గిడుగు వేంకట సీతాపతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[గిడుగు వెంకట సీతాపతి]]''' ([[జనవరి 28]], [[1885]] - [[ఏప్రిల్ 19]], [[1969]]) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది '''చిలకమ్మపెళ్ళి'''.
 
== జననం ==
వీరు [[జనవరి 28]], [[1885]] సంవత్సరంలో [[విశాఖపట్నం]] జిల్లా [[భీమునిపట్నం]]లో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన [[గిడుగు వెంకట రామమూర్తి]] దంపతులకు జన్మించారు.
 
[[మద్రాసు క్రైస్తవ కళాశాల]]లో చరిత్రలో పట్టభద్రులై[[పట్టభద్రుడు|పట్టభద్రు]]<nowiki/>లై కొంతకాలం [[పర్లాకిమిడి]]లో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, [[సవర]] భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. [[రైతుబిడ్డ]], [[స్వర్గసీమ]], [[పల్నాటి యుద్ధం]], [[భక్తిమాల]] వంటి కొన్ని చలనచిత్రాలలోను మరియు కొన్ని నాటకాలలోను నటించారు.
 
1945లో [[మాగంటి బాపినీడు]] సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక [[వ్యాసాలు]] రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో [[తెలుగు భాషా సమితి]] ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. [[సూర్యరాయాంధ్ర నిఘంటువు]]కు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.
 
వీరు రచించిన [[తెలుగు]] కావ్యాలలో ముఖ్యమైనవి: '[[భారతీ శతకము(గిడుగు సీతాపతి)|భారతీ శతకము]]', 'సరస్వతీ విలాసము', 'కొద్ది మొర్ర'. వీరు రాసిన 'బాలానందము' వంటి బాల [[సాహిత్యం|సాహిత్య]] రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు [[బైబిల్]] లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] వారి అభ్యర్ధనపై [[తెలుగు సాహిత్య చరిత్ర]]ను [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లోకి అనువదించారు. వీరు రచించిన 'తెలుగులో ఛందోరీతులు' అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.