మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
|||
పంక్తి 149:
[[File:Ashoka pillar at Vaishali, Bihar, India.jpg|thumb| Ashoka pillar at [[Vaishali (ancient city)|Vaishali]].]]
[[File:6thPillarOfAshoka.JPG|thumb|Fragment of the 6th Pillar [[Edicts of Ashoka|Edict of Ashoka]] (238 BCE), in [[Brāhmī script|Brahmi]], sandstone, [[British Museum]].]]
యువ యువరాజుగా, అశోక (క్రీ.పూ. 272 - 232) ఉజ్జయిని, తక్షశిలలో తిరుగుబాట్లను అణిచివేసిన తెలివైన శక్తిగా ఉన్నాడు. చక్రవర్తిగా ఆయన ప్రతిష్టాత్మకంగానూ ఆవేశపూరితంగానూ ఉన్నాడు. దక్షిణ, పశ్చిమ భారతదేశంలో సామ్రాజ్యం ఆధిపత్యాన్ని తిరిగి నొక్కి చెప్పాడు. కానీ ఆయన కళింగ (క్రీ.పూ. 262–261) ను జయించడం అతని జీవితంలో కీలకమైన సంఘటనగా నిరూపించబడింది. అశోక కళింగను ఒక పెద్ద ప్రాంతం మీద అధికారాన్ని స్థిరపరచడానికి అక్కడ ఒక కోటను నిర్మించాడు.<ref>{{Cite book|title=The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States|last=Allchin|first=F.R.|last2=Erdosy|first2=George|publisher=Cambridge University Press|year=1995|location=Cambridge|pages=306}}</ref> రాజ సైనికులు, పౌర విభాగాల కళింగ దళాల మీద అశోకుడి సైన్యం విజయం సాధించినప్పటికీ తీవ్ర ఆవేశంతో జరిగిన యుద్ధంలో సైనికులు, పౌరులు కలిసి 1,00,000 మంది మరణించారు. ఇందులో 10,000 మందికి పైగా అశోకుడికి చెందిన సైనికులు ఉన్నారు. లక్షలాది మంది ప్రజల మరణం, యుద్ధవిధ్వంసం అశోకుడు ప్రతికూలంగా ప్రభావితమయ్యాడు. వినాశనాన్ని వ్యక్తిగతంగా చూసిన అశోకుడు పశ్చాత్తాపం చెందడం ప్రారంభించాడు. కళింగ అనుసంధానం పూర్తయినప్పటికీ అశోకుడు బౌద్ధమతం బోధలను స్వీకరించాడు. ఫలితంగా ఆయన యుద్ధం, హింసను త్యజించాడు. ఆయన ఆసియా చుట్టూ పర్యటించడానికి, బౌద్ధమతాన్ని ఇతర దేశాలకు వ్యాప్తి చేయడానికి మతబోధకుల బృందాలను పంపించాడు.{{citation needed|date=August 2016}}
అశోకుడు అహింసా సూత్రాలతో వేట, హింసాత్మక క్రీడా కార్యకలాపాలను నిషేధించడానికి ఒప్పంద, బలవంతపు శ్రమకు ముగింపు అమలు చేశాడు (యుద్ధంలో దెబ్బతిన్న కళింగలో వేలాది మంది ప్రజలు శ్రమ, దాస్యంలోకి నెట్టబడ్డారు). ఆయన ఒక పెద్ద, శక్తివంతమైన సైన్యాన్ని కొనసాగిస్తూ శాంతిని స్థాపించాడు. అధికారాన్ని కొనసాగిస్తూ అశోకుడు ఆసియా, ఐరోపాలలో రాజ్యాలతో స్నేహపూర్వక సంబంధాలను విస్తరించాడు. ఆయన బౌద్ధ కార్యకలాపాలకు మార్గదర్శకం చేశాడు. ఆయన దేశవ్యాప్తంగా భారీ మౌలిక నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాడు. 40 ఏళ్ళకు పైగా శాంతి సామరస్యం, శ్రేయస్సు అశోకడిని భారతీయ చరిత్రలో అత్యంత విజయవంతమైన, ప్రసిద్ధ రాజులలో ఒకటిగా చేసింది. ఆయన ఆధునిక భారతదేశంలో ప్రేరణకలిగించిన ఆదర్శవంతమైన చక్రవర్తిగా మిగిలిపోయాడు.{{citation needed|date=August 2016}}
రాతితో అమర్చబడిన అశోకుడి శాసనాలు ఉపఖండం అంతటా కనిపిస్తాయి. పశ్చిమాన ఆఫ్ఘనిస్తాను, దక్షిణాన ఆంధ్ర (నెల్లూరు జిల్లా) వరకు అశోక శాసనాలు ఆయన విధానాలు, విజయాలను తెలియజేస్తాయి. ప్రధానంగా ప్రాకృతంలో వ్రాయబడినప్పటికీ వాటిలో రెండు గ్రీకు భాషలో, ఒకటి గ్రీకు - అరామికు భాషలలో వ్రాయబడ్డాయి. అశోకుడి శాసనాలు గ్రీకులు, కంబోజులు, గాంధారులు ఆయన సామ్రాజ్యం సరిహద్దు ప్రాంతం ప్రజలుగా ఉన్నట్లు సూచిస్తాయి. పశ్చిమంలోని గ్రీకు పాలకులకు మధ్యధరా వరకు అశోకుడు దూతలను పంపినట్లు వారు ధృవీకరిస్తున్నారు. ఆ సమయంలో హెలెనికు ప్రపంచంలోని ప్రతి పాలకులైన అమ్టియోకో (ఆంటియోకసు), తులమయ (టోలెమి), అమ్టికిని (ఆంటిగోనోసు), మాకా (మాగాసు), అలికసుదారో (అలెగ్జాండరు) అశోకుడు మతమార్పిడి గ్రహీతలుగా ఈ శాసనాలు ఖచ్చితంగా పేరు పెట్టాయి. శాసనాలు తమ భూభాగాన్ని "600 యోజనాల దూరంలో" (ఒక యోజనాలు 7 మైళ్ళు) ఖచ్చితంగా గుర్తించాయి. ఇది భారతదేశం, గ్రీసు మధ్య (సుమారు 4,000 మైళ్ళు) దూరానికి అనుగుణంగా ఉంటుంది.<ref>[[Edicts of Ashoka]], 13th Rock Edict, translation S. Dhammika.</ref>
===పతనం===
|