చిదంబరం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: zh:吉登伯勒姆
చి యంత్రము కలుపుతున్నది: it:Chidambaram; cosmetic changes
పంక్తి 25:
'''చిదంబరం''' [[తమిళనాడు]] లోని [[కడలూరు]] జిల్లాకు చెందిన [[మునిసిపాలిటీ]] మరియు తాలూకా కేంద్రం. ఇది తీరానికి 11 కి.మీ మరియు [[చెన్నై]] కి రైలు ద్వారా 240 కి.మీ దక్షిణంగా ఉంది.
 
== పట్టణం ఉనికి ==
పరమ [[శివుడు]] శివతాండవం చేస్తూ [[నటరాజు]] గా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉన్నది. [[శైవులకు]] దేవాలయం లేదా [[తమిళం]] లో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. చిదంబరం -- చిత్ - స్పృహ, అంబరం - ఆకాశం - అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థం.
 
== ఆలయ కథా విశేషం ==
చిదందరం ఇతిహాసం ప్రకారం [[శివుడు|పరమశివుడు]] ఒకనాడు తిల్లాయ్ వనవిహారానికి వెళ్ళాడు.ఈ వనంలో ఉన్న ఋషులు తమ మంత్రాలతో దేవతలను ఆవాహనం చేయగల్గినవారు. శివుడు ఆ ఋషులు పఠిస్తున్న మంత్రాలతో లొంగి పీతాంబరధారి అయి [[ఉసిరి]] కాయలు తింటున్నాడు. శివుని భార్య పార్వతి కూడా శివుని వెంబడించింది.ఋషులు, ఋషి పత్నులు ఆ పీతాంబర వాసిని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు.
తమ భార్యలూ, ఇతర స్త్రీజనం మోహితులై ఉండటం చూసిన మునులు కోపోద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేశారు. భిక్షువు రూపంలో ఉన్న భగవంతుడు ఆ పాములను ఎత్తి జడలు కట్టిన జుత్తు చుట్టూ, మెడలో మరి నడుము చుట్టూ ఆభరణాల్లా వేసుకున్నాడు. ఆవేశం పట్టలేని ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేశారు. భగవంతుడు దాని చర్మం వలిచి నడుముకి బట్టగా కట్టుకున్నాడు. పూర్తిగా విసుగెత్తిన ఋషులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి 'ముయలకన్' అనే శక్తిమంతమైన మరియు అహంభావియైన రాక్షసిని ఆవాహన చేశారు. చిరు మందహాసం చిందిస్తూ భగవంతుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి దాన్ని నిశ్చలనం చేసి దివ్యమైన ఆనంద తాండవం చేసి తన అసలు రూపాన్ని చూపాడు. ఋషులు భగవంతుడిని గుర్తెరిగి, తమ మంత్ర తంత్రాలు పని చేయవని తెలుసుకొని ఆయనకు దాసోహమన్నారు.
 
[[Imageఫైలు:NatarajaPerumal.jpg|thumb|250px|right|చిదంబరం చిత్సభలో నటరాజమూర్తి. ఎడమ ప్రక్క ఉన్న మూర్తి [[చిదంబర రహస్యం]] - సువర్ణ బిల్వ పత్రాలు మాత్రం కనుపిస్తాయి. కుడివైపున అమ్మవారు శివకామసుందరి.]]
 
