వేంగి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
క్రీ.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని '''[[వేంగి]] రాజ్యం''' అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని '''[[వేంగి]] నగరం''' లేదా '''విజయవేంగి''' అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం [[పెదవేగి]] అనే చిన్న [[గ్రామం]]. ఇది [[పశ్చిమగోదావరి జిల్లా]]లో [[ఏలూరు]] పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది.
వేంగి రాజ్యం ఉత్తరాన [[గోదావరి నది]], ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన [[కృష్ణా నది|కృష్ణానది]] మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]]<nowiki/>లో ఒక ముఖ్యమైన ఘట్టం. [[పల్లవులు]], [[శాలంకాయనులు]], [[బృహత్పలాయనులు]], [[తూర్పు చాళుక్యులు]] వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. వేంగి రాజ్యం ద్వితీయార్ధంలో, అనగా తూర్పు
[[దస్త్రం:Pedavegi Archeological findings.JPG|right|300px|thumb|పెదవేగి త్రవ్వకాలలో బయల్పడిన శిల్పాలు. అక్కడి శివాలయంలో భద్రపరచబడినవి]]
== "వేంగి" పేరు ==
"వేంగి" అనే పేరు పురాతనమైనదిగా కనిపించడం లేదు. కంచి వద్ద 'వెంగో' లేక 'వేంగి' అనే పేరు ఉన్నదని,
:ఈ దేశము పూర్వము నాగులచే పరిపాలింపబడెడిది. దక్షిణ దేశమందలి నాగులలో "అఱవలార్" ఒక తెగ. [[కాంచీపురం|కాంచీ]] పురమునకు దక్షిణదేశమున ఉండే వారు గనుక ఆ ప్రదేశం "ఆఱవనాడు" అనబడింది. కనుకనే టాలెమీ వంటి విదేశీ చరిత్రకారులు మైసోలియా (కృష్ణానది) దక్షిణ ప్రాంతాన్ని "ఆశార్నోరి" (అర్ వార్ నాయ్) అని పేర్కొన్నారు. మొట్టమొదట కృష్ణా గోదావరి మధ్య దేశం "కూడూహార విషయం" అనబడేది. దానికి రాజధాని "కూడూరా" ([[గూడూరు]] లేక గుడివాడ?). ఏ కారణము చేతనో రాజధాని మార్చుకొనవలసి వచ్చినది. సాలంకాయన గోత్రుడైన పల్లవరాజులలో నొకరు ఒక నూతన [[నగరము]]<nowiki/>ను నిర్మింపజేసి దానికి "బెబ్బులి" అనే అర్ధం వచ్చే "వేంగి" అనే పేరు పెట్టాడు. అక్కడినుండి పాలించే రాజులు వేంగిరాజులని, వారిచే జయింపబడిన దేశాన్ని వేంగి దేశమని అనడం మొదలుపెట్టారు. ... క్రీ.శ. 4 శతాబ్దంలో [[అలహాబాదు]] శాసనంలో వేంగిని ప్రస్తావించారు గనుక అంతకు పూర్వమే అనగా క్రీ.శ. 2వ లేదా 3వ శతాబ్దంలో వేంగి నగరం ఏర్పడి ఉండవచ్చును.
అసలు ఈ చిన్న గ్రామమే ఒకనాటి వేంగి మహానగరమా? అనే ప్రశ్నకు [[చిలుకూరి వీరభద్రరావు]] ఇలా వివరణ ఇచ్చాడు.
:వేంగీ దేశమునకు ముఖ్య పట్టణముగా నుండిన వేంగి నగరం కృష్ణా మండలంలోని యేలూరుకు ఉత్తరాన 8 మైళ్ళ దూరములోనున్నది. ఆ స్థానమున నిపుడు [[పెదవేగి]], చినవేగి అను పల్లెలు మాత్రమున్నవి. వీనికి [[దక్షిణం|దక్షిణము]]<nowiki/>గా 5 మైళ్ళ దూరమున [[దెందులూరు|దెందులూర]]<nowiki/>ను గ్రామము కలదు. ఈ గ్రామమునకు గంగన్నగూడెము, సేనగూడెము అను శివారు పాలెములు చుట్టునునున్నవి. ఇవియన్నియుంగలిసి ఒక మహా పట్ణముగనుండి వేంగీపురమని పిలువంబడుచుండెను. ఈ ప్రదేశమునందు శిధిలమైపోయిన [[శివాలయము]]లు పెక్కులు గలవు. మరియు జ్ఞానేశ్వరుని యొక్క విగ్రహములు నాలుగు దెందులూరుకు దక్షిణముగానున్న చెఱువు సమీపముననుండినవి. వానిలో నొకటి మిక్కిలి పెద్దదిగానున్నది. ఈ గ్రామమునకు [[తూర్పు]] ప్రక్కను భీమలింగము దిబ్బయను పేరుగల యెత్తైన యొక పాటి దిబ్బ గలదు. దానికుత్తరముగా నూకమ్మ చెఱువును, దాని నడుమనొక మట్టి దిబ్బయు, దానిపై రెండు రాతి నందులును గలవు. దానిని నారికేళవారి చెఱువని చెప్పుదురు. వాని గట్లపైని రెండు శిలా శాసనములు నిలువుగానుండియు, మరిరెండు సాగిలబడియు నుండినవి. [[పెదవేగి]]కిని,
