నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
'''విగ్రహ వ్యావర్తిని'''
 
ఆచార్య నాగర్జునుడు చెప్పిన శున్యవాదానికి మాధ్యమికవాదం అన్నపేరు ప్రశస్తిలోనికి వచ్చినా, దీనికి అద్వయవాదమని, సర్వధర్మశున్యవాదమని, ప్రతీత్య సముత్సాద వాదమని పేర్లు ఉన్నాయి.అయితే మాధ్యమికవాదం అన్నపేరు దీనికి మిగిలిపోవడానికి ఒక కారణం ఉంది.శాక్యపుత్రీయుని ఆది బౌద్ధంలో బహుతెగలు ఉన్నట్లే, ఆ అనంతరం వచ్చిన శూన్యవాదంలో కూడా తెగలు ఏర్పడ్డాయి.ఇందులో మొదటి తెగ పుద్గలశూన్యవాదం (Pluratism), ఇందులో మరిరెండు శాఖలు ఏర్పడ్డాయి. ఈ ఉపశాఖలలో అతివాదులను సర్వాస్తివాదులని, మితవాదశాఖని వాత్సీపుత్రీయులనీ అంటారు.ఆతర్వాత సర్వధర్మ శూన్యతావాదం బయలుదేరింది. ఇందులో మరలా రెండు శాఖలు.ప్రాసంగికులు;స్వాతంత్ర్యికులు అని. ఇందులో నాగార్జునాచార్యులవారు ప్రాసంగిక శాఖకు చెందినవారు.భావ్యాధి ఇతర తాత్వికులు స్వాతంత్ర్యికులు. ఈ రెండు శాఖలను కలిపి మాధ్యమిక శాఖ అంటారు. నాగార్జునుని తరువాత వేరెవ్వరూ కొంతకాలమ్ ఈ శూన్యవాదాన్ని వ్యాప్తిలోకి తేలేకపోయారు, అటుపై ఇద్దరు మహాపురుషులు గుప్తరాజుల కాలంలో అవతరించారు.ఒకడు [[అసంగుడు]], రెండవవాడు వసుబంధువు. వీరు ఈ శూన్యవాదంలో మూడవ శాఖను నెలకొల్పారు. వీరి శాఖని బాహ్యార్ధ శూన్యవాదం అంటారు ([[wikipedia:Idealism|Idealism]]) <sup>.</sup>
 
అటువంటి శూన్యవాదం గ్రంథమే ఈ విగ్రహ వ్యావర్తిని. దీనిలో 72 శ్లోకములు ఉన్నాయి. ఇందులో నాగార్జుని జీవిత చరిత్ర గురుంచి మొదటగా వ్రాయబడింది. అందు నాగార్జునుడు వేదలి గ్రామవాసులు అని వ్రాయబడింది.ఇందులో ప్రతీర్య సముత్పాదముగతి, కాలము, ఆత్మ, తధాగతుడు, స్వభావము, విపర్యాసము, దృష్టి, నిర్వాణము, మొదలైన ధర్మాలగురుంచి నాగార్జుని పరీక్ష, వివరణ కనబడుతుంది. ఆ పిమ్మట శున్యవాదాన్ని గురుంచి నైయాయిక, వైశేషిక, భాట్ట, అద్వైతీత్యవాదులు చెప్పిన విగ్రహ పరిశీలనం ( విగ్రహం అంటే దూషణం) జరుగుతుంది.జైనుల వలే ఇందులో నాగార్జునుడు నీతి మార్గాన్ని బౌద్ధ ధర్మంగా ప్రధానంగా వివరించారు.
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు