రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రంగారెడ్డి జిల్లా''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి.<ref name="”మూలం”5">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf</ref>
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=రంగారెడ్డి|
|skyline =Rangareddy District Montage 1.png
Line 17 ⟶ 18:
|literacy_female=57.03
}}
'''రంగారెడ్డి జిల్లా''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. 1978లో [[హైదరాబాదు]] జిల్లా నుంచి విడదీసి ఏర్పాటుచేశారు.[[హైదరాబాదు]] జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది. [[హైదరాబాదు]] నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రము. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, [[తమిళనాడు]] గవర్నరుగా పనిచేసిన [[మర్రి చెన్నారెడ్డి]], తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి<ref>చరితార్థులు మన తెలుగు పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, ప్రథమ ముద్రణ జనవరి 2012, పేజీ 265</ref> ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన [[కొండా వెంకట రంగారెడ్డి]], దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన [[సబితా ఇంద్రారెడ్డి]], విమోచనొద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరె రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన<ref>నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 10</ref> కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు మరియు కందులకు ప్రఖ్యాతిగాంచిన తాండూరు ఈ జిల్లాలోనివే. జిల్లాలో 37 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ. దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ నెంబరు జాతీయ రహదారి, హైదరాబాదు నుంచి కాజీపేట, గద్వాల, వాడి, బీబీనగర్ రైలుమార్గాలు, వికారాబాదు-పర్భని మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52,96,741.<ref>భారత గణాంక విభాగము విడుదల చేసిన వివరాల ప్రకారం</ref>
 
== చరిత్ర ==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
నిజాం కాలంలో ఇది అత్రాప్-ఎ-బల్ద్ జిల్లాలో భాగంగా గుల్షనాబాదు సూబాలో ఉండేది. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటింది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిన కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> 1948లో నిజాం నిరంకుశ పాలన అంతం తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో [[హైదరాబాదు]] జిల్లాలో భాగంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. [[హైదరాబాదు రాష్ట్రము]]లో [[బూర్గుల రామకృష్ణారావు]] మంత్రివర్గములో మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పడిన తర్వాత [[నీలం సంజీవ రెడ్డి]] మంత్రివర్గములో సభ్యుడైన [[కె.వి.రంగారెడ్డి]] పేరు మీదుగా ఈ జిల్లాకు నామకరణము చేశారు. ఈ జిల్లా ఇంతకు మునుపు [[హైదరాబాదు జిల్లా]]లో భాగంగా ఉండేది [[1978]]లో హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి [[కె.వి.రంగారెడ్డి]] పేరిట ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లాపేరు లోంచి కె.వి.పదాలను తొలిగించారు. ఏర్పాటు సమయంలో రంగారెడ్డి జిల్లాలో 11 తాలుకాలు ఉండగా 1986లో మండలాల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాలుకాల స్థానంలో 37 మండలాలు ఏర్పడ్డాయి.
;నిజాం విమోచనోద్యమం:
1947 ఆగస్టు 15న దేశమంతటా ప్రజలు స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటుండగా హైదరాబాదు సంస్థాన ప్రజలు మాత్రం దాష్టీక రజాకార్ల రాక్షస దురాగతాలకు బలైపోతున్నారు.ఆ సమయంలో అప్పటి అత్రాఫ్-ఎ-బల్దా జిల్లాలో భాగమైన ఇప్పటి రంగారెడ్డి జిల్లా ప్రాంతం ప్రజలు కూడా నిజాం మరియు రజాకార్ల బాధలను పడలేక ప్రజలు ఎదురు తిరిగారు. మందుముల నర్సింగరావు, [[కాటం లక్ష్మీనారాయణ]], గంగారం లాంటి ఉద్యమకారులు ప్రజలను చైతన్యవంతం చేశారు. శంషాబాదు ప్రాంతానికి చెందిన గంగారం [[నారాయణరావు పవార్]]తో కలిసి నిజాం నవాబునే హత్యచేయడానికి వ్యూహంపన్నాడు. శంషాబాదుకే చెందిన గండయ్య హిందువులను నీచంగా చూడడం భరించలేక పోరాటాన్ని ఉధృతం చేశాడు. అతన్ని అరెస్టు చేసి జైల్లోవేసిన పిదప క్షమాపణలు చెబితే వదిలివేస్తామని నచ్చజెప్పిననూ ఆయన అందుకు నిరాకరించాడు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2011</ref>[[ఇబ్రహీంపట్నం]] పరిసర ప్రాంతాలు పోరాటయోధులకు పెట్టనికోటలాంటివి. ఇప్పటి రంగారెడ్డి-నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను పోరాటయోధులు సమర్థంగా వినియోగించుకున్నారు.
 