అయితే వేంగి అన్న పేరు పూర్వచారిత్రిక దశకు చెందిన అత్యంత పురాతనమైన గ్రామాల పేర్లలో ఒకటిగా డాక్టర్ పి.వి.పరబ్రహ్మశాస్త్రి వర్గీకరించారు.<ref>ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2013 ప్రచురణ:పేజీ.23</ref>
== చరిత్రలో వివిధ దశలు ==
పూర్వ కాలంలో కాలి నడక మార్గాలు, [[ఓడ]] రేవులు జనుల ప్రయాణాలకు, వివిధ సంస్కృతుల మేళనానికి ముఖ్యమైన వేదికలు. [[యాత్రికులు]], పండితులు, వ్యాపారులు, [[కళాకారులు]] ఈ మార్గాలలో ప్రయాణిస్తూ భిన్న సంప్రదాయాల ఏకీకరణకు కారకులయ్యారు. వీటివల్లనే
[[
పెదవేగి సమీపంలో [[గుంటుపల్లె]], [[జీలకర్రగూడెం]], [[కంఠమనేనివారిగూడెం]] వంటి ప్రాంతాలలో క్రీ.పూ. 200 నాటి బౌద్ధారామ అవశేషాలు బయల్పడినందువలన [[శాతవాహనులు|శాతవాహనుల]], [[ఇక్ష్వాకులు|ఇక్ష్వాకుల]], కాలం నాటికే ఇది ఒక ముఖ్యమైన నగరం అయి ఉండే అవకాశం ఉంది. 4వ శతాబ్దంలో ఇక్ష్వాకుల సామ్రాజ్యం (విజయ పురి శ్రీపర్వత సామ్రాజ్యం) పతనమయ్యేనాటికి విజయవేంగిపురం ఒక పెద్ద నగరం. [[విష్ణుకుండినులు|విష్ణుకుండిను]]<nowiki/>ల కాలంలోను, తూర్పు [[చాళుక్యులు|చాళుక్యు]]<nowiki/>ల ఆరంభ కాలంలోను ఆంధ్ర దేశానికి రాజకీయంగాను, సాంస్కృతికంగాను వేంగిపురం ఒక ప్రధానకేంద్రంగా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది.<ref>The Ancient City of Vengipura : Archaeological Excavations at Peddavegi/I.K. Sarma. Delhi, Book India Publishing Co., 2002, ISBN 81-85638-15-2. https://www.vedamsbooks.com/ (''Vijaya Vengipura was a flourishing city in ancient Andhra after the decline of Sriparvata Vijayapuri of the Ikshvaku dynasty by about 4 century A.D. During the Vishnukundi and early Eastern Chalukyan rule Vengipura played a crucial role as a political centre as well as a great cultural capital of Andhradesa'')</ref>
*
* పల్లవులు - క్రీ.శ. 440 - 616 - వీరి రాజధాని [[వినుకొండ]]. వీరి రాజ్యంలో వేంగి కూడా ఒక ముఖ్య నగరం.
* తూర్పు చాళుక్యులు - క్రీ.శ. 616 నుండి 1160 వరకు. పల్లవులనుండి వేంగి నగరాన్ని జయించి కుబ్జవిష్ణువర్ధనుడు (బాదామిలోని తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యంగా) రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యుల కాలం [[తెలుగు]] భాష పరిణామంలో ముఖ్య సమయం. వీరు
== శిధిలావశేషాలు ==
పెదవేగిలోని శిథిలాలు చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా
:132. Mounds containing Buddhist remains - Arugolanu
:133. Mounds locally known as Bhimalingadibba - Denduluru
పంక్తి 36:
[[దస్త్రం:APvillage Pedavegi 1.JPG|250px|thumb|right|పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిథిలాలు (ధనమ్మదిబ్బ?) ]]
పెదవేగిలోని ధనమ్మ దిబ్బ వద్ద జరిపిన త్రవ్వకాలలో దిబ్బ మధ్యన పెద్ద రాతి కట్టడము బయల్పడినది. దీనిని ఒక [[బౌద్ధ మతము|బౌద్ధ]] స్థూపముగా గుర్తించారు.
ఆ ప్రదేశములో దొరికిన వస్తువులలో మట్టి పాత్రలు, ఒక రాతి బద్దలో చెక్కబడిన నంది, [[పూసలు]], కర్ణాభరణాలు మరియు పాచికలు కూడా ఉన్నాయి. ఇంకో ప్రత్యేక కనుగోలు పారదర్శకమైన కార్నేలియన్ రాయితో తయారు చేసిన ఒక అండాకార భరిణె. 2x2x6 సె.మీల పరిమాణము కలిగిన ఈ భరిణపై ఒక దేవతామూర్తి చెక్కబడిఉన్నది. ఇది నగరాన్ని పర్యవేక్షించే [[గ్రామ దేవతలు|నగర దేవత]] అయ్యుండవచ్చని పురావస్తు శాఖ భావిస్తున్నది.<ref>http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html</ref> చాలా శిల్పాలను
వేంగి రాజులు, ముఖ్యంగా శాలంకాయనులు "చిత్రరధస్వామి"ని పూజించినట్లు తెలుస్తున్నది (''భగవత్ చిత్రరధస్వామి పాదానుధ్యాతః''). ఈ చిత్ర రథ స్వామి
("bhagavat Citraraihasvami padanudhyatah"). Sanskrit Lexicons
give Citraratha as the name of the sun, the vahana of Agni and some
పంక్తి 61:
మౌర్య సామ్రాజ్యం క్రీ.పూ.322 నుండి క్రీ.పూ.185 మధ్యకాలంలో వర్ధిల్లింది. మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం కళింగ రాజుల అధీనంలో ఉండేది. మౌర్యుల కాలంలో వేంగి రాజ్యం గురించి గాని, నగరం గురించి కాని ఏమీ ఆధారాలు లేవు. కాని సమీపంలో ఉన్న [[గుంటుపల్లె]]లోని బౌద్ధారామాలు క్రీ.పూ. 200 నుండి క్రీ.శ. 300 వరకు (అనగా బౌద్ధ మతం ఆరంభ కాలంనుండి) విలసిల్లాయి గనుక, బౌద్ధాన్ని మౌర్యులు ఆదరించారు గనుక, అప్పుడే ఈ ప్రాంతానికి కొంత ప్రాముఖ్యత ఉండేదని గ్రహించవచ్చును.
శాతవాహనులు క్రీ.పూ. 230 నుండి క్రీ.శ. 250 వరకు [[దక్కన్ పీఠభూమి|దక్కన్]] ప్రాంత రాజ్యాన్ని ఏలారు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం అధికారంలోకి వచ్చిన శాతవాహనులు బౌద్ధాన్ని, వైదిక ధర్మాన్ని కూడా ఆదరించారు. కనుక వారి కాలంలో కూడా ఈ ప్రాంతానికి కొంత ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చును. అంతే కాక వారి కాలంలో విలసిల్లిన అనేక బౌద్ధ క్షేత్రాలు ఈ సమీపంలో ఉన్నాయి.
== ఇక్ష్వాకులు ==
{{main|ఇక్ష్వాకులు}}
శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకులు క్రీ.శ.225 నుండి 300 వరకు, కృష్ణానది ముఖద్వారానికి ఇరువైపుల ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించి రాజ్యమేలారు. వీరి రాజధాని అయిన [[విజయపురి]] శ్రీపర్వత ప్రాంతం యొక్క పశ్చిమపాదంలో ఉన్నదని చెప్పబడింది. వీరిలో శ్రీఛాంతమూలుడు (225-245) పెద్ద రాజ్యాన్ని ఏర్పరచాడు. నేటి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, నల్లగొండ, గోదావరి జిల్లాలు అతని రాజ్యంలో ఉండేవి. కనుక వేంగి వారి రాజ్యంలో ఒక నగరమై ఉండాలి. ఇక్ష్వాకుల చివరిరాజు రుద్రపురుషదత్తుడు. ఇక్ష్వాకులను జయంచి పల్లవ రాజు సింహవర్మ విజ్యపురిని నాశనం చేసి, గుంటూరు ప్రాంతంలో పల్లవరాజ్యాన్ని క్రీ.శ.300లో స్థాపించాడు.ఇక్ష్వాకుల [[సామ్రాజ్యం]] పతనమయ్యేనాటికి విజయవేంగిపురం ఒక పెద్ద నగరం. కాని అప్పటికి పల్లవుల రాజ్యం కృష్ణానదీ దక్షీణ తీరంలోనే ఉండడం వలన వేంగి రాజ్యం వారి క్రిందికి రాలేదు.
== బృహత్పలాయనులు ==
{{main|బృహత్పలాయనులు}}
పల్లవుల అధికారం కృష్ణానదీ తీరం దక్షిణ భాగానికే పరిమితమైన కాలంలో కృష్ణానది ఉత్తర తీరంలో కొద్దికాలం మాత్రమే బృహత్పలాయనుల అధికారం సాగింది. కనుక వేంగి ప్రాంతం వారి అధీనంలో ఉండి ఉండాలి. కాని వీరి గురించిన ఆధారాలు చాలా తక్కువ. ఒకే ఒక కొండముది తామ్రశాసనం ఆధారంగా వీరు 300 ముండి 325 వరకు రాజ్యం చేసినట్లు భావిస్తున్నారు. వీరి రాజధాని [[కోడూరు]] కావచ్చును.
