యం.యస్.స్వామినాధన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి +{{Authority control}} |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB ద్వారా వర్గాల మార్పు |
||
పంక్తి 23:
}}
'''మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ '''(జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "[[హరిత విప్లవం|హరిత విప్లవ]] పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.
1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరక్టరుగా పనిచేసాడు. 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. అతను [[అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ]] కు 1982 నుండి 1988 వరకు డైరక్టరుజనరల్ గా తన సేవలనందించాడు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నాడు.<ref>[http://www.time.com/time/asia/asia/magazine/1999/990823/index.html Asians of the Century: A Tale of Titans], TIME 100: 23–30 August 1999 VOL. 154 NO. 7/8</ref> 1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20" లో అతని పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది.
పంక్తి 30:
స్వామినాథన్ 1925 [[ఆగష్టు 7]] న [[తమిళనాడు]]లోని [[కుంభకోణం]]<nowiki/>లో జన్మించాడు. అతను డా.ఎం.కె.సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. అతను తన తండ్రి నుంచి "మన మనస్సులో 'అసాధ్యం' అనే మాట సాధారణంగా వస్తుంది. దానికి ధృఢ సంకల్పంతో కృషిచేసిన తరువాత గొప్పపనులు సాధించవచ్చు." అనే విషయాన్ని నేర్చుకున్నాడు. వైద్యవృత్తిలో ఉన్న అతని తండ్రి ఎం.కె. సాంబశివన్ మహాత్మాగాంధీ అనుచరుడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల బహిష్కరణ సందర్భంగా [[కుంభకోణం]]<nowiki/>లో అతని విదేశీ దుస్తులను దగ్దం చేసాడు. స్వదేశీ ఉద్యమం భారతీయులు విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, గ్రామీణ పరిశ్రమను కాపాడడటం అనే రాజకీయ ప్రయోజనంతో రూపొందించబడినది. అతని తండ్రి తమిళనాడులో భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన దేవాలయ ప్రవేశ ఉద్యమంలో దళితుల ఆలయ ప్రవేశ కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. [[ఫైలేరియా|ఫైలేరియాసిస్]] అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న కుంభకోణం ప్రాంతంలో ఆ వ్యాధిని నిర్మూలించడానికి అతని తండ్రి కృషిచేసాడు. తన తండ్రి చేస్తున్న కార్యక్రమాల వల్ల బాల్యంలో అతనికి సేవాభావన కలిగింది.
తన 11వ యేట తండ్రి మరణించాడు. అతని భాద్యతలను అతని మామయ్య ఎం.కె.నారాయణస్వామి (రేడియాలజిస్టు) చూస్తుండేవాడు. ప్రారంభ విద్యను స్థానిక పాఠశాలలో చదివాడు. తరువాత కుంభకోణంలోని కాథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలు లో చదివి మెట్రిక్యులేషన్ ను పూర్తిచేసాడు.
ఎం.ఎస్. స్వామినాథన్ వివాహం మీనా స్వామినాథన్ తో జరిగింది. 1951లో కేంబ్రిడ్జ్ లో చదివినప్పుడు ఆమె పరిచయమయింది. వారు తమిళనాడులోని చెన్నైలో నివసించారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. వారి కుమార్తెలలో డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరక్టరు జనరల్ గానూ, రెండవ కుమార్తె డా. మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగానూ, మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
పంక్తి 39:
స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఆకాలంలో నోబెల్ బహుమతి గ్రహీత [[నార్మన్ బోర్లాగ్]] సృష్టించిన మెక్సికన్ పొట్టి [[గోధుమ]] రకాలను మనదేశంలోకి ప్రవేశపెట్టారు. వీని ప్రభావంతో పరిశోధనలు సాగించి అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను రూపొందించాడు. దీని వలన గోధుమ ఉత్పత్తి పెరిగింది.
స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో అతను జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం అంశాలలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిగా న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు మారాడు. 1949లో అతను సైటోజెనెటిక్స్ (జీవకణ నిర్మాణం, విధులకు సంబంధించిన శాస్త్రం) లో డిస్టింక్షన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అతను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష రాసి "ఇండియన్ పోలీసు సర్వీసు" కు ఎంపికయ్యాడు.<ref>996 CURRENT SCIENCE, VOL. 101, NO. 8, 25 October 2011 [http://www.currentscience.ac.in/Volumes/101/08/0996.pdf/ "IN CONVERSATION M. S. Swaminathan" Retrieved on 26 March 2013] {{dead link|date=January 2018|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref> అతను నెదర్లాండ్స్ లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళా దుంపల జన్యువులపై తన ఐ.ఎ.ఆర్.ఐ పరిశోధనను కొనసాగించడానికోసం యునెస్కో ఫెలోషిప్ ను అంగీకరించాడు. సోలానమ్ యొక్క విస్తృతమైన అడవి జాతుల నుండి సాగు బంగాళాదుంప (సోలనమ్ ట్యుబరేసం) కు జన్యువులను బదిలీ చేయడానికి కావలసిన విధానాలను ప్రామాణీకరించడంలో అతను విజయం సాధించాడు. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్ లో చదవడానికి వళ్ళాడు. అతను రాసిన "స్పెసీస్ డిఫెరెన్సియేషన్, అండ్ ద నేచుర్ ఆఫ్ పోలీఫ్లోడీ ఇన్ సెర్టయిన్ స్పెసీస్ ఆహ్ ద జెనస్ సోలానం - సెక్షన్ టుబెరారియం" అంశంపై 1952 లో పి.హెచ్.డి డిగ్రీని పొందాడు. 2014లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఫెలోషిప్ పొందాడు.
స్వామినాథన్ USDA బంగాళాదుంప పరిశోధన స్టేషన్ ఏర్పాటుకు తన సహాయం కోసం విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద ఒక పోస్ట్ డాక్టరల్ పరిశోధన కు అంగీకరించాడు. విస్కాన్సిన్లోని పరిశోధనా పనిలో అతనికి వ్యక్తిగతమైన, వృత్తిపరమైన సంతృప్తి ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి అధ్యాపక హోదాను వదలి 1954లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.<ref name="worldfoodprise.org" />
పంక్తి 52:
* 1979–80 – భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శి; ముందస్తు పెట్టుబడుల ఫారెస్టు సర్వే ప్రోగ్రాం ను ఫారస్టు సర్వీస్ ఆఫ్ ఇండియాగా మార్పు.<ref>[https://web.archive.org/web/20130508170546/http://envfor.nic.in/fsi/fsi.html Ministry of Environment & Forests, Forest Survey of India, Dehradun]. envfor.nic.in</ref>
*1981–85 – స్వతంత్ర చైర్మన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) కౌన్సిల్,రోం, మొక్కల జన్యువనరుల కమిషన్ స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర.<ref>[http://www.fao.org/ag/cgrfa/ FAO, Commission on Genetic Resources for Food and Agriculture]. Fao.org (22 June 2016). Retrieved on 2016-06-29.</ref>
*1983 – రైతుల హక్కుల భావన, ప్లాంట్ జెనెటిక్స్ రీసోర్సెస్ కు గ్రంథం రూపకల్పనను అభివృద్ధి చేశాడు.
*1982–88 – డైరక్టరు జనరల్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IRRI), అంతర్జాతీయ రైస్ జెర్మ్ప్లాసం వ్యవస్థాపన, ప్రస్తుతం [https://web.archive.org/web/20031117153304/http://www.irri.org/GRC/irg/biodiv-genebank.htm అంతర్జాతీయ రైస్ జెనీబ్యాంకు].
*1984–90 – అధ్యక్షుడు, అంతర్జాతీయ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ ( IUCN), జీవవైవిధ్యం మీద సమావేశం అభివృద్ధి.
పంక్తి 59:
*1988–91 –ఇంటర్నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, కీస్టోన్ ఇంటర్నేషనల్ డైలాగ్ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్.,<ref>Final Consensus Report of the Keystone International Dialogue Series on Plant Genetic Resources: Madras Plenary Session, February 1990, Report # 27 [http://www.keystone.org/spp/envplant_genetics.html]{{dead link|date=January 2018|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref> మొక్కల జెర్మ్ప్లాజం లభ్యత, ఉపయోగం, మార్పిడి మరియు రక్షణ గురించి కృషి.
*1991–1995 – సభ్యుడు, గవర్నింగ్ బోర్డు, ఆరోవిల్లీ ఫౌండేషన్.
*1988–96 – అధ్యక్షుడు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ - ఇండియా WWF,<ref>[http://www.wwfindia.org/ World Wide Fund for Nature/India]. Wwfindia.org. Retrieved on 29 June 2016.</ref> ఇందిరాగాంధీ పర్యవేక్షణ, పరిరక్షణ కేంద్రం నడుపుట.
*1988–99 – చైర్మన్/ట్రస్టీ, కామన్వెల్త్ సెక్రటేరియట్ ఎక్స్పర్ట్ గ్రూపు.,<ref>
Commonwealth and Government of Guyana Establish International Centre for Rain Forest Conservation and Development, 9 November 1995.{{cite web |url=http://www.thecommonwealth.org/press/31555/34582/140906/commonwealth_and_government_of_guyana_establish_in.htm |title=Archived copy |accessdate=2010-06-16 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090705084132/http://www.thecommonwealth.org/press/31555/34582/140906/commonwealth_and_government_of_guyana_establish_in.htm |archivedate=5 July 2009 |df=dmy-all }}</ref> గయానాలోని ఉష్ణమండల వర్షారణ్యాల నిర్వహణ, రైన్ ఫారెస్టు పరిరక్షణ, అభివృద్ధి కోసం ఇవోక్రమ ఇంటర్నేషనల్ సెంటర్ నిర్వహణ.,<ref>"Iwokrama International Centre for Rain Forest Conservation and Development, "The Establishment of Iwokrama Forest"
పంక్తి 96:
{{Authority control}}
[[వర్గం:
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:1925 జననాలు]]
|