రాముడు భీముడు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ. రాముడు శాంతకుమారి కొడుకు. తండ్రి లేడు. మేనమామ(రాజనాల) ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముడ్ని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటుంటాడు. భీముడు పల్లెటూర్లో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు. మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని పరిస్తితుల్లో ఒకరి స్థానం లో ఒకరు ప్రవేశిస్తారు. మేనమామ కి రాముడి స్థానంలో ఉన్న భీముడు బుద్ధి చెబుతాడు. రాముడు భీముడు అన్నదమ్ములని తెలుస్తుంది. రాముడు పల్లె పడుచు ఎల్.విజయలక్ష్మి ని భీముడు పట్నం పిల్ల జమున ను పెళ్ళాడతారు.
==ట్రెండ్ సెట్టింగ్==
రాజు పేద నవలలో ఒకే పోలికతో ఉన్న యువరాజు, పేద బాలుడు స్థానాలు మారుతారు. అదే విషయం మీద ఆధారపడి రాముడు భీముడు కథ తయారయ్యింది. తెలుగు లో విజయవంతమయ్యాక తమిళ హిందీ భాషల్లో నిర్మించబడింది. హిందీ లో రామ్ ఔర్ శ్యామ్ గా దిలీప్ కుమార్ నటించారు. అక్కడ కూడా విజయవంతమయ్యింది. అదేకథను జెండరు మార్పు తో హేమమాలిని ద్విపాత్రాభినయం తో 'సిప్పీ' లు సీత ఔర్ గీత తీశారు. అదే కథ ను మళ్ళీ తెలుగులో గంగ మంగ (వాణిశ్రీ) గా తీశారు. ఎ.ఎన్.ఆర్ 'శ్రీరామరక్ష'చిత్రకథ కూడా దీనిని పోలి ఉంటుంది.చిరంజీవి నటించిన యముడుకి మొగుడు చిత్రంలో కూడా రాముడు భీముడు చిత్ర ఛాయ లు కనిపిస్తాయి. బాలకృష్ణ హీరో గా రాముడు భీముడు వచ్చింది. అందులోనూ అవే ఛాయలున్నాయి. హిందీ లో శ్రీదేవి చిత్రం చాల్ బాజ్ , సీతా ఔర్ గీతా ను పోలి ఉంటుంది.
 
==పాటలు==