జగద్రక్షకుడైన [[విష్ణు]] అవతారానికి పరుపుగా భాసించే ఆదిశేషుడు ఆనంద తాండవం గురించి విని దాన్ని చూసి ఆనందించాలని కుతూహల పడ్డాడు. భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించి, కాలగమనంలో నాట్యము చూపెదనని చెప్పి సాధువైన పతంజలి వేషములో వెళ్ళమని చెప్పి తిల్లాయ్ అడవికి పంపెను. పతంజలి వ్యాఘ్రపాదర్ / పులికాల్ముని (వ్యాఘ్ర / పులి, పాదర్ - పాదములు కలవాడు - ఈయన తేనెటీగలు రాకమునుపే పూవులు కోయటానికి చెట్లెక్కేందుకు వీలుగా పులి కాళ్ళు, చూపు కోరి సంపాదించుకున్నాడు) తో కలిసి తిల్లాయ్ అడవిలోనికి వెళ్ళి భగవంతుణ్ణి శివలింగ రూపంలో పూజించారు. ఆ దేవుణ్ణి ఈ నాటికీ 'తిరుమూలతనేశ్వర్' (తిరు - శ్రీ, మూలతనం - మూలమైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు)గా పూజిస్తున్నారు.
పంక్తి 52:
[[పరమశివుడు]] నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి. ఈ స్థలాలు అన్నింటిలోనూ వేదిక/సభై లు కనిపించడం విశేషం. చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు [[తిరువాలంగడు]] లోని [[రత్తినసబై]] (రత్తినం - రత్నం), [[కౌర్తాళ్ళం]] లోని [[చిత్రసబై]] (చిత్ర - చిత్రకళకు ప్రతీక), [[మదురై]] లోని [[మీనాక్షి]] దేవాలయంలోని [[రజతసబై]] (రజత - వెండి) మరియు [[తిరునెల్వేలి]] లోని [[నెల్లైఅప్పర్]] దేవాలయంలోని [[తామిరసబై]] (తామిరం - రాగి).
 
== దేవాలయపు భక్తులు ==
 
ఈ దేవాలయపు భక్తుల్లో మొదటివారుగా పరిగణింపబడుతున్నవారు ఆలయ నిర్వహణ చూసే తిల్లై వాళ్ అంధనార్ (తిల్లైలో ఉండే పూజారులు అని అర్థం) అని పిలవబడే పూజారులు.
నలుగురు భక్త కవులు ఈ దేవాలయాన్ని ఈ స్వామిని అజరామరం చేశారు. వాళ్ళెవరంటే [[తిరుజ్ఞాన సంబంథర్]] , [[తిరునావుక్కరసర్]] , [[సుందరమూర్తి నయనార్]] మరియు [[మాణిక్కవసాగర్]] . మొదటి ముగ్గురి రచనలు దేవరములుగా ఖ్యాతి పొందాయి. [[తిరుజ్ఞాన సంబంథర్]] చిదంబరం స్వామి పైన రెండు దేవరములు, [[తిరునావుక్కరసర్]] [[నటరాజ]] స్వామి పైన ఎనిమిది దేవరములు మరియు [[సుందరమూర్తి నయనార్]] [[నటరాజ]] స్వామి పైన ఒక్క దేవరము రచించి స్వరపరిచారు. [[మాణిక్కవసాగర్]] రెండు రచనలు చేశారు. మొదటిది చిదంబరంలో ఎక్కువగా పాడబడే [[తిరువాసకం]] (పవిత్ర వచనాలు) మరియు రెండవది పూర్తిగా చిదంబరంలోనే పాడబడే తిరుచిత్రాంబలక్కోవైయార్ (లేదా తిరుకోవైయార్). [[మాణిక్కవసాగర్]] చిదంబరంలోనే ఆధ్యాత్మిక ఆనందం, ముక్తి పొందారని చెప్పబడుతుంది.
 
== భౌగోళికం ==
 
చిదంబరం భౌగోళికంగా {{coor d|11.4|N|79.7|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/25/Chidambaram.html Falling Rain Genomics, Inc - Chidambaram]</ref> లో ఉంది. ఇది రమారమి 3&nbsp;[[మీటర్]] లు (9&nbsp;[[అడుగు (పొడవు కొలమానం)|అడుగులు]]) ఎత్తులో ఉంది.
 
== జనాభా వివరాలు ==
2001 వ సంవత్సరపు భారత దేశం [[జనాభా లెక్కల]] {{GR|India}} ప్రకారం, చిదంబరం జనాభా 58,968. అందులో మగవారు 49% మరియు ఆడవారు 51%. చిదంబరంలో సగటు అక్షరాస్యుల శాతం 80%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా ఎక్కువ. ఇందులో మగవారి శాతం 84% ఐతే ఆడవారి శాతం 76%. 10% జనాభా 6 సంవత్సరాలలోపు వయసు వారు.
 
