అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''వాసిరెడ్డి నాయకులు''': తీరాంధ్ర దేశమును పాలించి ప్రఖ్యాతి గాం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==చరిత్ర==
 
వాసిరెడ్డి వారి మొదటి ప్రస్తావన పిఠాపురంలో దొరికిన క్రీ. శ. 1413 నాటి ఒక శాసనములో గలదు. వాసిరెడ్డి పోతినీడు అను రాజు ఈ ప్రాంతమును ముసునూరి నాయకుల సామంతునిగా పాలించినటుల ఉన్నది. పోతినీడు గోదావరీ తీర ప్రాంతములో పలు దేవాలయాలు కట్టించాడు. 4,60,000 తాడి చెట్లు నాటించి తన శాసనములలో తాడిచెట్ల ప్రయోజనాలను పేర్కొన్నాడు.
 
 
==మల్లికార్జున నాయుడు==
 
నూరు సంవత్సరముల తదుపరి, క్రీ. శ. 1500 నుండి 1527 వరకు పాలన చేసిన వాసిరెడ్డి మల్లికార్జున నాయుడు గురించి మనకు తెలుస్తున్నది.
==సదాశివ నాయుడు==
 
గోలకొండ సుల్తాను కులీ కుతుబ్ షా కు పన్నులు చెల్లింప నిరాకరించి సుల్తానుతో యుద్ధానికి తలపడ్డాడు. గోలకొండ సేనాధిపతి హైదర్ జంగుతో జరిగిన పోరులో మల్లికార్జునుడు, హైదరు జంగు ఇద్దరూ మరణిస్తారు. ఈ యుద్ధములో విజయనగర సామంతరాజు, శ్రీశైల ప్రాంతమును పాలిస్తున్న రావెళ్ళ మల్లా నాయుడు కూడ పాల్గొంటాడు. మల్లికార్జునుని రాణి సతీసహగమనము చేస్తుంది. రెండు సంవత్సరముల వయసున్న కొడుకు సదాశివ రాయుని కొడాలి రామభూపతి అను బంధువు గుంటూరు మండలము నూతక్కి గ్రామములో పెంచుతాడు.
 
==సదాశివ నాయుడురాయలు==
 
సదాశివ రాయల పాలనలో కృష్ణా నదీ తీరములోని చింతపల్లి రాజధాని గా ఉన్నది. గోలకొండ సుల్తానుల ఆధిపత్యమును అంగీకరించిన రాయలుకు ఇబ్రహీం కుతుబ్ షా నందిగామ పరగణా ఇస్తాడు. క్రీ. శ. 1550 నుండి 1581 వరకు ఎట్టి ఒడుదుడుకులు లేకుండా పాలించాడు. సదాశివుని తదుపరి ఆతని మునిమనుమలు గంగినీడు, గురివినీడు, చినవేంకటాద్రి, మాదినీడు క్రీ. శ. 1600 నుండి 1670 వరకు పాలించారు
 
==చినపద్మనాభ రామన్న==
 
పేరు ప్రఖ్యాతులు పొందిన వాసిరెడ్డి పాలకులలో చినపద్మనాభ రామన్నఒకడు. క్రీ. శ. 1685లో తానీషా నుండి 500 గ్రామాలు పొందుతాడు. రామన్న అబుల్ హసన్ తానీషా ను సందర్శించిన ఒక సందర్భములో సుల్తాను మదించిన అశ్వాన్ని లొంగదీయలేక తంటాలు పడుతుండగా రామన్న చూసి, గుర్రాన్ని మచ్చిక చేసుకొని స్వారీ చేసి వస్తాడు. సంతసించిన సుల్తాను రామన్నను 500 గ్రామాలకు (నందిగామ, కమ్మమెట్టు, వినుకొండ, కొండవీడు వగైరా) సర్దేశముఖ్ చేస్తాడు. చింతపల్లి కోటను గట్టిపరచి శత్రుదుర్భేద్యము చేస్తాడు. క్రీ. శ. 1710 వరకు పాలన సాగిస్తాడు. తదుపరి రామన్న వారసులు బుచ్చిరాఘవ, పెదనరసన్న, చిననరసన్న, చినరామలింగ, చంద్రమౌళి, రాజమౌళి, లక్ష్మీపతి క్రీ. శ. 1760 వరకు పాలిస్తారు.
 
క్రీ. శ. 1763లో జగ్గయ్య చింతపల్లిని పాలిస్తున్న సమయములో ఫ్రెంచి వారికి బ్రిటిషు వారికి ఆంధ్రదేశముపై ఆధిపత్యము కొరకు సంఘర్షణ మొదలవుతుంది. బ్రిటిషువారికి అనుకూలముగా ఉన్నాడనే అనుమానముతో గోలకొండ నవాబు సోదరుడు బసాలత్ జంగ్ పంపిన ఫ్రెంచి సైన్యముతో తలపడిన జగ్గయ్య యుద్ధములో మరణిస్తాడు.
జగ్గయ్య భార్య అచ్చమ్మ సతీసహగమనము చేస్తుంది.
 
==వేంకటాద్రి నాయుడు==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు