకు వారి రాజమండ్రీలో 1910 -1916 మధ్య అనుభవాలు, మద్రాసులో 1916 - 1922 ప్రెసిడెన్సీ కాలేజీ, విక్టోర్యా హాస్టలు జ్ఞాపకాలు వ్రాసుకున్నారు. వారి సమకాలీకులు విక్టోర్యా హాస్టలలో నున్న ఇంజనీరింగ్, వైద్య, సాహిత్యము, న్యాయ విభాగపు విద్యార్థులు తెలుగువారు వారి వారి జీవితకాలాంతరమూ శివరావుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు వుండేవి. అటువంటివారి కొందరి పేర్లు చెప్పక తప్పదు: అడవి బాపి రాజు, [[వెలిదండ్ల హనుమంతరావు]] L.M&S, డా. చాగంటి సూర్యనారాయణ MBBS, డా. దండు సుబ్బారెడ్డి M.D, [[యల్లాప్రగడ సుబ్బారావు]] L.M&S.,Ph.D (U.S.A), [[డా గోవిందరాజుల సుబ్బారావు]], [[డా అమంచర్ల శేషాచలపతి రావు]] [[కె యల్ రావు]] (కానూరి లక్ష్మణ రావు) M.Sc., Ph.D. (కేంద్ర మంత్రిగా చేశారు) [[టి. యస్ అవినాశ లింగం]] (మద్రాసు రాష్ట్ర మంత్రి గాచేశారు), [[యమ్. భక్త వత్సలం]] ( మద్రాసు రాష్ట్ర ముఖ్య మంత్రిగా చేశారు ) [[కోకా సుబ్బారావు]] ( భారత ప్రధన న్యాయ మూర్తిగా చేశారు) [[పోతాప్రగడ శ్రీరామారావు]], (తణుకులో న్యాయవాదిగా చేశారు )
 
==వంశ చరిత్ర : పుట్టుపూర్వోత్తరాలు==
 
[[దిగవల్లి]] అనే గ్రామం [[కృష్ణాజల్లా]]లో [[నూజివీడు]] తాలూకా లోనున్నది. శివరావు గారి [[పితామహుడు]] [[దిగవల్లి తిమ్మరాజు]] గారి పూర్వులు దిగవల్లి దగ్గిర కొయ్యూరు గ్రామంలో వుండి, బొమ్మలూరు రమణక్కపేటలో భూములు కలిగనవారు. వారి వంశీయులు సంప్రతీ కరణాలు. అంటే చుట్టుప్రక్కల గ్రామ కరణ సమూహమునకు పెద్ద కరణంగా మిరాస్మీ అనే హక్కు కలిగి గ్రామంలో జరిగే కార్యకలాపై లావజ్మల్ అనబడే ఫీజు వసూలు చేసుకునే హక్కు గల కరణాలు. తిమ్మారాజు గారి జీవిత కాలం 1794 - 1856. వారు చిన్ననాటనే 1807 సంవత్సర ప్రాంతంల్లో [[కొయ్యూరు]] గ్రామం వదలి [[ఏలూరు]] లోకొంతకాలం వుండి [[ఇంగ్లీషు]], [[పార్సీ]] భాషలు చదువుకుని అక్కడనుండి ఉద్యోగాన్వేషణలో [[రాజమండ్రీ]]కి చేరి [[ఇంగ్లీషు]] వారి [[ఈస్టుఇండియా]] కంపెనీ ప్రభుత్వంలో మొట్టమొదలుగా 1811 లో రాజమండ్రి డిస్ట్రి క్టు కోర్టులో ‘ఇంగ్లీషు రికార్డు కీపర్’కు అసిస్టెంటుగా ప్రవేశించి తరువాత 1820 లో [[కాకినాడ]]లో [[కలెక్టరు]] కార్యాలయంలో ఇంగ్లీషు రికార్డు కీపర్ గా చేశారు. ఆ తరువాత పిఠాపురంలో శిరస్తదారుగా నియమింపబడ్డారు. వారికి కలేక్టరు రాబర్టసన్ గారు 1922 లో నివాసగృహ నిమిత్తము 8640 చదరవు గజములస్తళమును కాకినాడలో రాబర్టసన్ పేటలో ఇచ్చినట్లు గోదావరి జిల్లా రికార్డులలో ఉంది. ఆస్దళములోఆస్దలములో తిమ్మారాజుగారు రెండుమండువాల పెద్ద ఇంటిని నిర్మిచుకన్నారు. తిమ్మరాజుగారు 1828 లో కాకినాడలో[[కాకినాడ]]<nowiki/>లో శ్రీ భీమేశ్వరాలయ గోపురం, 1931 లో ఆ గుడి పూర్తిగా కట్టించి నట్టుగా ఆ గుడిలోని [[శిలాశాసనం]] వల్ల తెలుస్తున్నది.
