దేవికారాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
1934లో "బాంబే టాకీస్" అనే సంస్థను స్థాపించి ఎందరో ఔత్సాహిక కళాకారుల్ని చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణనిచ్చారు. బాంబే టాకీస్ తీసిన చిత్రాలలో దేవికారాణి మరియు [[అశోక్ కుమార్ (హిందీ నటుడు)|అశోక్ కుమార్]] ల జంట హిట్ పెయిర్ గా పేరుపొందారు. ఈమె నటించిన 16 చిత్రాలలోని చాలా పాత్రలు సంఘర్షణాత్మకమైనవి. సమాచ వివక్షతకు గురయ్యే హరిజన యువతిగా ''అచూత్ కన్య'' (1936) లో, తల్లికాలేని గృహిణిగా ''నిర్మల'' (1939) లో, అనాథగా ''దుర్గ'' (1939), తిరగబడిన మహిళగా ''సావిత్రి'' (1937) లో విధివంచితురాలైన [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] యువతిగా ''జీవన్ ప్రభాత్'' (1937) లో ఆమె నటన అనితర సాధ్యమైనది.
 
1940 మే 19లో హిమాంశు రాయ్ హఠాన్మరణం పొందడంతో బాంబే టాకీస్ నిర్వహణ బాధ్యత ఆమె చేతిలో పడింది. తర్వాత తీసిన ''బసంత్'', ''కిస్మత్'', ''అంజానా'' మొదలైన చిత్రాలు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టాయి.
 
తర్వాత బాంబే టాకీస్ [[స్టుడియో]]<nowiki/>ను దర్శించడానికి వచ్చిన సుప్రసిద్ధ రష్యన్ చిత్రకారుడు [[స్వెతస్లోవ్ రోరిక్]] (Svetoslav Roerich) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి 1945లో వివాహానికి దారితీసింది. తర్వాత ఆమె సినీరంగానికి దూరమయ్యారు.
"https://te.wikipedia.org/wiki/దేవికారాణి" నుండి వెలికితీశారు