తిరుపతి వేంకట కవులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, [[మెరుపు]]లా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి [[వినాయక చవితి]] ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది.
 
వేంకట శాస్త్రి [[వారాణసి]] వెళ్ళి తిరిగి వచ్చినాక [[కాకినాడ]]లో జంటగా [[అవధానము (సాహిత్యం)|శతావధానం]] ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా[[గురువు]]<nowiki/>గా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.
 
ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా [[అవధానాలు]] నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు [[అనీబిసెంట్]] ప్రశంసలు అందుకొన్నారు. [[వెంకటగిరి]], [[గద్వాల]], [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]], [[విజయనగరం]], [[పిఠాపురం]] సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.
 
[[పోలవరం]] [[జమీందారు]] వారి ప్రతిభ గురించి తెలిసికొని [[ఎడ్విన్ ఆర్నాల్డ్]] రచించిన [[లైట్ ఆఫ్ ఆసియా]] గ్రంథాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరాడు. తన సంస్థానంలో కవులుగా చేరమని అర్ధించాడు. ఆ విధమైన కట్టుబాట్లకు వేంకట శాస్త్రి వెనుకాడినా తిరుపతి శాస్త్రి ఆయనను ఒప్పించాడు. ఫలితంగా వారు 1901లో [[కాకినాడ]]కు నివాసం మార్చారు. 1889లో పిఠాపురం రాజు ప్రారంభించిన 'సరస్వతి' అనే సాహితీ పత్రిక నిర్వహణా బాధ్యతలు వారికి అప్పగింపబడ్డాయి. ఈ పత్రిక కోసం 'బాల రామాయణం', 'ముద్రారాక్షసం', 'మృచ్ఛఘటికం' గ్రంథాలను వీరు సంస్కృతంనుండి తెలుగులోకి అనువదించారు.
 
1918లో [[పోలవరం]] జమీందార్ మరణం వారిని ఇబ్బందులలో పడవేసింది. అయితే [[గోలంక వీరవరం]] జమీందార్ [[రావు రామాయమ్మ]] వీరికి [[భరణం]] ఏర్పాటు చేసింది.
 
==అవధానాలు==
వీరు తమ గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ప్రోత్సాహంతో కాకినాడలో మొట్టమొదటిసారి జంటగా అష్టావధానాన్ని, ఆ తర్వాత 1890 అక్టోబరులో ఒక శతావధానాన్ని చేశారు. అయితే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అంతకు ముందే కాశీయాత్ర కోసం అవసరమైన డబ్బు కొరకు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[నిడమర్రు]], [[గుండుగొలను]] గ్రామాలలోను, కాశీనుండి తిరిగి వచ్చిన తర్వాత గంగా సంతర్పణ కోసం [[ముమ్మిడివరం]], [[అయినవిల్లి]] గ్రామాలలో [[అష్టావధానాలు]] చేశాడు. కాకినాడ అవధానాల తర్వాత వీరిరువురూ చెలరేగి పల్లెల్లో, పట్టణాలలో, రాజాస్థానాలలో వందలకొద్దీ అవధానాలు చేశారు. [[కాకినాడ]], [[అమలాపురం]], [[ఏలూరు]], [[మచిలీపట్నం|బందరు]], [[నెల్లూరు]], [[విశాఖపట్నం]], [[బెజవాడ]], [[చెన్నై|మద్రాసు]], [[గుంటూరు]], [[రాజమండ్రి]] మొదలైన పట్టణాలలోను, [[గద్వాల]], [[వనపర్తి]], [[ఆత్మకూరు]], [[వెంకటగిరి]], [[విజయనగరం]], [[నూజివీడు]], [[కిర్లంపూడి]] మొదలైన సంస్థానాలలోను శతావధానాలు, అష్టావధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు చేశారు. ఈ అవధానాలన్నింటిలోను తిరుపతిశాస్త్రి ఒక పాదం చెబితే వేంకటశాస్త్రి మరొక పాదం చెప్పేవాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=119-128|edition=ప్రథమ|accessdate=18 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
 
వీరి అవధానాలలో వెలువడిన కొన్ని పద్యాలు: