తరిగొండ వెంగమాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 42:
తల్లి వెంకమాంబను ఇంటి పనులలో సహాయము చేయమని కోరగా తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందముగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపములతో [[పెళ్లి]] చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప ఆమె అందమును చూసి ముగ్ధుడై ప్రేమలో పడి వెంకమాంబను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి ఆమెకు మంచిభార్యగా మసలుకోమని హితవు చెప్పి వివాహము జరిపించాడు. వివాహానంతరము వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించ ప్రయత్నము చేసాడు కానీ వెంకమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.
 
ఈమె [[తిరుమల]]లో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో [[తుంబురు కోన]] వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు [[వేంకటేశ్వరుడు]] కలలో కనుపిస్తూ ఉంటాడని అనేవారు. [[తిరుమల]]లో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో [[ముత్యాల హారతి]] ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క [[దశావతార]] ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం (ఫసలి 1230) క్రీ.శ. 1890లో [[తూర్పు ఇండియా కంపెనీవారు]] తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది.<ref>[[సప్తగిరి]] ఆధ్యాత్మిక మాస పత్రిక, [[తి.తి.దే.]] ప్రచురణ - జనవరి 2008 - డా. రమేశన్ వ్రాసిన ఆంగ్ల గ్రంథం ధారావాహికకు డా. [[కోరాడ రామకృష్ణ]] అనువాదం</ref> ఆమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించారు. చివరకు క్రీ.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ [[నవమి]]నాడు తరిగొండ వెంకమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందారు<ref name="సింహావలోకనము" />.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/తరిగొండ_వెంగమాంబ" నుండి వెలికితీశారు