మిరాసి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 23:
పశ్చిమ ఉత్తర ప్రదేశులో సమాజంలో సమైఖ్యత ఉంది. ఇది ప్రధానంగా మీరటు, ముజఫరు నగరు, బులంద్షహరు జిల్లాల్లో కనిపిస్తుంది. చారిత్రాత్మకంగా మిరాసి రెబారి వర్గానికి చెందిన వంశావళి శాస్త్రవేత్తలు పనిచేసేవారు. రెబారీలతో వారు రాజస్థాను నుండి వచ్చారు. వారికి " ముఖియా " అనే సాంప్రదాయ కుల మండలి ఉంది. కుల మండలి సమాజ నియమాలను ఉల్లంఘించేవారిని శిక్షించడం, వివాదాలను పరిష్కరించడం, అనైతిక కార్యకలాపాలను నిరోధించడం వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు. వారు సున్నీ ముస్లింలు అయినప్పటికీ సిక్కు గురువులు, హిందూ దేవుళ్ళను కూడా ఆరాధిస్తారు. మిరాసి ప్రామాణిక ఉర్దూ మాట్లాడుతారు. అయినప్పటికీ చాలా మంది హిందీ భాష సంబంధిత వివిధ మాండలికాలను మాట్లాడగలరు. లక్నోకు చెందిన నక్వలు ప్రజలు ఉత్తర ప్రదేశు మిరాసిల ముఖ్యమైన ఉప సమూహంగా ఉంది.<ref>People of India Uttar Pradesh Volume XLII Part Two edited by A Hasan & J C Das page 974</ref>
===
16 వ శతాబ్దంలో మిరాసీలు ఉత్తర ప్రదేశు నుండి బీహారుకు వచ్చినట్లు పేర్కొనబడింది. బీహారులోని చాలా మంది జమీందార్ల ఆస్థానంలో సంగీతకారులు ఉన్నారు. జమీందారీ వ్యవస్థను రద్దు చేయడంతో మిరాసీలు వ్యవసాయ వృత్తిని స్వీకరించారు. వివాహాలు, అంత్యక్రియలు వంటి ప్రత్యేక సందర్భాలలో పాటలు పాడటానికి కొంతమందిని ఇప్పటికీ వీరిని పిలుస్తారు. చాలా మంది మిరాసిలు ఇప్పుడు షియా, మొహరం ఉత్సవాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వీరు ప్రధానంగా భాగల్పూరు, భోజ్పూరు, గయా, ముంగేరు, నలంద, పాట్నా జిల్లాలలో కనిపిస్తారు. మిరాసీ తమలో తాము మగధీ భాషలో సంభాషిస్తారు. అలాగే బయటి వ్యక్తులతో ఉర్దూలో సంభాషిస్తారు. ఇతర మిరాసి వర్గాల మాదిరిగా కాకుండా బీహారు మిరాసి ఎప్పుడూ వంశావళి శాస్త్రవేత్తలుగా పనిచేయలేదు. పమారియా సమాజం బీహారు మిరాసి ప్రధాన ఉపవిభాగంగా ఉన్నారు.<ref>People of India Bihar Volume XVI Part Two edited by S Gopal & Hetukar Jha pages 683 to 685 Seagull Books</ref>
=== In Delhi ===
|