ఇక్ష్వాకుల సామంతులైన బృహత్పలాయనులు కృష్ణానది [[ఉత్తర]] తీరంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. వీరి వంశచరిత్రను తెలిపే ఒకే ఒక శాసనం కొండముది తామ్ర (రాగి) శాసనం. [[గుంటూరు
జయవర్మ తన పదో రాజ్య పాలనా కాలంలో కూదూర హారంలోని ‘పాంతూర గ్రామాన్ని’ 8 మంది బ్రాహ్మణులకు బ్రహ్మధేయంగా దానమిచ్చాడు. ఇతని ఇష్టదైవం [[మహేశ్వరుడు]]. [[కొండముది]] శాసనం ప్రకారం ‘కూదూరు’ (గూడూరు) రాజధానిగా కృష్ణానది ఉత్తర తీరాన్ని పాలించినట్లు తెలుస్తోంది. జయవర్మ పల్లవుల చేతిలో ఓడిపోయాడు. పల్లవ శివస్కంధవర్మ దక్షిణదేశ రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్న సమయంలో జయవర్మ నాటి ‘కర్మరాష్ర్టం’ (కమ్మ రాష్ర్టం) లోని కొంత భాగాన్ని ఆక్రమించి ఉండొచ్చని బి.ఎస్.ఎల్. హనుమంతరావు అభిప్రాయం.<ref>[http://appscgroup1n2.blogspot.in/2013/06/blog-post_8.html ఎ.పి.పి.యస్.సి.గ్రూప్స్ బ్లాగు నుండి]</ref>
== శాలంకాయనులు ==
{{main|శాలంకాయనులు}}
వేంగి రాజధానిగా పరిపాలించినట్లుగా స్పష్టమైన ఆధారాలతో (ఏలూరు శాసనం ద్వారా) తెలియవస్తున్న మొదటి రాజులు శాలంకాయనులు. "శాలంకాయన" అనేది గోత్రనామమని, వంశం పేరు కాదని తెలుస్తున్నందువలన చరిత్రకారులు వీరిని వర్ణించడానికి "వైంగేయికులు" అనే పదాన్ని వాడుతున్నారు.
"మైసోలియా" (కృష్ణా తీర ప్రాంతం) లో "బెన్గొరా" (వేంగీపురం) చెంత "సాలెంకీనాయ్" (శాలంకాయనులు) ఉన్నట్లు గ్రీకు చరిత్ర కారుడు టాలెమీ క్రీ.శ.130లో వ్రాశాడు.<ref>The Ancient City of Vengipura : Archaeological Excavations at Peddavegi/I.K. Sarma. Delhi, Book India Publishing Co., 2002, ISBN 81-85638-15-2. https://www.vedamsbooks.com/cgi-bin/main.cgi?no31025.htm - ''Infact Ptolemy (140 A.D.), refers to Vengi as the capital city of the Salankayanas.''</ref> అయితే ఆ బెన్గొరా (Bengaouron) అనేది వేంగీపురం కాదని కొందరు చారిత్రికుల అభిప్రాయం.<ref>''Excerpt from Gopalachari's thesis'':
పంక్తి 112:
metropolis, while Vengipura was certainly the capital of the kings
of the Salankayana gotra.</ref>
[[ఏలూరు]], [[పెదవేగి]], [[గుంటుపల్లె]], [[కానుకొల్లు]], [[కొల్లేరు]], [[కంతేరు]], [[పెనుగొండ]] వంటి వివిధ శాసనాల ద్వారా [[శాలంకాయనులు|శాలంకాయనుల]] గురించి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.
శాలంకాయనుల స్వతంత్రాధికారాన్ని హస్తివర్మ క్రీ.శ.320లో స్థాపించి ఉండవచ్చును. వివిధ శాసనాలలో ఇతనిని "నానాప్రకార విజయస్య" (గుంటుపల్లి), "అనేక సమరావాప్త విజయ" (పెదవేగి), "సమరముఖ నిర్మాత కర్మ" (కానుకొల్లు), "ధర్మమహారాజ" (గుంటుపల్లి) అనే బిరుదులతో వర్ణించారు.<ref name="BSL">ఆంధ్రుల చరిత్ర - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్)</ref> ఈ వర్ణనలను బట్టి ఇతడు వేంగి ప్రాంతంలో సామంతులను జయించి రాజ్యాన్ని స్థిరపరచాడని భావించవచ్చును. ఇతడు [[సముద్ర
హస్తివర్మ కుమారుడు నందివర్మ (350-385). ఇతడు తిరుగుబాటుదారులను అణచివేసి [[కృష్ణానది]] దక్షిణానికి కూడా వేంగి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతడు ధార్మిక చింతనపరుడు. "వివిధధర్మ ప్రధానస్య" అని పెదవేగి శాసనంలోను (కనుక వారు బౌద్ధ, వైదిక ధర్మాలను రెంటినీ ఆదరించినట్లు తెలుస్తున్నది), "ఆర్జిత ధర్మ ప్రదానస్య, గీసహస్రదాయి" అని గుంటుపల్లి శాసనంలోను వర్ణింపబడ్డాడు. ఇతని తరువాత ఇతని [[తమ్ముడు]] దేవవర్మ, కొడుకు అచండవర్మల మధ్య అధికారం కోసం అంతర్యుద్ధం జరగడం వలన శాలంకాయనుల ప్రతిష్ఠ దిగజారింది. అంతే గాకుండా ఉత్తరాన పిష్ఠపురం ([[పిఠాపురం]]) లో మాఠరులు, దక్షిణాన కర్మరాష్ట్రంలో బలవంతులై శాలంకాయనులతో పోరాడసాగారు. క్రీ.శ.5వ శతాబ్ది ప్రాంతంలో శాలంకాయనుల రాజ్యం అస్తమించింది. వారిలో చివరిరాజు విజయనందివర్మ గుంటుపల్లిలోని బౌద్ధ క్షేత్రానికి దానధర్మాలు చేశాడు.
