;[[కాకతీయ సామ్రాజ్యం|కాకతీయ సామ్రాజ్య]] పతనానంతరం దానిని ఆశ్రయించుకున్న సామంత రాజులు, సేనానాయకులూ, స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. అటువంటి వాటిలో [[కమ్మ]] కులానికి చెందిన మహారాజ్యాలురాజ్యాలు....[[రెడ్డి]] రాజ్యాలు.. వెలమ ప్రభువుల రాజ్యాలు ముఖ్యమైనవి. ఈ కాలంలోనే అటు [[విజయనగర సామ్రాజ్యం]] కూడా ఏర్పడింది. వీటిలో రెడ్డి రాజ్యమే ప్రాముఖ్యం వహించింది. రెడ్డి రాజులు ముఖ్యంగా [[అద్దంకి]], [[కొండవీడు]], [[రాజమహేంద్రవరము]], [[కందుకూరు]] ప్రాంతాలలో క్రీ.శ. 1324 నుండి దాదాపు 1425 వరకు రాజ్యం చేశారు. వారి రాజ్యం [[కర్నూలు జిల్లా]] నుండి [[విశాఖపట్టణం]] వరకూ దక్షిణాన [[నెల్లూరు]] వరకూ విస్తరించింది. [[కొండవీడు]] [[గుంటూరు జిల్లా]]లో ప్రసిద్ధి కెక్కిన దుర్గం. దీని చుట్టు కొలత సుమారు ముప్పయి మైళ్ళుంటుంది. పర్వతాగ్రమే రెండున్నర మైళ్ళ వరకూ వుంటుంది. పర్వతాగ్రంలో మొత్తం 50 దుర్గాలవరకూ ఉన్నాయి. క్రింది భాగంలో వుంది కొండవీడు పట్టణం. ఆనాటి ఆ పట్టణం ఈ నాడు గ్రామంగా ఉంది. శత్రుదుర్భేద్యమై చూచేవారికి ఆత్యాశ్చర్యం కలిగించే ఈదుర్గం కాకతీయాంధ్ర చక్రవర్తుల కాలం నుంచి ముఖ్య రాజదానిగా విరాజిల్లడం వల్ల బహు ప్రాచీనమైన దని చెప్పవచ్చు.