1850 లో తిమ్మరాజు గారు కంపెనీ ప్రభుత్వంలో హూజూర్ సిరస్తాదారుగా నెలకి రూ 250 జీతంపై పనిచేస్తున్నారు. వారు చేసిన పెద్ద ఉద్యోగాల కారణంగా రాజమండ్రీ జిల్లా (తదుపరి గోదావరి జిల్లా) లో ప్రభుత్వపు రికార్డులలో తిమ్మరాజుగారిని గూర్చిన రికార్టు వుంది [[పిఠాపురం]] జమీందారైన రావుసూర్యారావు గారు 1850 లో చనిపోగా తిమ్మరాజుగారిని కంపెనీ ప్రభుత్వం వారు పిఠాపురం సంస్థానంకి కోర్ట్ ఆఫ్ వార్డ్సు (Court of Wards) మేనేజరుగా నియమించారు. ఆవిధంగా వారు 1850 లో రెండు ఉద్యాగాలు నిర్వహించారు . 1834 లోవారు జొన్నలగడ్డ కొండయ్య కొత్తపల్లి అమల్దార్ల అన్యాక్రాంత లావాదేవిల వ్యవహారంలో తిమ్మరాజు గారు విచారణ జిరిపి కలెక్టరుకు పంపిన రిపోర్టు (అప్పటి రాజమండ్రీ జిల్లా )గోదావరి జల్లా రికార్డులో చేర్చబడి యున్నది.<ref>Godavari District Record Volum4484/19-23 Letterof District Collector to the Board of Revenue , page 345 Report of Colector Mr.Crawley Proceedings of the Board of Revenue dated 26/09/1835 Volune4660/703</ref>. [[ధవళేశ్వరం]] ఆనకట్ట కట్టే రోజుల్లో తిమ్మరాజు గారి పనిలో లోపం కలిగనదని ఆనకట్ట నిర్మాణ కమీషనర్ వారికి ఒక అణా జుల్మానా విధించగా తిమ్మారాజు గారి అపీలుపై [[జిల్లా కలెక్టరు కార్యాలయం|జిల్లా కలెక్టరు]] విచారణ జరిపించి వారు నిజాయతి పరులని, తెలుసుకుని జుల్మానా రద్దు చేసినట్లుగా జిల్లా రికార్డులో వున్న సంగతి శివరావు గారు బయటకు తీసి వారి కథలు గాథలు పుస్తకంలో వ్రాశారు.<ref>కధలు గాధలు (2010)1 వ భాగం దిగనల్లి వేంకట శివరావు పేజీ9-18</ref>. తిమ్మరాజుగారి పనిచేసిన పదవులు కీలకమగుట వల్ల గోదావరి జల్లా రికార్డులలో వారి ద్వారా జరిగిన ప్రభుత్వ వ్యవహారాలలో వారి గురించి ప్రత్యక్షాధారాలు కనబడ తాయని శివరావు గారు చరిత్రపరిశోధనా[[చరిత్ర]]<nowiki/>పరిశోధనా దృష్టితో రికార్డులన్నీ వెదకి వారి తాతగారికి సంబంధించిన అనేక సంఘటనలు సేకరించి వారి దైనిక చర్యలు, వారి కాలం నాటి విషయాలెన్నో డైరీలో వ్రాశారు. తిమ్మరాజుగారు 1856 లో మరణించారు. తిమ్మరాజుగారు 1811 ఉద్యోగంలో చేరేనాటికి కాకినాడ, రాజమండ్రీ, మొగలుతుర్రు డివజన్సు కలిపి [[మచిలీపట్టణం]] కలెక్టరు క్రింద వుడేవి. [[గోదావరి జిల్లా]] అనేది లేదు. 1820 లో [[రాజమండ్రీ]] జిల్లా అనేది వచ్చింది. ఆజిల్లా కలెక్టరు ప్రధాన కార్యాలయాలు కాకినాడలోనుండేవి. ఆసంవత్సరంనుండే వారిని జిల్లాకలెక్టరు కార్యాలయంలో ఇంగ్లీషు రికార్టు కీపరుగా నియమించారు.