శాలంకాయనులకు ఇంచుమించు సమకాలికులుగా [[కృష్ణా నది|కృష్ణానది]] దక్షిణాన కర్మరాష్ట్రాన్ని ఆనందగోత్రిజులు పాలించారు. కళింగాంధ్ర (ఉత్తరాంధ్ర) ప్రాంతం 'సింహపురి' (శ్రీకాకుళం వద్దనున్న సింగపురం) రాజధానిగా కళింగులు, తరువాత మాఠరులు పాళించారు. ఉత్తరాన పిష్ఠపురం ప్రాంతాన్ని కొంతకాలం [[కళింగులు]], తరువాత మాఠరులు, తరువాత వాసిష్ఠులు పాలించారు.
== విష్ణుకుండినులు ==
{{main|విష్ణుకుండినులు}}
శాతవాహనులు, చాళుక్యులు మధ్యకాలంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన వారిలో విష్ణుకుండులు ప్రసిద్ధులు. ఒక శతాబ్దం కాలం కృష్ణా, నర్మదా నదుల మధ్య అధికారం వెరపి అనేక రాజకీయ, సాంస్కృతిక సంప్రదాయాలను నెలకొల్పారు.<ref name="BSL"/>. వారు శ్రీపర్వత స్వామి భక్తులమని, వారి రాజ్యం శ్రీ పర్వత ఉభయ పార్శ్వాలలో విస్తరించి ఉన్నదని చెప్పుకొన్నారు. వారి వంశం గురించి, [[రాజధాని]] గురించి, రాజ్యం ఎల్లలగురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. సుమారుగా 375-570 మధ్యకాలంలో వీరి రాజ్యం సాగింది. వీరి ముఖ్యుడైన గోవిందవర్మ (425-465) ఉత్తరాన వేంగి శాలంకాయనులనూ, దక్షిణాన కర్మరాష్ట్రంలోని [[పల్లవులు|పల్లవుల]]<nowiki/>నూ ఓడించి రాజ్యాన్ని [[పిఠాపురం]] నుండి
విష్ణుకుండి రాజులందరిలో మాధవవర్మ (465-515) ప్రసిద్ధుడు. జైత్రయాత్రలు సాగించి రాజ్యాన్ని విస్తరించాడు. వాకాటకులతో వివాహసంబంధం కలుపుకొని నర్మదానది వరకూ రాజ్యాన్ని విస్తరించాడు. ఉత్తరాన కళింగాన్ని జయించాడు. అదను చూసుకొని మరలా కృష్ణాతీరం వరకు ఆక్రమించిన పల్లవులనోడించి కర్మరాష్ట్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకొన్నాడు. కళింగ దండయాత్ర తరువాత మాధవవర్మ వేంగి సమీపంలోని [[దెందులూరు]] పురానికి తన రాజధానిని మార్చాడు.<ref name="BSL"/>.
తరువాతి రాజులలో క్రమంగా అంతఃకలహాలు, పశ్చిమాన [[చాళుక్యులు|చాళుక్యు]]<nowiki/>ల విజృంభణ, పల్లవులతో కొనసాగుతున్న వైరం - ఇవి క్రమంగా విష్ణుకుండినుల అధికార పతనానికి దారి తీశాయి. 566లో పల్లవరాజు పృథ్వీమహారాజుతో జరిగిన యుద్ధంలో అప్పటి విష్ణుకుండి రాజు విక్రమేంద్రుడు మరణించడంతో విష్ణుకుండి వంశం పాలన అంతమయ్యింది.
పంక్తి 131:
{{main|పల్లవులు}}
[[దస్త్రం:Garuda Vishnu Pedavegi.JPG|right|thumb|250px|గరుడారూఢుడైన [[విష్ణువు]], క్రీ.శ.6-7 శతాబ్దికి చెందిన ఇసుక రాయి శిల్పం. [[లలాట తోరణం]] పై చెక్కినది. [[పెదవేగి]] గ్రామం త్రవ్వకాలలో బయల్పడింది. శివాలయంలో ఉంచబడింది.]]
