ఆంధ్ర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 12:
|president =
|principal =
|rector =డి.గాయత్రి
|chancellor =
|vice_chancellor =ఆచార్య జి. నాగేశ్వరరావు
పంక్తి 37:
[[File:Buildings in Andhra University 01.jpg|thumb|right|250px|<center>ఆంధ్ర విశ్వవిద్యాలయం భవనాలు </center>]]
'''ఆంధ్ర విశ్వవిద్యాలయం''' లేదా '''ఆంధ్ర విశ్వకళా పరిషత్''' లేదా '''ఆంధ్రా యూనివర్సిటీ''' (Andhra University),
ఈ విశ్వవిద్యాలయం [[1926]]లో ఏర్పడింది. [[మద్రాస్ యూనివర్సిటీ]]కి అప్పుడు అనుబంధంగా ఉన్న [[కోస్తా|సర్కారు]], [[రాయలసీమ]] లలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ [[ఉపకులపతి]]గా [[కట్టమంచి రామలింగారెడ్డి]] వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో [[సర్వేపల్లి రాధాకృష్ణన్|సర్వేపల్లి రాధాకృష్ణ]] ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త ''[[న్యూమెన్ ]]'' యొక్క [[ఆదర్శ విశ్వవిద్యాలయము]] రూపులో తీర్చిదిద్దబడింది.
తర్వాత 1954 లో [[రాయలసీమ]] జిల్లాలతో [[తిరుపతి]] కేంద్రంగా [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము]] ఏర్పడింది. ఆతర్వాత, [[1967]]లో [[గుంటూరు]] లో, ఈ [[విశ్వవిద్యాలయం ]]ఒక [[పోస్టుగ్రాడ్యుయేటు]] కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో [[నాగార్జున విశ్వవిద్యాలయము]]గా అవతరించింది. దీని పేరును [[ఆచార్య నాగార్జునుడు|ఆచార్య నాగార్జునుని]] పేరిట 2004 లో '''ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము''' గా మార్చారు.
ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణము (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
విశ్వవిద్యాలయానికి [[విశాఖపట్టణం]] వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి [[శ్రీకాకుళం]], [[తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి]], [[విజయనగరం]] జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. [[శ్రీకాకుళం ]]జిల్లాలో [[ఎచ్చెర్ల]] లోను, [[తూర్పు గోదావరి]] జిల్లాలో [[కాకినాడ]] లోను, [[పశ్చిమగోదావరి]] జిల్లాలో [[తాడేపల్లిగూడెం]] లోను, విజయనగరం జిల్లాలో [[విజయనగరం]] లోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాని, [[2006]]లో [[రాజమండ్రి]]లో [[ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయము]]ను ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, [[విజయనగరం,]] విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణములో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. [[నాక్]] (NAAC) సంస్థ " ఎ " గ్రేడుతో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.
== విశ్వవిద్యాలయ చిహ్నము ==
|