 
దిగవల్లి తిమ్మరాజు గారి పెద్ద కుమారు వెంకట శివరావుగారు (1829- 1890) మన శివరావుగారికి పెద తండ్రి. వారు పిఠాపురం దివాన్ గా చేశారు. రెండవ కుమారుడు వెంకటరత్నంగారు (1850 -1908) మన శివరావుగారి తండ్రి. వారు తహసిల్దార్ గా గోదావరి జల్లాలో అనేక చోట్ల పనిచేసి కొవ్వూరులో సబ్ మేజస్ట్రేటుగా 1905 లో రిటైరైనారు. వారి రెండవ భార్య సంతానం మన శివరావుగారు, వారి అక్కగారు సీతాబాయమ్మగారు (బొడ్డపాటి పూర్ణయ్యగారి భార్య ). శివరావు గారి తండ్రి మొదటి భార్యసంతానం ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. శివరావు గారు 14/02/1898 తేదీన కాకినాడలో వారి స్వగృహమందు జన్మిచారు. తండ్రి గారు తన ఆదాయమునకు మించి న ఖర్చులతో ఆనేక సంతర్పణలు, సమారాధనలు, దేవకళ్యాణాలు, దాన ధర్మాలు, బ్రాహ్మణ సత్కరణలతో క్రమ క్రమంగా ఆస్తినంత తాకట్టు పెట్టి అప్పుల పాలై 1908 లో పరమదించారు. అప్పటికి శివరావుగారు 10 ఏండ్ల ప్రాయం. ఆప్పటిదాక శివరావు గారికి విద్యాభ్యాసమే లేదు. శివరావు గారి సవతి అన్నగారు వీరి కన్నా 25 ఏండ్లు పెద్ద ( వారు [[ఉయ్యూరు]] జమీందారుకు 1918-1922 మధ్య దివాన్ గా చేశారు ) . కాని దురద్రుష్టవశాత్తూ అన్నగారికి వారు తమ్ముడైన శవరావుగారి మీద అప్పట్లో దయ కలుగలేదు. అందువల్ల ఏడాదిక్రితమే పెళ్ళి అయిన అక్కగారి పెనిమిటి క్యాలికట్లో టెలిగ్రాఫి మాస్టరుగా నున్న బొడ్డపాటి పూర్ణయ్యగారు శివరావుగారిని వారి తల్లినీ ఆదరించి క్యాలికట్ ([[కేరళ]] రాష్ట్రం ) తీసుకుని వెళ్ళారు.
