స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: AWB తో వర్గం మార్పు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 22:
1921 అక్టోబరు 11న కడప చేరుకున్న ఈ విద్యార్థులు కడప, గుంటూరు తదితర ప్రాంతాల నుండి విచ్చేసిన ఇతర విద్యార్థులతో కలసి పలు ప్రాంతాలలో ప్రజలను సమీకరించి సభలు-సమావేశాలు నిర్వహించారు. ఖిలాఫత్- సహాయనిరాకరణ ఉద్యమ కమిటీలను ఏర్పాటు చేశారు. అక్టోబరు 21న కడపలో ఆరువేల మంది హజరైన సభలో 2,500 రూపాయల విరాళాలను ఉద్యమం కోసం ప్రజల నుండి సేకరించారు. ప్రజల అభీష్టానికి అనుకూలంగా ప్రజా డిమాండ్ను మరింతగా పునరుద్ఘాటిస్తూ 1400 మంది చేత సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ చర్యలతో ఖంగుతిన్న ప్రభుత్వం 1921 అక్టోబరు 21న ఆ విద్యార్థి నాయకులను అరెస్టు చేసి, ఆరు మాసాల జైలు శిక్షను విధించింది. ఆనాటి అలీఘర్ విద్యార్థుల చర్యలు ఆంధ్రలోని పలు కళాశాలల అధ్యాపకులను కూడా ఆమితంగా ఆకట్టుకున్నాయి. ఆ విద్యార్థుల చర్యల స్ఫూర్తితో ఆజం కళాశాలకు చెందిన తర్కశాస్త్ర అధ్యాపకులు అబ్దుల్ ఖాదర్ అలీ తమ కళాశాలను బహిష్కరించాలని నిర్ణయిచుకోవడం మాత్రమే కాకుండా సహచర ఆధ్యాపకులకు సలహా ఇచ్చి ప్రోత్సహించారు. ఈ ఉద్యమంలో అటు మేధావులు ఇటు సామాన్య ప్రజలు కూడా అమితోత్సాహంతో పాల్గొన్నారు. రాయలసీమకు చెందిన బీడి కార్మికుడు కరీం సాహెబ్ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆరు మాసాల జైలుశిక్ష 160 రూపాయల జరిమానాను భరించారు. అలీసోదరులు, [[మహాత్మాగాంధీ]] ఆదేశాలను తు.చ తప్పకుండా ఆచరిస్తూ ప్రజలు ఏకోన్ముఖంగా ముందుకు సాగారు. ఈ విధంగా వివిధ సామాజిక జనసముదాలు ఏకమై ఉద్యమించడంతో ఉద్యమం జాతీయస్థాయి రూపాన్ని సంతరించుకుంది.
==మహాత్మాగాంధీ
భారతదేశ పర్యటనలో భాగంగా, ఖిలాఫత్ ఉద్యమ ప్రముఖులైన ఆలీ సోదరులతో కలిసి గాంధీజీ ఆంధ్రకు వచ్చారు. చరిత్ర సృష్టించిన ఈ పర్యటన విజయవాడ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహాత్ముడు 1920 జనవరి 1న జరిగిన సభలో ప్రసంగిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం అందజేసిన బిరుదులను త్యజించాలని, పదవులను వదులుకోవాలని కోరారు. ఆ పిలుపుకు విజయవాడకు చెందిన జాగీర్దార్ [[ముహమ్మద్ గులాం మొహియుద్దీన్]] సాహెబ్ తక్షణమే స్పందించారు. ఆయన నిర్వహిస్తున్న గౌరవ మేజిస్ట్రేటు పదవికి తక్షణమే రాజీనామా చేశారు. ఆ విధంగా గాంధీజీ పిలుపుకు స్పందించి ప్రభుత్వ పదవిని త్యజించిన తొలి ఆంధ్రుడిగా గులాం మొహిద్దీన్ ఖ్యాతిగాంచారు. గాంధీజీ పిలుపు మేరకు, ప్రభుత్వ పదవులు దిగతుడుపుగా భావించిన మహమ్మద్ గులాం మొహిద్దీన్ స్ఫూర్తితో, మద్రాసు అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఖాజీ అహ్మదుల్లా, ఖాన్ సాహెబ్, అన్వర్ జమాఖాన్ సాహెబ్, అబ్దుల్ మజీద్ తదితర ప్రముఖులు ఎన్నికలను బహిష్కరిస్తూ తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నారు. రాయలసీమ యోధుడు యం. షంషీర్ బేగ్ తన చదువుకు స్వస్తి పలికి విశ్వవిద్యాలయాన్ని వదిలి వచ్చేశారు. 1921లో బెజవాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. అన్నివర్గాల ప్రజలు పాల్గొని పండగలా జరుపుకున్న ఈ సమావేశాలలో [[మహాత్మాగాంధీ]], ఇతర జాతీయ నాయకులతో పాటుగా అబ్బాస్ తయ్యాబ్జీ, [[హకీం అజ్మల్ ఖాన్]], [[మౌలానా అబుల్ కలాం ఆజాద్]], [[ముహమ్మద్ అలీ]], [[మౌలానా షౌకత్ అలీ]], [[ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్]] లాంటి ముస్లిం ప్రముఖులు విచ్చేశారు. ఆంధ్ర నాయకులు క్రియాశీల పాత్ర వహించిన ఈ సమావేశాలలో స్థానిక నాయకుడు షఫీ అహమ్మద్ ప్రముఖ పాత్ర వహించారు. ఈ సమావేశాల నిర్వహణకు విజయవాడకు చెందిన జాగీర్దార్ మహమ్మద్ గులాం మొహిద్దీన్ సాహెబ్ తన ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేశారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రసాదించిన పదవులు, బిరుదులు వదులుకోమని, సంపూర్ణ సహాయ నిరాకరణ పాటించమని జాతీయ నాయకులు ఇచ్చిన పిలుపును అందుకుని ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చెందిన మౌల్వీ జాహిద్ హసన్ సాహెబ్, జమాల్ మొహిద్దీన్ సాహెబ్, షంషుల్ ఉలేమా, ఖాన్ సాహెబ్ ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించిన పలు గౌరవ బిరుదులను, పదవులను తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. గుంటూరుకు చెందిన మౌల్వీ మహమ్మద్ రజాఖాన్ బెల్గామి ఖిలాఫత్ సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. ఆయన ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మండల ఖిలాఫత్ సంఘానికి అధ్యక్షత వహించారు. [[ఖిలాఫత్ కమిటీ]] ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా హిందూపురం మేజిస్ట్రేట్ ముహమ్మద్ హుస్సేన్ సాహెబ్, నబీ సాహెబ్ బహదూర్, టిప్పూ ఖాన్ తమ ఉద్యోగాలకు రాజీనామాలు సమర్పించారు. ఆదోనికి చెందిన రోషన్ ముల్లా 1920 జూన్లో ఆదోని మున్సిపాలిటీ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఆనాడు ఇటువంటి త్యాగాలు అసంఖ్యాకంగా సాగాయి. అధికార అనధికార పదవులలో ఉన్నవారంతా తమ హోదాలకు, పదవులకు, ఆంగ్ల ప్రభుత్వ మెహర్బానికి సామూహికంగా రాజీనామాలు సమర్పించారు. కర్నూలుకు చెందిన న్యాయవాది సయ్యద్ సాబ్ మొహిద్దీన్ ఖాద్రి బియబాని వేలాది రూపాయల సంపాదనను ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని వదిలేసి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ జాకీర్ హుస్సేన్లచే ప్రభావితులైన ఆయన జీవితాంతం జాతీయవాదిగా, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగిన పోరాటంలో సయ్యద్ సాబ్ మొహిద్దీన్ ఖాద్రి బియబాని భాగస్వామ్యం వహించడం మాత్రమే కాదు జాతీయోద్యమానకి తన 500 ఎకరాల భూమిని దానం చేశారు. గాంధీజీ పిలుపునందుకుని న్యాయవాద వృత్తిని వదులుకున్న వారిలో విజయవాడకు చెందిన జనాబ్ అలీ బేగ్ మరొకరు. అలీబేగ్ ఆనాటి రాజకీయాలలో ప్రముఖ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించడమేకాక, పార్లమెంటు సభ్యునిగా ప్రజలకు సేవలందించారు. 1921 ఏప్రిల్లో మద్రాసులో మహాత్మాగాంధీ పాల్గొంటున్న సభలో వలియుల్లా బాద్షా సాహెబ్, నాదర్ సాహెబ్ తదితర ప్రముఖులు పాల్గొని ప్రజలను ఉద్యమించమని ప్రోత్సహిస్తూ ఉద్వేగంగా ప్రసంగాలు చేశారు.ఈ సందర్భంగా ఖిలాఫత్-సత్యాగ్రహోద్యమాల ప్రాముఖ్యతను వివరిస్తూ, హిందూ-ముస్లింల ఐక్యత ఎంత అవసరమో ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా ఖిలాఫత్-సహాయనిరాకరణ ఉద్యమంలో ప్రముఖులుగా ఖ్యాతి గాంచిన అలీ సోదరులలో ఒకరైన మౌలానా ముహమ్మద్ అలీతో కలసి మహాత్మాగాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 1921 సెప్టెంబరు 13న కలకత్తా నుండి రైలులో విశాఖపట్నం వచ్చారు. ఆ ప్రముఖులు విశాఖపట్నం చేరగానే పోలీసులు ముహమ్మద్ అలీని అరెస్టు చేశారు. ఈ అరెస్టు ప్రజలలో ఆగ్రహావేశాలను రగిల్చింది. ఆ సమయంలో అలీని అరెస్టు చేసినందుకు విశాఖపట్నం యోధుడు రజాక్ ఎంతో ఆందోళన చెందారు, ఆగ్రహించారు. పోలీసులు ముందుకు సాగకుండా ఆయన అడ్డుపడ్డారు. అలీని పోలీసుల తీసుకెళ్లకుండా అటంకపర్చి అల్లరి లేవదీశారు. ఆ సమయంలో మౌలాను అరెస్టు చేసినందుకు ...విచారం కలిగితే స్వదేశీ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా సూచిస్తూ, ప్రజలు శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని మహాత్ముడు కోరారు. (దేశ స్వాతంత్య్రోద్యమంలో విశాఖ జిల్లా స్థానం, విశాఖజిల్లా దర్శిని, విశాఖపట్నం, 2002
==చీరాల పేరాల ఉద్యమ కాలం ==
పంక్తి 66:
* [నా జీవిత కథ -నవ్యాంధ్రము, అయ్యదేవర కాళేశ్వరరావు, పేజీ 327.]
* [ముల్కి (కొలుపుల దస్తర్) ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక, సంపాదకులు వేముల ఎల్లయ్య, స్కై బాబ, డిసెంబరు 2003-మే 2004, హైదరాబాద్.]
* [దేశ స్వాతంత్య్రోద్యమంలో విశాఖ జిల్లా స్థానం, విశాఖజిల్లా దర్శిని, విశాఖపట్నం, 2002
==సూచికలు==
|