కాళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కరీంనగర్ జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాళేశ్వారం[[కాళేశ్వరం]]''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]], [[మహదేవపూర్|మహదేవ్ పూర్]] మండలంలోని గ్రామం..<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
{{Infobox Settlement/sandbox|
‎|name = కాళేశ్వరం
పంక్తి 98:
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
 
సమీప [[జూనియర్ కళాశాల]], ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మహదేవ్ పూర్లోను, ఇంజనీరింగ్ కళాశాల రామగుండంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్‌ కాటారంలోను, మేనేజిమెంటు కళాశాల రామగుండంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక [[పాఠశాల]] రామగుండంలో ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
పంక్తి 158:
 
== సందర్శించదగిన ముక్తీశ్వరాలయం ==
ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన [[శివాలయం]] ఉంది. [[త్రిలింగ]]మనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే త్రిలింగమనే[[త్రిలింగ]]<nowiki/>మనే పదం నుంచి [[తెలుగు]] అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన.<ref name="త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?">{{cite journal|last1=వెంకట లక్ష్మణరావు|first1=కొమర్రాజు|title=త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=81|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|accessdate=6 March 2015}}</ref>
 
ఈ దేవాలయంలో ఒకే పానపట్టంపై [[శివుడు]] [[యముడు]] వెలిశారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో మహా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. ఇది కరీంనగర్‌ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు [[మహారాష్ట్ర]] ఉన్నాయి. [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్‌ జిల్లా]]<nowiki/>లోని మహాదేవపూర్‌ మండలానికి 16 కి.మీ దూరాన, [[మహారాష్ట్ర]] సరిహద్దున [[సిరోంచ]] తాలూకాకు 4 కి.మీ దూరాన కాళేశ్వరం ఉంది.అతిప్రాచీన చరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి.మన రాష్ట్రంలోని శైవక్షేత్రాలలో [[శ్రీశైలం]]లోని మల్లికార్జునస్వామి, [[ద్రాక్షారామం]]లోని భీమేశ్వరస్వామి, [[కాళేశ్వరం]]<nowiki/>లోని ముక్తీశ్వరాలయాలు ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ [[గోదావరి]], [[ప్రాణహిత]] నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, [[శ్రీశైలం|శ్రీశైల]], ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.
పంక్తి 164:
భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణి సంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రకాధారాల వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు ఒక ప్రయోగం చేశారు. ఈ నాశికారంధ్రాలలో నీరుపోస్తే త్రివేణీసంగమతీరంలో కలిసిందీ, లేనిదీ కనిపెట్టడం కష్టమని వెయ్యి బిందెల పాలు పోశారు. పాలు తెల్లగా ఉండటంతో త్రివేణిసంగమతీరాన చూడగా పాలు కనబడినట్లు గ్రామస్థులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కాశీక్షేత్రం కంటే గొప్పదని 'కాళేశ్వరఖండవలు' ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా పేర్కొన్నారు. ఈ [[దేవాలయం]]<nowiki/>లోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
 
కాళేశ్వరక్షేత్రం శిల్పకళానిలయం. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేకశిల్పాల వల్ల గత [[వైభవం]] తెలుస్తుంది. ఇక్కడ [[హిందూ]]- [[ముస్లింలు]] సోదరభావంతో జీవించినట్లు కాకతీయుల శిలాఫలకాల ద్వారా తెలుస్తుంది. మన దేశంలో ప్రముఖ సరస్వతీ ఆలయాలు మూడు ఉన్నాయి. కాళేశ్వరంలో మహాసరస్వతి, అదిలాబాద్‌ జిల్లా బాసరలో జ్ఞానసరస్వతీ, కాశ్మీరులో బాలసరస్వతీ ఆలయాలున్నాయి. అదే విధంగా సూర్యదేవాలయాలు కూడా మూడు ఉన్నాయి. కాళేశ్వరంలో ఒకటి కాగా ఒరిస్సాలోని [[కోణార్క సూర్య దేవాలయం|కోణార్క్‌]], [[శ్రీకాకుళం జిల్లాలోనిజిల్లా]]<nowiki/>లోని [[అరసవిల్లి]] సూర్యదేవాలయాలు ప్రముఖమైనవి. కాశ్మీర్‌లోని మార్తాండ్‌ నందగల సూర్యదేవాలయం శిథిలావస్థలో ఉంది. కాళేశ్వరంలో [[బ్రహ్మతీర్థం]], [[నరసింహతీర్థం]], [[హనమత్‌ తీర్థం]], [[జ్ఞానతీర్థం]], [[వాయుసతీర్థం]], [[సంగమతీర్థం]], ఇత్యాది తీర్థాలున్నాయి.
 
కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. కాళేశ్వర ఆలయం సమీపానే మహారాష్ట్ర భూభాగం ఉంది. అందువల్ల ఇటు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]] భక్తులతోపాటు [[మహారాష్ట్ర]] భక్తులు కూడా అత్యధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పూరావస్తుశాఖవారు నిర్వహించిన తవ్వకాల్లో [[బౌద్ధవిహారాల]] గోడలు, [[పునాదులు]], [[మహాస్తూపాలు]], కంచుతో చేసిన బుద్ధుడి విగ్రహాలు లభించాయి. [[నేలగొండ|నేలకొండలోని]] బౌద్ధస్తూపం ప్రత్యేకాకర్షణ అని చెప్పవచ్చు.
 
ఆలయంలో[[ఆలయం]]<nowiki/>లో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుండి బయటకి వెళ్ళినట్లయితే యమ దోషం పోతుంది అని [[భక్తులు]] విశ్వసిస్తారు, ఇందులో నుండి వెళ్లుటకు దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్లాలి.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/కాళేశ్వరం" నుండి వెలికితీశారు