Line 46 ⟶ 47:
రంగారెడ్డి జిల్లాలో లభ్యమగు ఖనిజాలలో నాపరాయి, సున్నపురాయి, ఫెల్స్పార్, క్వార్ట్జ్ మున్నగునవి ముఖ్యమైనవి. తాండూరు, బషీరాబాదు మండలాలలో నాపరాయి, మర్పల్లి మండలంలో సున్నపురాయి, మేడ్చల్, మహేశ్వరం మండలాలలో ఫెల్ప్సార్ దొరుకుతుంది.
 
== కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన రంగారెడ్డి జిల్లా పాత మండలాలు==
[[దస్త్రం:Rangareddy.jpg|right|300px|రంగారెడ్డి జిల్లా మండలాలు]]
భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 37 రెవిన్యూ మండలములుగా విభజించారు.<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0215000000&ptype=B&button1=Submit రంగారెడ్డి జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 28, 2007న సేకరించారు.</ref>
Line 54 ⟶ 55:
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 8 పాత మండలాలు నూతనంగా ఏర్పాటైన మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాపరిధిలో చేరినవి.అలాగే 15 పాతమండలాలు నూతనంగా ఏర్పాటైన వికారాబాదు జిల్లా పరిధిలో చేరినవి.
 
=== మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”3">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
{{Div col|cols=1}}
* [[మేడ్చల్]]
Line 66 ⟶ 67:
{{Div end}}
 
=== వికారాబాదు జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
[[దస్త్రం:Indian Airlines VT-SCF at Rajiv Gandhi Airport, Jan 2012 (2).jpg|thumb|రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం|250px]]
{{Div col|cols=2}}
Line 86 ⟶ 87:
{{Div end}}
 
=== రంగారెడ్డి జిల్లాలోని మండలాలు.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
{{Div col|cols=4}}
# [[హయాత్‌నగర్‌|హయత్‌నగర్‌]]
Line 169 ⟶ 170:
]]
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు కేవలం 6 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండగా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రంలోనే అత్యధికంగా 8 కొత్త నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు జిల్లాలో ప్రత్యేకంగా లోకసభ నియోజకవర్గం లేదు. అప్పటి అసెంబ్లీ సెగ్మెంట్లు హైదరాబాదు, నల్గొండ, మెదక్ నియోజకవర్గాలలో భాగంగా ఉండేవి. 2008 తర్వాత జిల్లాలోని 7 సెగ్మెంట్లతో ప్రత్యేకంగా చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం ఏర్పడింది. మల్కాజ్‌గిరి లోకసభలో ఉన్న 7 సెగ్మెంట్లలో 6 సెగ్మెంట్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. భువనగిరి లోకసభ నియోజకవర్గంలో జిల్లాకు చెందిన ఒక సెగ్మెంటు చేరింది.
;2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలలో, తెలుగుదేశం పార్టీ 5 స్థానాలలో విజయం సాధించాయి. లోక్‌సత్తా పార్టీ మరియు ఇండిపెంట్ సభ్యుడికి చెరో స్థానం లభించింది. మహేశ్వరం నుంచి విజయం సాధించిన [[సబితా ఇంద్రారెడ్డి]]కి రాష్ట్రమంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ లభించింది. 2012 ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వికారాబాదు నుంచి విజయం సాధించిన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రిమండలిలో చోటులభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 07-02-2012</ref> 2009లోకసభ ఎన్నికలలో మాల్కాజ్‌గిరి నుంచి సర్వే సత్యనారాయణ విజయం సాధించగా, చేవెళ్ళ నుంచి గెలుపొందిన [[సూదిని జైపాల్ రెడ్డి]] కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిపదవి లభించింది.
;ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు <ref>స్థానికపాలన, గ్రామీణ వికాస మాసపత్రిక, 2015 పేజీ 19</ref>
Line 193 ⟶ 194:
{{col-3}}
{{col-end}}
== మూలాలు ==
 
<references />
== బయటి లింకులు==
*[http://rangareddy.ap.nic.in రంగారెడ్డి జిల్లా అధికారిక వెబ్‌సైటు]
;* http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06
 
== వనరులు==
== మూలాలు ==
<references />
;http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06
 
{{తెలంగాణ}}
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు