గరుత్మంతుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Garuda Vishnu Laxmi.jpg|right|thumb|200px|గరుఢారూఢులైన లక్ష్మీనారాయణులు - 1730 నాటి చిత్రం]] '''[[గరుత్మంతుడు]]''' హిందూ [[పురాణములు|పురాణాలలో]] ఒక గరుడ పక్షి ([[గ్రద్ద]]). [[శ్రీమహావిష్ణువు]] వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే [[విష్ణువు]] గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు.
[[ఫైలు:Garuda_Dwarakatirumala.JPG|thumb|right|200px|[[ద్వారకా తిరుమల]]లో గరుత్మంతుని విగ్రహం]]
== అనూరుని శాపం ==
[[కశ్యప ప్రజాపతి]] తన భార్యలైన [[వినత]], [[కద్రువ]] లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ [[కోరిక]] ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని [[కశ్యప్|కశ్యప]] ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి [[వాసుకి]], [[ఆదిశేషుడు]] ఆదిగా గల [[వెయ్యి]] [[పాములు]] జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన [[అనూరుడు]] జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు.
 
== వినత - కద్రువ ల పందెం ==
వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు [[క్షీర సాగరమథనము]]లో వచ్చిన [[ఉచ్చైశ్రవము]] అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్న [[గుర్రము]]<nowiki/>ను చూసి, కద్రువ తన సవతితో "చూడు ఆ ఉచ్చైశ్రవము [[శరీరం]] అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది" అని అంటుంది. ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు దాని తోక తెల్లగ ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు [[పొద్దు]] పోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుఱ్ఱాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి వెళ్ళిపోతారు.
 
== సంతానానికి కద్రువ శాపం ==
పంక్తి 15:
[[ఫైలు:Garuda Vishnu Pedavegi.JPG|right|thumb|250px|గరుడారూఢుడైన [[విష్ణువు]], క్రీ.శ.6-7 శతాబ్దికి చెందిన ఇసుక రాయి శిల్పం. [[లలాట తోరణం]] పై చెక్కినది. [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] నాటిది. [[పెదవేగి]] గ్రామం త్రవ్వకాలలో బయల్పడింది. శివాలయంలో ఉంచబడింది.]]
[[File:Statue of Garuda at Narasimha Temple premisis.JPG|right|thumb|250px|భద్రాచలంలో నరసింహ స్వామివారి ఆలయంలో గరుత్మంతుడు విగ్రహం]]
కొన్ని రోజులకు [[గరుత్మంతుడు]] పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. [[గరుత్మంతుడు]] తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ [[సర్పాలు]] మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.
 
దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు. అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి [[అమృతము|అమృతం]] పొందాలనే కోరికతో తమకు [[అమృతము|అమృతం]] తెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినత ల దాసీత్వం పోతుందని చెబుతారు.
పంక్తి 21:
== గరుత్మంతుని దాస్యవిముక్తి ==
[[File:Paintings-of-the-Razmnama-01.jpg|thumb|ఎడమ|తాబేలును ఏనుగును మోసుకు వెళుతున్న గరుత్మంతుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం]]
గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో ఇంద్రుడు కనిపించి "నాయనా గరుత్మంతా! అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు. అందరికి అమరత్వం సిద్దించరాదు" అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు - ఇంద్రుడు ఒడంబడిక చేసుకొంటారు. గరుత్మంతుడు [[అమృతకలశం]] తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భ ల పై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతడి [[అమ్మ|తల్లి]] దాసీత్వము పోతుంది.
 
== సర్పాలకు ద్విజిహ్వత్వం ==
"https://te.wikipedia.org/wiki/గరుత్మంతుడు" నుండి వెలికితీశారు