మహబూబ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

Dadhush (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2483794 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
[[ ]]పేజీ గూడా లేదు
పంక్తి 21:
'''మహబూబ్ ఆలీఖాన్''' [[హైదరాబాదు]]ను పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన [[1869]] నుండి [[1911]] వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.
 
[[అఫ్జల్ ఉద్దౌలా]] క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ [[అసఫ్ జా]]గాజాగా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా [[సాలార్ జంగ్]] మరియు [[అమీర్ ఎ కబీర్]] లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై [[ముల్కీ ఉద్యమం]] తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్ మరియు [[రాజా నరేంద్ర బహదూర్]] లను సంయుక్త పాలకులుగా నియమించింది.
 
మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన [[1884]], [[ఫిబ్రవరి 5]] వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన [[లార్డు రిప్పన్]] స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/మహబూబ్_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు