కొండవీడు కోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మీడియా పైల్ ఎక్కించాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మీడియా ఫైల్స్ సవరించాను |
||
పంక్తి 1:
[[File:Kondavid6.jpg|thumb|కొండవీడు కోట|alt=|220x220px]]
[[కొండవీడు|కొండవీడు కోట]], [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]],[[యడ్లపాడు]] మండలంలోని [[కొండవీడు]] గ్రామ పరిధిలోని పర్యాటక ప్రదేశం.
==చరిత్ర==
[[దస్త్రం:Kondavid-drug. Signed 'W.R.'.jpg|thumb|
ఇక్కడవున్న దుర్గం రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ఉంది. ఐతే, ప్రస్తుతం వారి పరిపాలనకు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ బౌద్ధనాగరికత ఉందన్న వాదనలు కూడా వున్నాయి.
===కొండవీడు దుర్గంలో బౌద్ధం ఆనవాళ్ళు ===
ఇప్పటి
కొండవీడు కొండల మీద టెర్రాస్ స్థూపాలు కన్పిస్తున్నాయి. ఈ స్థూపాలు వేదికలాగా ఉంటాయి. ఇవి శాతవాహనుల కాలం నాటి పెద్దపెద్ద ఇటుకలతో నిర్మితమయ్యాయి. అలాగే బౌద్ధ విహారాల పైకప్పుల కోసం ఉపయోగించుకొనే పెంకులు, మట్టిపాత్రల శకలాలు కూడా ఇక్కడ దొరికాయి. కొండవీడు కొండలు సముద్ర మట్టానికి పదిహేడు వందల ముఫ్పై అయిదు అడుగుల ఎత్తులో ఉన్నాయి.శాతవాహనులు క్రీస్తు పూర్వం 1, 2 శతాబ్దాల నాటికి ధాన్యకటకాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలించారు.కొండవీడు కొండల మీద కూడా శాతవాహనుల కాలంలోనే బౌద్ధం వ్యాపించిందన్నందుకు ఆధారాలు దొరికాయి. ఈ కొండల మీద కాలిబాటకు రెండు వైపులా పైభాగంలో కూడా బౌద్ధ స్థూపాలను నిర్మించిన ఆధారాలు దొరికాయి. ఎత్తయిన కొండల మీద ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో వేదికల మీద నిర్మించిన స్థూపాలను టెర్రాస్ స్థూపాలని అంటారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, భట్టిప్రోలు, మల్లెపాడు (తెనాలి) లాంటి ప్రాచీన బౌద్ధక్షేత్రాల దగ్గర మాత్రమే అతి పెద్ద పరిమాణంలో యాభై ఎనిమిది సెంటీమీటర్ల పొడవు, ముప్ఫయి సెంటీమీటర్ల వెడల్పు, పది సెంటీమీటర్ల మందం కలిగిన పెద్ద ఇటుకలు దొరికాయి. అలాగే కొండవీడు కొండపైన చైనా దేశానికి చెందిన సెల్డన్వేర్గా పేరున్న కొన్ని పింగాణీ పాత్రలకు చెందిన ముక్కలు కూడా లభించాయి.<ref>జూలై 16, 2010 ఈనాడు గుంటూరు జిల్లా అనుబంధం</ref>
==దర్శనీయ ప్రదేశాలు==
ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు [[చెరువు]]<nowiki/>లోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), [[శ్రీకృష్ణదేవరాయలు]] ప్రతిష్ఠించిన [[ధ్వజస్తంభం]], [[ఆలయం]] లోపల, బయట గోడల మీద అపరూప [[శిల్పం|శిల్ప]] సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 [[దేవాలయాలు]], గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, [[మసీదు]], ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. [[కొండవీడు]] కోటను [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] రక్షిత కట్టడంగా గుర్తించింది.<ref>{{cite news|title=తెలుగు రాష్ట్రాలలో చారిత్రక కట్టడాలు !
|