''ఏ ఎర్ర సంజెలో నెలమి పల్లవరాజకాంతలు కాళ్ళ పారాణులిడిరొ?'' - అని కవి సామ్రాట్ [[విశ్వనాధ సత్యనారాయణ]] తన "[[ఆంధ్రప్రశస్తి]]" ఖండ కావ్యంలో "వేంగి క్షేత్రము" అనే కవితలో వ్రాశాడు. శాతవాహనుల తరువాత పల్లవులు విజృంభించి కృష్ణానదికి దక్షిణ ప్రాంతాన్ని, తమిళ ప్రాంతాన్ని కూడా పాలించారు. క్రీ.శ. 280 నుండి 630 వరకు పల్లవుల పాళన సాగింది. వారు కర్మ రాష్ట్రంపై అధిపత్యం కోసం ఆనంద గోత్ర, శాలంకాయన, [[విష్ణుకుండినులు|విష్ణుకుండి]] వంశాల రాజులతో తెరిపిలేని పోరాటాలు సాగించారు. మహేంద్రవర్మ, నందివర్మ, విజయస్కందవర్మ, సింహవర్మ, శివస్కందవర్మ వీరిలో ముఖ్యులైన [[రాజులు]]. వీరిలో పాలక్కడ ప్రాంతాన్ని పాలించిన సింహవర్మ 'వెంగో'రాష్ట్రంలో దాన ధర్మాలు చేసినట్లు మంగడూరు శాసనం ద్వారా తెలియవస్తుంది. అయితే ఈ వెంగో అంటే వేంగి అవునా కాదా అన్న విషయంపై విభేదాలున్నాయి. ఎందుకంటే అప్పటికి వేంగిలో విష్ణుకుండులు బలవంతులైయున్నారు.
విజయస్కందవర్మ కృష్ణానది తీరాన కర్మ రాష్ట్రాన్ని విష్ణుకుండుల నుండి స్వాధీనం చేసుకొని పల్లవుల అధికారన్ని బలపరచాడు. కాని వేంగి ప్రాంతంలో వారి అధికారానికి ఆధారాలు లేవు. విష్ణుకుండులలో చివరి రాజైన విక్రమేంద్రుని మరణానంతరం పృథ్వీమూలుడనే 'రణదుర్జయ'రాజు వేంగి ప్రాంతాన్ని పాలించాడు.
బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి దండయాత్రలలోని వేరు వేరు యద్ధాలలో రణదుర్జయ పృథ్వీమహారాజు, పల్లవుల మహేంద్ర వర్మ మరణించారు. పృథ్వీమహారాజు నుండి వేంగి చాళుక్యుల వశమైంది. దక్షిణాంధ్రప్రాంతంలో పల్లవుల అధికారం అంతమై, వారి పాలన [[తమిళనాడు|తమిళ]] దేశానికే పరిమితమైంది.
== వేంగి చాళుక్యులు ==
[[దస్త్రం:Inscription Pedavegi.JPG|right|thumb|పెదవేగి త్రవ్వకాలలో లభించిన ఒక శాసనం]]
{{main|తూర్పు చాళుక్యులు}}
వేంగిలో చాళుక్య రాజ్య స్థాపన ఆంధ్రచరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది. తూర్పు చాళుక్యులనబడే వీరు తీరాంధ్రాన్ని మాత్రమే పాలించారు. ఆంధ్ర దేశ ఐక్యతను సాధించలేకపోయారు ([[శాతవాహనులు|శాతవాహనుల]] తరువాత [[కాకతీయులు]] మాత్రమే ఈ పని చేశారు.) ఇతర ప్రాంతాలలో పల్లవ సామంతులు, బాణ వైదుంబులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు పాలన సాగించారు. అంతే గాకుండా వేంగి చాళుక్యులు పశ్చిమ (కన్నడ) ప్రాంతంనుండి దండెత్తి వచ్చినవారు అయినా కాని వీరు ఆంధ్రులకొక వ్యక్తిత్వాన్ని, [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] వారసత్వాన్ని సాధించగలిగారు. "జన్మభూమిశ్చాళుక్యానాం దేశో వేంగితి పశ్రుతః" అని చాటి ప్రజా క్షేమాన్ని కాంక్షించి పాలించారు. నాటివరకు రాజాస్థానాలలో ఆదరణ లేని తెలుగు భాషను ఆదరించి విశేష ప్రచారం తెచ్చిపెట్టారు.అందు చేత తూర్పు చాళుక్యుల చరిత్రయే ఈ యుగంలో ఆంధ్రుల చరిత్ర అనడంలో సందేహానికి తావుండరాదు<ref name="BSL"/>.
క్రీ.శ. 624లో (ఈ సంవత్సరం పై విభిన్నాభిప్రాయాలున్నాయి) బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి వేంగి రాజ్యాన్ని (ఏలూరు దగ్గర జరిగిన యుద్ధంలో) జయించాడు. అతని [[తమ్ముడు]] కుబ్జ విష్ణువర్ధనుడు (624-641) అన్న ఆశీస్సులతో వేంగిని స్వతంత్రరాజ్యంగా పాలించనారంభించాడు. ఇతడు మహావీరుడు. పరిపాలనా దక్షుడు. ఇతని భార్య అయ్యణమహాదేవి జైన మతాభిమాని.