 
==సాహిత్య కృషి==
వృత్తి రీత్యా శివరావు గారు న్యాయ వాదైనా వారు సాహిత్యాభిలాషి. వారి జీవితం సాహిత్య కృషి కే అంకితం. శివరావు గారి సాహిత్యాభి రుచి చిన్నానాటి నుండే. పద్నాల్గెండ్ల ప్రాయంలో రెండవ ఫారంలో చదువుతుండగా 1912 లో వీరేశలింగం గారి సతీమణి గారి స్మారకోత్సవం శివరావు గారి ప్రార్థన భక్తచింతామణి పద్యాలు తోటి ప్రారంభం అయింది. అప్పట్ణుండీ రాజమహేంద్రవరంలో[[రాజమహేంద్రవరం]]<nowiki/>లో సారస్వత సభలలో బాలుడైన శివరావు గారు చదవే భక్తచింతామణి పద్యాల ప్రార్థనతో ప్రారంభించటం పరిపాటి. వారు 3 వ ఫారంచదువతున్నప్పుడు చిలకమర్తివారి రామచంద్ర విజయమును పూర్తిగా వ్రాసినందుకు వారి క్లాస్ మాస్టారు భక్తచింతామణి (3వ సంకలనం) పుస్తకమును బహుకరించారు.. ఆరేళ్ల తరువాత, 1919 లో భక్తచింతామణి రచించిన [[వడ్ఢాది సుబ్బారాయుడు]]గారే స్వయంగా వారి చేతి దస్కత్తుతో భక్త చితామణి 8 వ సంకలన మును శివరావు గారికి బహుకరించారు. 1913 లోఆంధ్రభాషాభి వర్ధిని (చిలకమర్తి వారు స్దాపించి న సారస్వత సభ) లో సభ్యలుగా చేరారు. 1914 లో శివరావు గారి వ్యాసం “స్త్రీ విద్య” ఆలమూరు వెంకటరాజుగారి వ్యాసంతో పాటు గృహనిర్వాహకము అను చిన్నపుస్తకములో ముద్రింప బడింది. 1914 లో ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజము వార్షికోత్సనము అధ్యక్షుడుగా [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారు, కార్యదర్శిగా [[అద్దంకి సత్యనారాయణ శ]]ర్మగారు, సభ్యులుగా [[మైనంపాటి నరసింహ రావు]], [[అడవి బాపిరాజు]], బంధా వీరనారాయణదేవు, గుడిపాటి సూర్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, ఈరంకి నరసింహము, సూరంపూడి కనకరాజు, దిగవల్లి వెంకట శివరావు, పోణంగిపల్లి సత్యనారాయణ, చింతపెంటవెంకట రమణయ్య, వాసిరెడ్డి వీరభద్ర రావు, [[కవికొండల వెంకటరావు]] తదితరులు. ఆ వార్షికోత్సవాల సమావేశాలకు అనేక ప్రసిధ్ధ పురుషులు అధ్యక్షత వహించారు. వారిలో కొందరి పేర్లు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, [[శ్రీపాద కృష్ణమూర్తి]] గారు, [[చిలుకూరి వీరభద్రరావు]] గారు, [[వంగూరి సుబ్బారావు]] గారు, [[చెలికాని సుబ్బారావు]] గారు, [[నాళం కృష్ణారావు]]గారు, వడ్డాది సుబ్బారావుగారు,[[కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి]] గారు అలా 1914 లో జరిగిన సమావేశం లోశివరావు గారు స్త్రీ విద్య మీద ప్రసంగించారు. ఇంకో సారి “హిందూమహా జనులమతసభ, అనబడిన సమావేశం లో కందుకూరి వీరేశలింగం గారు కూడ హాజరైవున్నప్పుడు శివరావు గారు రామానుజాచారి పాత్ర వహించి తను రచించిన పద్యం చదవగా వీరేశలింగం గారు చాల ప్రసన్నులైయ్యారు. 