రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
| website =
}}
[[ఓరుగల్లు]]ను పరిపాలించిన [[కాకతీయులు|కాకతీయ]] రాజులు నిర్మించిన చారిత్రక [[దేవాలయం]] రామప్ప దేవాలయం.'''[[రామప్ప దేవాలయము|రామప్ప దేవాలయం]]''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన [[వరంగల్లు]] పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని [[పాలంపేట]] అనే ఊరి దగ్గర ఉంది.దీనినే ''' రామలింగేశ్వర దేవాలయం ''' అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది [[ములుగు]] జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.పాలంపేట చారిత్రత్మాక గ్రామం. [[కాకతీయులు|కాకతీయుల]] పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.<ref>{{cite web|url=http://www.indiayogi.com/content/temples/palampet.asp|title=పాలంపేటలో ఉన్న శివాలయాలు|website=|access-date=2007-08-22|archive-url=https://web.archive.org/web/20061018203824/http://www.indiayogi.com/content/temples/palampet.asp|archive-date=2006-10-18|url-status=dead}}</ref> కాకతీయ రాజు [[గణపతి దేవుడు]] ఈ దేవాలయంలో వేయించిన [[శిలాశాసనం]] ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.<ref name="ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం">{{cite news |last1=Namasthe Telangana |title=ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం |url=https://www.ntnews.com/sunday/bathukamma-news-18072021-6-146900/ |accessdate=26 July 2021 |work= |date=25 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210723192807/https://www.ntnews.com/sunday/bathukamma-news-18072021-6-146900/ |archivedate=23 జూలై 2021 |url-status=live }}</ref>
 
== హెరిటేజ్ వారసత్వ హోదా హెరిటేజ్ ==
 
కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌ లో నిర్వహిస్తున్ననిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. రామప్పకు వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి మన దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం. యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా ఎనిమిది వందల సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని నిధులు వచ్చి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తద్వారా రామప్ప పర్యాటక ప్రాంతంగా దేశవ్యాప్త గుర్తింపుకు నోచుకుంటుంది.
 
ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కో కు నామినేట్ చేసింది.
"https://te.wikipedia.org/wiki/రామప్ప_దేవాలయం" నుండి వెలికితీశారు