గరికపాటి రాజారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రజానాట్యమండలి కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
ప్రజానాట్యమండలి సాంఘీక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో [[దేవిక]], [[అల్లు రామలింగయ్య]], సంగీత దర్శకులు [[మోహన్ దాస్]] మరియు [[టి.చలపతిరావు]]లు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు మరియు బుర్రకథ కళాకారుడు [[షేక్ నాజర్]] ఉన్నారు.<ref>http://www.idlebrain.com/research/anal/anal-tc4.html</ref>
 
రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన [[రాజమండ్రి]]లో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే కాకినాడలోని [[ఆదిభట్ల నారాయణదాసు]] హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందాడు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, [[హరిశ్చంద్ర]] నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందాడు. తరువాత [[విజయనగరం]]లో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. తండ్రి ఉద్యోగం చేసిన [[సికిందరాబాదు]] లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తూ, పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో [[మద్రాసు]] చేరాడు. మద్రాసులో ఎల్‌.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) డాక్టర్‌ రామదాసు ఈయనకు ప్రాణ [[మిత్రుడు|స్నేహితులు]]. అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వలన రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు<ref>[http://www.prajasakti.com/kurnool/article-20971 ప్రజాకళాకారుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు - ప్రజాశక్తి కర్నూలు సంచిక 2009, సెప్టెంబరు 8]</ref>
 
మద్రాసలో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి [[గుళ్లపల్లి నారాయణమూర్తి]] రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించాడు. మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన [[షాజహాన్]] నాటకం సంచలనాన్ని సృష్టించింది. షాజహాన్‌గా ఎస్‌విఆర్ సాంబశివరావు, జహనారాగా[[జహనారా]]<nowiki/>గా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, [[ఔరంగజేబు]]గా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు. ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం. మద్రాసులో విద్యార్థులను సమీకరించి భమిడిపాటి బాగుబాగు, గాలి బాల సుందరరావు అపోహ వంటి నాటకాలను ప్రదర్శించారు.<ref>[http://archives.andhrabhoomi.net/kalabhoomi/kala5-643 నాటక వైద్యుడు గరికిపాటి రాజారావు - ఆంధ్రభూమి 2010, ఆగష్టు 4]</ref>
 
వృత్తి రీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి [[విజయవాడ]]లోని [[పోరంకి]]లో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవాడు. కొంతకాలం [[రాజమండ్రి]]లోనూ ప్రజావైద్యశాల నిర్వహించాడు.<ref>[http://www.prabhanews.com/remember/article-274394 కళారాధన వైద్యసేవలకు గరికపాటి రాజారావు - ఆంధ్రప్రభ 2012, ఫిబ్రవరి 2]</ref>
 
రాజారావు 1953లో [[పుట్టిల్లు]] సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు [[జమున]] మరియు [[అల్లు రామలింగయ్య]]ను వెండితెరకు పరిచయం చేశాడు. [[పుట్టిల్లు]] సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్థికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు.
 
ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన [[ఆరాధన]] వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు<ref>http://www.cinegoer.com/aradhana.htm</ref>. జైభవానీ నాటకాన్ని ప్రదర్శించే సమయంలో గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారు. అదే సమయంలో దేవుడుచేసిన మేలు చిత్రాన్ని నిర్మించినా ఆర్థిక కారణాలవల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. మానసికంగా కుంగిపోయిన రాజారావు 1963 సెప్టెంబర్ 8న మద్రాసులో మరణించారు.
"https://te.wikipedia.org/wiki/గరికపాటి_రాజారావు" నుండి వెలికితీశారు