1915-1916 సంవత్సరం లో SSLC క్లాసులో ఇంగ్లీషు పరీక్షలో ఉన్నత మార్కలుతో4 సెక్షన్ల మీద మొదటి స్దానం లో నిలిచినందుకు వారి క్లాస్ మాస్టారు గజవల్లి రామచంద్రరావు M.A గారు Life of Gladstone by John Morley 3 volumes బహుకరించారు. రాజమండ్రీ జ్ఞాపకాల్లో వారి డైరీ లో చిలకమర్తివారి కీ శ్రీపాద కృష్ణమూర్తిగారికి వకరిమీద వకరు ఎద్దేవపుర్వక వాదోపవాదాలు జరుగుతూవుండేవని వారి డైరీ లోరాజమండ్రీ జ్ఞాపకాలలో వ్రాసుకున్నారు. 1916 లో మద్రాసు ప్రసిడెంసీ కాలేజీ లో ఇంటర్మీడియట్ చదువుతుండగా “హత్యా ఛాయ” అను నవల తెలుగులో వ్రాశారు. ఆ నవల ఆధారంగానే 1929 లో నీలాప నింద అను పుస్తకము ప్రచురించారు. 1918 లోఇంటర్లో[[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] ఫైనల్ వుడగా [[మద్రాసు]] రాజధాని కాలేజీ తెలుగు విద్యార్థుల ఆంధ్ర భాషావర్ధని సమాజం తరఫున శివరావు గారు ఆంధ్ర వాణి అనేటివంటి చేతివ్రాత పత్రికకి సంపాదకులుగా వుండేవారు ఆపత్రికలో “ విడువము” అనే పేరుతో వ్రాశిన సంపాదకీయ ప్రచురణను చాలమంది అభనందించారు శ్రీ నూతక్కి రామశేషయ్య గారు (తదుపరి జయపూరు దివాన్ గాచేశారు ) చాల అభినందించారు. భహ్మశ్రీ వావిలకొలను సుబ్బారావు గారు ఆ చేతివ్రాత పత్రిక అభిమానులు. అదే కాలంలో 1918 లో శివరావు గారికి మద్రాసు సాధు సంఘం వారు శివరావు గారు వ్రాసిన “ రాజ భక్తి” అను వ్యాసమునకు రజత పతాకం బహుకరించారు. ఆ పతకం మద్రాసు జిల్లా కలెక్టురు గారు ప్రోగ్రెసివ్ యూనియన్ హాలు జరిగిన బహిరంగ సభలో బహుకరించారు. 1919 లో శివారవు గారు బి.ఏ చదువుతుండగా శ్రీ కృష్ణదేవరాయలు మీద వ్రాసిన వ్యాసం ఎమ్.పి శర్మ గారు మద్రాసులో సంపాదకులు గావున్న విద్యావిశాఖ పత్రికలో ప్రచురించ బడింది. 1919–1920 సంవత్సరంలో శివరావుగారు వ్రాసిన ఆత్మ విశ్వాసము అను వ్యాసమునకు [[చెన్నై|మద్రాసు]] రాజధాని కాలేజీ వారు చిరకాలంగా ప్రతీఏటా 1875 నుంచీ ఇస్తూవచ్చిన రూ 20 బౌరదల్లన్ బహుమతి 1919 సంవత్సలో శివరావుగారికి వచ్చింది. అంతకు పూర్వం ఆ బౌరదల్లన్ బహుమతిని పొందినవారిలో 1875 లో [[తల్లాప్రగడ సుబ్బారావు]] ( 1850-1890) ( సుబ్బారావు గారు మద్రాసు థియోసఫికల్ సొసైటీకి శక్రటరీ చేశారు, అనిబిశంటు కన్నా ముందు ). తరువాత 1891 లో వేపారామేశం గారికి ( వేపారామేశం గారు మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు ) పానుగంటి రామారాయణింగారికి in 1892, పెద్దిభొట్ల వీరయ్యగారికి 1894 and [[దాసు విష్ణురావు]] గారికి 1895 లోను వచ్చినట్లుగా శివరావు గారి డైరీ లోవ్రాసుకున్నారు. చిన్ననాటినుండీ వారు గాంధీగారి సత్యాగ్రహ ఉద్యమం, స్వాతంత్ర్యపోరాటానికి వారి ఉపాధ్యాయుల ప్రేరేపణ వారి మనస్సుకు బాగా నాటుకున్నాయ. 1913- 1914 సంవత్సరం స్కూలు విద్యార్థిగానుండగనే రాజమండ్రీలో వారు గాంధీగారు [[దక్షిణాఫ్రికా]]లో చేసే [[సత్యాగ్రహం|సత్యాగ్రహ]] ఉద్యమసహాయానికి నిధులు పోగుచేశి పంపిచారు. 