నడమంత్రపు సిరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 39:
* నిర్మాతలు: ఎం.సాంబశివరావు, వందనం
==సంక్షిప్తకథ==
పెసరట్ల భూషయ్య దశ తిరగడంతో దాదాపు దశాబ్దంగా ఉంటూ వచ్చిన పాత కొంపను వదిలి లంకంత భవనం కట్టుకుని అందులోకి మకాం మార్చాడు. తన వేషధారణలో మార్పు వచ్చింది. ఎదిగి వచ్చిన కొడుకు, కూతురు ఉండి కూడా కామిని అనే నాట్యకత్తెను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అది తెలిసి ఎదిరించిన ఇంటిల్లిపాదీ ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవలసి వచ్చింది. జమాలుద్దీన్ అబూబేకర్ యువరాజూ, పారిశ్రామికవేత్త ధర్మభోజా, ఆయన కార్యదర్శి దిల్వార్ ఖాన్ బిస్మిల్లా ఒక పెద్ద హోటల్లో మకాం చేశారనీ, వారు ప్రతియేటా నూటికి మూడు వంతుల వంతున మూడు రెట్ల లాభం వచ్చేలా పూచీ ఇవ్వగలరని తెలిశాక భూషయ్య తన యావదాస్తినీ పెట్టుబడిగా పెట్టేశాడు. కామిని తన పేరునే ఆ వాటాలన్నీ మార్చమని భూషయ్యకు తెలియకుండా భోజాను కోరింది. ఈ విషయం భూషయ్యకు ఎలాగో తెలిసిపోయింది. కానీ భూషయ్యను నిర్బంధించి భవంతిని కూడా కామిని పేరుమీద వ్రాసిపెట్టాలని ఒత్తిడి పెరిగింది. అతన్ని చూడటానికి వచ్చిన కూతురు రాధను కూడా దుర్మార్గులు బంధించారు<ref name="జ్యోతి రివ్యూ">{{cite news |last1=తుర్లపాటి |title=చిత్రసమీక్ష నడమంత్రపుసిరి |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=63259 |accessdate=6 April 2020 |work=ఆంధ్రజ్యోతి దినపత్రిక |date=22 September 1968}}</ref>.
== పాటలు ==
|