పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
|||
పంక్తి 68:
పొట్టి శ్రీరాములు [[1930]]లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ [[1941]]-[[1942|42]] సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమాల్లో]] పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. అతని [[గురువు]] ప్రపంచానికే గురువు, సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ, [[కులపతి]] (గాంధీ) ఆదరాన్నీ చూరగొన్నాడు." <ref name=hindu1 />
[[గుజరాత్]] రాష్ట్రంలోని [[రాజ్కోట్ లోకసభ నియోజకవర్గం|రాజ్కోట్]]
గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని [[ఆమరణ నిరాహారదీక్ష]] ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. అప్పుడు మహాత్మా గాంధీ [[టంగుటూరి ప్రకాశం]]కు ఇలా వ్రాశాడు - "హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)". - 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది.<ref>[http://www.hindu.com/thehindu/mp/2002/11/11/stories/2002111101540200.htm హిందూ పత్రికలో ఈ వ్యాసం] --11/11/2002 - The martyr of Telugu statehood</ref>
జీవితం చివరిదశలో [[నెల్లూరు]]
==ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష==
{{ఆధునికాంధ్రచరిత్ర}}
మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు [[మద్రాసు]]లో [[1952]] [[అక్టోబర్ 19]]న [[బులుసు సాంబమూర్తి]] ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు.<ref>{{cite wikisource|last1=తుర్లపాటి|first1=కుటుంబరావు|title=నా కలం - నా గళం|chapter=ఆత్మకథ విషయపేజీలు|year=2012|publisher=సుందర శేషమాంబ పబ్లికేషన్స్}}</ref> చివరికి [[1952]] [[డిసెంబర్ 15]] అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. [[మద్రాసు]]
==మరణం==
|