క్రమంగా తూర్పు చాళుక్యుల రాజ్యం దక్షిణాన [[నెల్లూరు]] నుండి ఉత్తరాన [[శ్రీకాకుళం]] వరకు విస్తరించింది. తరువాతి మూడు శతాబ్దాలలో వారికి రాష్ట్రకూటులతోను, దక్షిణాన పల్లవులతోను, [[బోయ]] నాయకులతోను, చోళులతోను, పరామారులతోను ఎడతెరగని పోరులు జరిగాయి. ఒక దశలో పశ్చిమ చాళుక్య రాజు సత్యాశ్రయుడు తిరిగి చాళుక్య దేశాన్ని ఒక పాలన క్రిందికి తీసికొనిరావాలని ప్రయత్నించాడు కాని అది సాధ్యం కాలేదు.
కుబ్జ విష్ణువర్ధనుని తరువాత గుణగ విజయాదిత్యుడు, వాళుక్యభీముడు, జటాచోడ భీముడు, రాజరాజ నరేంద్రుడు ముఖ్యమైన వేంగి చాళుక్య రాజులు. అయితే అంతఃకలహాలు, రాష్ట్రకూటులతో యుద్ధాలు వేంగిని విపరీతమైన నష్టాలకు గురిచేశాయి. 772లో రాష్ట్రకూట ధ్రువుడు పంపిన సేనలు వేంగిపై దండెత్తి అప్పటి విష్ణువర్ధనుని ఓడించి సామంతునిగా చేసుకొన్నాడు. దీనితో వేంగి ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బ తింది. తరువాత 12 సంవత్సరాలు వారి మధ్య ఎడతెరిపి లేకుండా పొరులు జరుగుతూనే ఉన్నాయి. 813లో చాళుక్య రాజు రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులనోడించి తిరిగి వేంగి సింహాసనాన్ని అధిష్టించాడు. వేంగి ప్రాభవాన్ని పునరుద్ధరించాడు. ఇతడు 108 యుద్ధాలు చేసి రాష్ట్రకూటులను పారద్రోలినట్లు [[శాసనాలు]] చెబుతున్నాయి. ఇతడు గొప్ప కళా పండిత పోషకుడు.
తరువాతి రాజులలో [[గుణగ విజయాదిత్యుడు]] (848-891) తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఒక యుద్ధంలో రాష్ట్రకూట రాజు (రట్టేశుని) చేత ఓడిపోయాడు. తరువాతి
== చాళుక్య చోళులు ==
ఆ సమయంలో దక్షిణాన రాజరాజు నాయకత్వంలో చోళ వంశం బలపడుతున్నది. కనుక వేంగిని తమ అధీనంలో ఉంచుకొంటే దక్షిణాపధంలో చోళసామ్రాజ్యానికి మార్గం సుగమం అవుతుందని, చాళుక్యులతో తలపడే అవసరం ఉండదని రాజరాజు భావించాడు. కనుక వేంగి దాయాదులైన శక్తివర్మ, విమలాదిత్యులకు ఆశ్రయం ఇచ్చి [[సంబంధం]] కలుపుకొన్నాడు.
చోళ సైన్యాల సాయంతో శక్తివర్మ (909-1011) చోడ భీముని జయించి వేంగి రాజ్యాన్ని ఆక్రమించుకొన్నాడు. తరువాత కొంతకాలం సత్యాశ్రయుని నాయకత్వంలో పశ్చిమ చాళుక్యులకు, చోళులకు [[యుద్ధాలు]] జరిగాయి. దాక్షిణాత్య సార్వభౌమత్వం ఆశించిన పశ్చిమ చాళుక్యులకు, చోళులకు వేంగి యుద్ధరంగమయ్యింది.<ref name="BSL"/>
1019లో రాజరాజ నరేంద్రుడు రాజయ్యాడు. అతని పట్టాభిషేకాన్ని ప్రతిఘటించి, విజయాదిత్యుడు కళింగ కుంతల రాజుల సాయంతో వేంగిని ఆక్రమించినాడని, రాజేంద్రచోళుడు వేంగి వరకు నడచి తన కుమార్తె అమ్మంగదేవిని రాజరాజ నరేంద్రునికిచ్చి పెళ్ళి చేసి పట్టాబిషేకాన్ని చేయించాడని చరిత్రకారుడు నేలటూరి వెంకటరమణయ్య అభిప్రాయపడ్డాడు. పట్టాభిషేకం అయిన 9 సంవత్సరాల తరువాత విజయాదిత్యుడు, చాళుక్య జయసింహుడు కలసి వేంగిలో అధిక భాగాన్ని (కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని) ఆక్రమించారు. 1034లో విజయాదిత్యుడు వేంగి నగరం రాజధానిగా [[పట్టాభిషేకం]] జరుపుకొన్నాడు. మిగిలిన భాగాన్ని [[రాజమహేంద్రవరం]] రాజధానిగా పాలిస్తూ రాజరాజ నరేంద్రుడు తిరిగి వేంగి రాజ్యం ఐక్యత కోసం చోళుల సాయం అర్ధించి ఉంటాడు. వేంగి సమీపంలోని కలిదిండి వద్ద జరిగిన భీకరమైన