1920 లో లాకాలేజీలో జేరేట్టప్పటికే గాంధీగారి సహాయనిరాకరణోద్యమము కొనసాగుతుండటం వారి మనస్సు ఆందోళనకు గురై స్వాతంత్ర్యపోరాటంలో తను కూడా పాలు పంచుకోవాలనే ఒక గట్టి సంకలనం రావటం జరిగింది. వారు ఎలాగో లాకాలేజీ చదువు పూర్తిచేసుకుని బయట పడుతూనే కాంగ్రెస్ రాజకీయాల్లో తన శక్తికొలది బాధ్యతలు నిర్వహించారు. లాకాలేజీలో జేరబోయే ముందు 1919 సంవత్సరం ఎండా కాలపు శలవలకి శివరావుగారు బొంబాయికి వెళ్లారు . అవి రౌలట్ బిల్లు తిరస్కారానికి తీవ్ర ఆందోళన చెస్తున్న రోజులు. ఆక్కడ బోంబే క్రానికల్ పత్రిక (బి.జి హర్నిమన్ సంకలనంచేసే పత్రిక ) సత్యాగ్రహ ఉద్యమాన్ని చాల అనుకూలంగా ప్రచురించేటటువంటి పత్రిక (ఆకారణంగా హర్నిమన్ నుకు దేశాంతర శిక్ష విధించారు deported ) శివరావు గారు ఆ పత్రికలో ప్రచురించిన వ్యాసాలు, విశేషాలు కత్తిరించి ఒక ఫైలలో అతికించుకుని తిరుగు ప్రయాణంలో బెజవాడకు వస్తుండగా ఒక సి ఐ ఢి పోలీసు రైలు బండి లోకి వచ్చి ఆ ఫైలు తనతో అట్లా తీసుకును వెళి తే తంటాల్లో పడతావని హెచ్చరించాడుట. మద్రాసులో లా చదువుతూవుండగనే 1920 నవంబరులో లియో టాల్సాయి, రంబీంద్రనాధ్ రచించిన 23 కథలు “కోడి గృడ్డంత వడ్లగింజ , మేము మీకు పట్టముగట్టితిమి, పధ్నాలుగేండ్ల ప్రాయము” అను 23 కథలు వారు తెలుగులో వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర పత్రికలో ప్రచురితమైనవి. 1891 లో దాసు కేశవరావు గారు బెజవాడలో నడుపుచున్న జ్ఞానోదయము అను వార పత్రికలో1922 ఆ ప్రాంతములో శివరావు గారు రచించిన వ్యాసుములువ్యాసములు హైందవ నాటకరంగము, హైందవ వనోద కథలు అను రెండు వ్యాసములు చురితమైనవి
[[దస్త్రం:చళ్ళ పిళ్ళ వెంకటశాస్త్రి గారు.pdf|thumbnail|కుడి|దిగవల్లి వేంకటశివరావు చెళ్ళపిళ్ళ వేంకటశివరావుకు వ్రాసిన ఉత్తరం]]
1922 నుండీ న్యాయవాది వృత్తితోపాటు సాహిత్యం, స్వాతంత్ర్యపోరాటం
 
1922 లో న్యాయవాది వృత్తిలో ప్రవేశిస్తూనే వారు ఒకప్రక్క గాంధీగారి[[మహాత్మా గాంధీ|గాంధీ]]<nowiki/>గారి ఆధర్వాన జరిగే జాతీయ ఉద్యమాల ఆందోళనల దిశానిర్ధేశాల ప్రకారం కృష్ణా జిల్లాలో జరిగే ఆందోళనకు మదత్తుగా కృషి చేయటం ఇంకొక ప్రక్క ఏమాత్రం సమయం వృధా చేయకుండా సాహిత్య కృషి చేయటం న్యాయవాది వృత్తితోపాటు గణ నీయం. వారు చేసిన సాహిత్య కృషి ప్రశంసనీయము బెజవాడలో నున్న రామమోహన లైబ్రరీలో నున్న చరిత్ర సాహిత్యమీద వున్న అనేక పుస్తకాలు చదవటమే కాక మద్రాసులోని కొన్నెమరా లైబ్రరీ నుండి తనకు కావలసి న పుస్తకాలు ఇంటికి తెప్పించుకునే ఏర్వాటు రామమోహన లైబ్రరీ వారి ద్వారా చాలా సంవత్సారలుగా శివరావుగారికి వుండేది. ఆ విధంగా వారు అనే క పుస్తకాలు మద్రాసునుండి తెప్పించుకును బహు విధ కృషి చేసి అనేక చారిత్రాత్మక విషయాలు తెలుగు వారికోసం అనేక పుస్తకాలు వ్యాసాలు వ్రాయగలిగారు. 1922 బి యల్ ఆఖరి సంవత్సరంలో వుండగనే ఆంధ్రుల సం స్క్రుతిక చరిత్ర అనే వారి వ్యాసం బొంబాయి లోని తెలుగు సమాచార్ అనే పత్రికలో ప్రచిరుతమైనది. పట్టాపుచ్చుకుని జూన్ 1922 లో బెజవాడలో న్యాయవాది వృత్తిలో ప్రవేశించి న తరువాత శ్రీ [[కురుగంటి సీతారామయ్య]] గారు M.A (was Head Master) నడుపుచున్న విద్యార్థి అను పత్రికలో శివరావు గారి వ్యాసములు (1) భారతీయుల లలిత కళలు (2) జాతీయవిద్య ప్రచురితమైనవి. 1923-24 లో “చిన్న కథలు”, “మన దారిద్య్రము”, “ తెల్మా ([[నార్వే]] దేశపు నవలాధార కధ) అను వ్యాసములు శ్రీ [[దుగ్గిరాల రాఘవచంద్రయ్య]] గారు బెజవాడనుండి పచురించే స్వరాజ్య పత్రికలో ప్రచురించ బడినవి. 1922 లో ప్రెసిడెంసీ కాలేజీ లో వ్రాసిన పోటీ వ్యాసము పోతన-వేమనుల వారి కాలము, కృతులు నకు శివరావుగారికి 1924 పొవెల్ మోరహెడ్ ప్రాదేశిక భాషల బహుమతి రూ 150 ఇచ్చారు. ఈ వ్యాసము నే ఆధారంగా చేసు కు ని 1924 లో పోతన వేమనలయుగము అనే పుస్తకము ను ప్రచురించారు. ఆ పుస్తకము[[వావిలకొలను సూరయ్య]] గారు, [[కొడాలి ఆంజనేయులు]] గారు నడిపేటటువంటి శారదాభాండారు ప్రెస్సు లో ముద్రితమైనది. 1923 లో కాకినాడ కాంగ్రెస్సు సదస్సుకు శివరావరు గారు కూడ వాలంటరీ భాద్యత లో వెళ్లారు. 19/08/1922 టంగుటూరు ప్రకాశం గారు ఉత్తరంవ్రాసి వారి స్వరాజ్య పత్రికకు స్పెషల్ కరెస్పాండెంటు గా వుండమని వ్రశారు అందు కు అంగీకరించిన శివరావు గారు 1922 కాకినాడ కాంగ్రెస్సు కు వచ్చిన [[దుగ్గిరాల గోపాల కృష్ణయ్య]] గారిని ఇంటర్వ్యూ చేసి స్వరాజ్యకి పంపిన రిపోర్టు ప్రచురితమైనది. 1925 లో [[వేలూరి సత్యనారాయణ]] గారి పుస్తకం బౌధ్ధమహా యుగం లో శివరావుగారి గారి సాహిత్యకృషి ని గూర్చి చెప్పారు. ఆదే సంవత్సరం లో [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారు [[సింగరాజు వెంకట సుబ్బారావు]] గారింట్లో వుండగా డా [[ఘంటసాల సీతారామ శర్మ]]గారు శివరావుగారికి మొదటిసారిగా [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారిని పరిచయం చేయగా వారు శివరావుగారిని తమ భారతి మాస పత్రిక కు వ్యాసాలు వ్రాస్తు వుండమని అప్పట్ణుంచీ భారతి ని శివరావుగారికి కాంప్లిమెంటరీ గా పంపిచే ఏర్పాటు కూడా చేశారు. రాజమండ్రీలోని హితకారణి స్కూలుకు పూర్వవిధ్యార్ధుల సంఘం కోరిక పై 1925 వార్షికో త్సవం కు శివరావు గారు అధ్యక్షత వహించారు. [[అయ్యదేవర కాళేశ్వరరావు]] గారి ప్రేరేపణపై శివరావుగారు 1927 లో “దక్షిణాఫ్రికా” అనే పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకమును మహామత్మా గాంధీ గారికి అంకితమివ్వడానికి గాంధీ గారి అనుమతి కోరుతూ వ్రాయగా గాంధీ గారు శివరావు గారికి స్వయంగా చేతో జవాబు వ్రాశిన పోస్టు కార్డులో వ్రాసిన వాక్యాలు ఈ క్రింద ఇవ్వబడినవి .
 
<poem>