డిగ్రీ పూర్తవగానే 1994లో రాఘవేంద్ర భారతదేశంలోని అత్యున్నత స్థాయి పరీక్ష అయిన IASకి సిద్ధమయ్యారు. కాని, ఇంటర్వ్యూ స్థాయి వరకు వెళ్లగలిగినా - చివరకు 12 మార్కుల్లో IASనిసివిల్స్ లో రాంక్ ను కోల్పోయారు. అనంతరం 1997 నుంచి 2000 వరకు పాత్రికేయుడిగా [[ఈనాడు]], [[ఈటీవీ]]లలో పనిచేశారు. [[హైదరాబాద్]], [[ఢిల్లీ]], [[చెన్నై]]లలో వృత్తి పరమైన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం, వెబ్దునియా.కామ్ వారి [[తెలుగు]] వెర్షన్ వెబ్ప్రపంచం.కామ్లో సీనియర్ కరస్పాండెంట్గా చేరి, చెన్నై విభాగానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ ఉద్యోగంలో 2003 వరకూ పనిచేసి - ఆపై IASసివిల్స్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 10 వేలమందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి - కొన్ని వందల మందిని అత్యున్నత సర్వీసులలో ప్రవేశించేలా చేసిన శిక్షకుడు, విద్యావేత్త ఆకెళ్ల రాఘవేంద్ర గారు.