ఆయన ఆరో ఏట నుంచే నాట్యాభ్యాసం ప్రారంభించారు. చదువులో వెనుకబడితే, దాన్ని మళ్లీ పట్టుకుని ఇంటి దగ్గరే [[తెలుగు]], [[సంస్కృతం]] నేర్చుకున్నారు. దరువులు, కీర్తనలు నోటిపాఠంగా నేచుకునినేర్చుకుని యక్షగానాల్లో ప్రహ్లాదుడు, లోహితుడు, లవుడు, కుశుడు వంటి బాలపాత్రలు అభినయించేవారు. సంగీతం వేరేగా అభ్యసుంచకపోయినా, నాట్యంతో పాటే అదీ అలవడింది. [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]] నాట్య నీష్ణాతులు 'పద్మశ్రీ' స్వీకర్త - [[చింతా కృష్ణమూర్తి]] పసుమర్తికి మేనమామ. ఆయన శిష్యరికంలో మరింత శిక్షణపొంది, ఒక్కడే స్త్రీ పాత్ర ధరించి అష్టపది, జావళి, తరంగాలతో ప్రదర్శనలు ఇచ్చేవారు కృష్ణమూర్తి. అలా నాలుగైదేళ్లు గడిచాక, [[వేదాంతం రాఘవయ్య]], [[వెంపటి పెదసత్యం]], పసుమర్తి కృష్ణమూర్తి ముగ్గురూ కలిసి నృత్యనాటికలు తయారుచేసి, జానపద నృత్యాలు కూడా కలిపి ప్రదర్శనలు ఇస్తే గొప్ప ప్రజాదరణ కలిగింది. కర్ణాటకాంధ్రలోని ముఖ్యపట్టణాలలో పెక్కు ప్రదర్శనలు ఇచ్చారు. ఒక నాలుగేళ్ల కాలంలో, వేదాంతంవారు, వెంపటివారు సినిమారంగానికి వెళ్లిపోతే, పసుమర్తివారే బృందాల్ని తయారుచేసి, జనరంజకంగా ప్రదర్శ్నలుప్రదర్శనలు ఇవ్వసాఇవ్వసాగరు.