పసుపులేటి కన్నాంబ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
==బాల్యం, నటనా ప్రవేశం==
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]]లో [[1912]]లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో [[1935]]లో [[హరిశ్చంద్ర]] [[తెలుగు]] చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "[[ద్రౌపది]]"గా అధ్బుతంగా నటించి [[తెలుగు సినిమా|తెలుగు]] ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది.
 
==పేరు తెచ్చిన సినిమాలు, విశేషాలు==
[[ద్రౌపదీ వస్త్రాపహరణం]], [[హరిశ్చంద్ర]], [[పాదుక]], [[చంద్రిక]], [[కనకతార]], [[పల్నాటి యుద్ధం]], [[గృహలక్ష్మి]] , [[అనార్కలి]], [[దక్షయజ్ఞం (1962 సినిమా)|దక్షయజ్ఞం]] , [[తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడికోడళ్ళు]], [[కృష్ణ కుచేల]], తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి.
 
[[ఎం.జి.రామచంద్రన్]], [[ఎన్.ఎస్.రాజేంద్రన్]], [[శివాజీగణేశన్]], [[నాగయ్య]], పి.యు. చిన్నప్ప, [[నందమూరి తారక రామారావు]], తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.
 
సుమారు 150 పౌరాణిక, [[జానపదము|జానపద]], [[చారిత్రక దినములు|చారిత్రక]] చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త [[కడారు నాగభూషణం]], ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు [[తెలుగు]]లోను , [[తమిళ]], [[కన్నడ]] భాషలలోను నిర్మించారు.
పంక్తి 56:
[http://www.telugupeople.com/cinema రావికొండలరావు రచననుండి]
* ‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా.....’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో [[గుర్రం]] మీద కూచుని [[ఠీవి]]<nowiki/>గా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు ‘[[చండిక]]’ (41), ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు. అందులో కన్నాంబ ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట : ఏమే ఓ కోకిలా - ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట.....‘ ఈ పాటలో ఆమె [[నవ్వులు]] రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ [[నవ్వు]] - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.
* [[కడారు నాగభూషణం]] గారిని [[పెళ్ళి|వివాహం]] చేసుకుని శ్రీ [[రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ]] స్థాపించి [[తెలుగు]] తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారామె. ’సుమతి‘ (42), [[పాదుకాపట్టాభిషేకం]] (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), [[సతీ సక్కుబాయి]] (54), [[శ్రీకృష్ణతులాభారం]] (55), [[నాగపంచమి]] (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది. ఎక్కువగా క్యారెక్టర్స్‌ ధరించినా, కన్నాంబకు హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు ’[[టైటానిక్‌]] చీరలు‘ అంటూ [[సినిమా]] పేర్లతో [[చీరలు]] వస్తున్నట్టు - అప్పుడు ’కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు‘ అంటూ ఆభరణాలు వచ్చేవి. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, [[బంగారు]] కాసులు డబ్బాల్లో పోసి, [[పప్పులు]], ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.
* [[ఐశ్యర్యం]] ఎలా వస్తుందో ఎలా పోతుందో వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె [[భర్త]] నాగభూషణం ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఒకసారి ఒక మిత్రుడు ఆయన్ని కలవాలని ఆ గదికి వెళ్లి ‘గుండె కలుక్కుమంది. ఆ [[వాతావరణం]] చూడలేక తిరిగి వచ్చేశాను’ అని చెప్పారు. ‘ఆ చిన్నగదిలో ఒక [[ట్రంకు పెట్టె]], ఓ [[కుర్చీ]] మాత్రం ఉన్నాయి. ఎదురుగా కన్నాంబ ఫోటో, [[దండెం]] మీద [[తువ్వాలు]] తప్ప ఇంకేం కనిపించలేదు. ఆయన కిందనే చాపమీద కూచుని, [[దినపత్రిక]] చదువుకుంటున్నారు’ అన్నారా మిత్రుడు.
*కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేశారట.
 
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_కన్నాంబ" నుండి వెలికితీశారు