== వేంగి ప్రాభవం క్షీణత ==
తిరిగి 1042 నుండి రాజరాజ నరేంద్రుని అధికారానికి ప్రమాదం వాటిల్లింది. ఈ కాళంలో చాళుక్య చోళ
రాజరాజ నరేంద్రుని మరణానంతరం జరిగిన సంఘటనలలో చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు. కాని అప్పటికి వేంగి రాజ్యానికి పూర్తిగా వ్యక్తిత్వం నశించి చోళ, చాళుక్య సార్వభౌములలో విజేతలైనవారి పక్షమో, లేక వేంగిపై దండెత్తి వచ్చినవారి పక్షమో వహించవలసిన దయనీయ స్థితికి దిగజారిపోయింది <ref name="BSL"/>. అనేక యుద్ధాలు, రాజుల మధ్యలో పంపకాలలో వేంగి నలిగిపోయింది. అవకాశం చిక్కినపుడల్లా ఇతరులు వేంగిని కొల్లగొట్టసాగారు. 1073లో దాహళ ప్రభువు చేది యశఃకర్ణదేవుడు, తరువాత కొద్దికాలానికి గంగరాజ దేవేంద్రవర్మ పెద్ద దండ్లను పంపి వేంగిని దోచుకొన్నారు. 1075లో సప్తమ విజయాదిత్యుడు మరణించడంతో తూర్పుచాళుక్య వంశం అంతరించింది.
పంక్తి 163:
== ఇతరాలు ==
{{main|నన్నయ}}
* పైన చెప్పినట్లుగా వేంగి రాజ్యం, తూర్పు చాళుక్యుల పాలన తెలుగువారి చరిత్రలో సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న కాలం. నన్నయ భట్టు, నారాయణ భట్టు మహాభారత ఆంధ్రీకరణను ప్రారంభించారు. ఈ కాలంలోనే శాసనాలలో తెలుగు కనిపించ సాగింది. కుబ్జవిష్ణువర్ధనుని చేజెర్ల శాసనంలో సగం పైగా తెలుగు. అతని కుమారుడు జయసింహ వల్లభుని విప్పర్ల, మాచెర్ల శాసనాలు తెలుగు. వేంగి రాజ్యానికి సమాంతరంగా నడచిన రేనాటి చోడులు కూడా తమ శాసనాలు తెలుగులో వేయించారు. వానిలో ధనంజయుని
* చరిత్రలో చాలా సార్లు జరిగినట్లుగానే రాజవంశాలలోని అంతఃకలహాలు, పొరుగు రాజ్యాల సామ్రాజ్య విస్తరణాకాంక్ష దేశాన్ని బలపడకుండా చేశాయి. [[వేంగి]], [[ధరణికోట]], [[యనమదల]], [[కంభం]], [[నెల్లూరు]] వంటి వగరాలు పలుమార్లు ధ్వంసం చేయబడ్డాయి.
* ఈ కాలంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంతం ఎక్కువ భాగం ఇతర రాజుల సామంతరాజుల పాలనలో ఉంది.
* వేంగి రాజుల సైన్యాధిపతులలో అనేక [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] వీరులుండేవారు. బౌద్ధమతం క్షీణించినా అప్పటికి కులవ్యవస్థ ఇంకా బాగా బలపడలేదు.
* స్థానిక ప్రాంతాలలోని అధికారులు సామంతరాజులవంటివారిగా వ్యవహరించేవారు. కేంద్రం బలహీనపడడానికి, అంతఃకలహాలకు, పొరుగురాజుల యుద్ధవ్యూహాలకు వీరు చాలావరకు కారకులయ్యారు.
* రాజ్యం "విషయాలు" (రాష్ట్రాల వంటివి) గా విభజింపబడింది. వేంగి రాజ్యంలో 30 విషయాలుండేవి. [[కమ్మ]] రాష్ట్ర విషయము, అత్తిలినాడు విషయము వంటి పేర్లుండేవి.
* అనేక విధాలైన పన్నులండేవి - డేగరచ పన్ను, పడెవాలుపన్ను, పడియేరి పన్ను, సంధి విగ్రహం పన్ను నంటివి.
* బౌద్ధం క్షీణించిన అనంతరం జైనమతం వ్యాపించి మరల క్షీణించింది. వైదిక మతం క్రమంగా బలపడింది. కుల వ్యవస్థ వేళ్ళూనుకోసాగింది. జాతరలు, ఆచారాలు, మూఢ విశ్వాసాలు వ్యాప్తి పొందాయి.
|