== దేవాలయ శిల్ప కళ మరియు దేవాలయ విశేషాలు ==
 
ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిలో 4 పెద్ద గాలి గోపురాలు( తూర్పు, పశ్చిమ , ఉత్తర, దక్షిణ దిక్కులలో). ఈ నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి. తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో [[భరత నాట్యం]] చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి.
ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ ఆలయ సముదాయములోనే ఒక పెద్ద తటాకము (శివ గంగ) మరియు చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఇవి కాక ఐదు సభలు లేదా వేదికలు ఉన్నాయి. అవి - గర్భగుడిగా వెలుగొందుతున్న చిత్సబై, చిత్సబైకి ఎదురుగానే ఉన్న నిత్యపూజలు జరిగే కనకసబై, గర్భగుడికి ఎదురుగానే శివుడు 'కాళి' తో నాట్యమాడినట్లుగా చెప్పబడుతున్న నృత్యసబై లేదా నాట్యసబై - ఇది శక్తి స్వరూపం, భగవంతుడి ఆధిపత్యాన్ని చాటి చెప్పిన ప్రాంతం, రాజ్యసబై లేదా 1000 స్తంభాల మంటపం (నిజానికి ఉన్నది 999 స్తంభాలే, భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు ఆయనే 1000వ స్తంభం) మరియు పంచమూర్తులు కొలువైన దేవసబై (పంచ - ఐదు, మూర్తులు - భగవంతుడి విగ్రహాలు. ఆ ఐదు ఏవంటే గణేశుడు - విఘ్నాలు తొలగించే స్వామి, తన భార్య 'శివానందనాయకి'తో కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర్ స్వామి, మురుగా స్వామి మరియు భక్తముఖ్యుడు, ప్రధాన భక్తుడు ఐన చండికేశ్వరర్).
 
 
పంక్తి 73:
మూడు విధాలైన శక్తులు - ఇచ్ఛై లేదా కోరిక అవతారమైన భార్య వల్లి, క్రియకు ప్రతిరూపమైన భార్య దేవయాని, అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు స్వామి వాడే జ్ఞానానికి ప్రతిరూపమైన బల్లెం - వీటిని కలిగిన మురుగా లేక పాండియనాయకం ఆలయం కూడా ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్, ఆయన దేవేరి పుండరీగవల్లి తాయర్ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూడమ్ అంటారు. ఇది 108 [[వైష్ణవ దివ్యదేశాలు]] లో ఒకటి. దివ్యదేశాలంటే ప్రముఖ భక్తులైన [[ఆళ్వార్లు]] మంత్రాలు (నాలయిర దివ్యప్రబంధం) చదివి శుద్ధి (మంగళాశాసనం) చేసిన విష్ణ్వాలయాలు.
ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా చిన్న ఆలయాలు ఉన్నాయి.
 
ఆలయపు రూపకల్పనలోనూ, స్థాపత్యంలోనూ (స్థాపత్యం - ఆర్కిటెక్చర్) వేదాంతార్థాలు కోకొల్లలు. ఉన్న తొమ్మిది ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి. గర్భగుడిని ఒక ప్రక్కనున్న కనకసబై అనే వేదిక పైనుంచి పంచాచ్ఛరపది అనే ఐదు మెట్లు ఎక్కి చేరుకోవాలి.
పంచాచ్ఛరపది అంటే : పంచ - ఐదు, అ-చ్ఛర - నాశము లేని శబ్దాలు <b>''' శి వా య న మ </b>'''. పొన్నాంబళం హృదయానికి ప్రతీక కనుక వేదిక పక్క నుంచి వెళ్ళడం (మిగతా దేవాలయాల్లో మాదిరి ముందు నుంచి కాకుండా). పొన్నాంబళం లేదా గర్భగుడిని 28 స్థంభాలు మోస్తున్నాయి. ఇవి 28 ఆగమాలను (ఆగమాలు శివుడిని అర్చించే వైదిక విధానాలు) సూచిస్తాయి. ఇక ఆలయం పైకప్పుని 64 కళలకు ప్రతీకలైన 64 దూలాలు, అంతు లేని రక్తనాళాలకు ప్రతీకలైన ఎన్నో అడ్డ దూలాలు మోస్తున్నాయి. పైకప్పుని 21600 శివయనమ అని రాసిన బంగారు పలకలతో కప్పారు. ఇవి 21600 శ్వాసలను సూచిస్తాయి. కప్పుపై 9 రకాలైన శక్తిని సూచించే 9 పవిత్ర కుంభాలు లేదా కలశాలతో తీర్చిదిద్దారు (చూ. ఉమాపతి శివమ్ రచించిన కుంచితాంగ్రిస్తవం)
 
== చిదంబర రహస్యం ==
చిదంబరంలో శివుడు నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. స్వామి తన దేవేరి శక్తి లేదా శివగామితో అనంతంగా తన దివ్యమైన 'ఆనంద తాండవం' చేస్తుంటారని ప్రతీతి. దీన్ని గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది.
 
దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ - శివ - భగవంతుడు, అహం - నేను/మేము, భవ - మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ.
 
అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు
 
== ఆలయ నిర్వహణ మరియు దైనందిన పూజలు ==
ఆలయ నిర్వహణ బాధ్యతలను ఆనువంశికంగా వైదిక బ్రాహ్మణుల్లో ఒక శాఖ ఐన చిదంబరం దీక్షితార్లు చూసుకుంటున్నారు. పురాణాల ప్రకారం వీరిని కైలాస పర్వతాల నుంచి పతంజలి ఋషి ప్రధానంగా దైనందిన పూజాదికాలు జరపడానికీ, చిదంబరం ఆలయ నిర్వహణకూ తీసుకు వచ్చారు.
దీక్షితార్లను [[శివుడు| శివుడి]]ని [[నటరాజు]] గా కొలవటానికి నియోగించిన పతంజలి ఆలయ పూజా విధానాలను వేదాల నుంచి సేకరించి ఏర్పరిచారు.
 
అలా తిల్లై మూవాయిరమర్ అని పిలవబడే 3000 మంది దీక్షితార్లు (2999 మరియు భగవంతుడు) వచ్చారని ప్రతీతి. ఇప్పుడు మొత్తంగా దాదాపు 360 మంది ఉన్నారు. వీళ్ళు శివపూజకు ఆగమ పద్ధతులు పాటించే శివాచారియర్లు లేదా ఆదిశైవర్ల వలె కాక వైదిక పద్ధతులు పాటిస్తారు.
 
సాధారణంగా వంతుల వారీ ప్రధాన పూజారి పదవి, ఆలయ ఆదాయంలో వంతు ప్రతీ వివాహితుడైన దీక్షితారుకూ లభిస్తుంది. ఆలయాన్ని ఎంతో మంది పాలకులు సేవించుకున్నందువల్ల సుక్షేత్రమైన 5000 ఎకరాల మాన్యం ఉన్నట్టు తెలుస్తున్నా వర్తమానంలో ఇది పూర్తిగా ప్రైవేటు విరాళాలతోనే నడుస్తోంది.
 
అవాళ్టి ప్రధాన పూజారి తనను తాను శుద్ధి చేసుకునే మంత్రాదికాలు పూర్తి చేసి శివోహంభవ రూపు దాల్చడంతో దినచర్య ప్రారంభమౌతుంది. పిమ్మట పూజారి ఆలయ ప్రవేశం చేస్తారు. స్వామివారి పాదుకలను ఉదయం 7 గంటల వేళ పాలియారై లేదా పవళింపు గది నుంచి గర్భగుడికి భక్తుల మేళ తాళాలు, డమరుక ధ్వనుల మధ్య పల్లకీలో తీసుకురావడంతో పూజాదికాలు ఆరంభమౌతాయి. పూజారి అప్పుడు భగవంతుణ్ణి అడ్డంకులను తొలగించమని వేడుకుంటూ నైవేద్యం పెట్టి ఒక ఆవు, దూడ జంటను పూజిస్తారు.
 
పూజ రోజుకు 6 సార్లు జరుగుతుంది. పూజ చెయ్యడానికి ముందు ప్రతిసారీ స్వామి అసంపూర్ణ రూపమైన స్ఫటిక లింగానికి నెయ్యి, పాలు, పెరుగు, అన్నం, చందనం, విబూది తో లేపనం చేస్తారు. పిమ్మట స్వామికి అప్పుడే తయారు చేసిన తిండి పదార్థాలు, తీపి నైవేద్యం పెట్టి సంస్కృతంలో వేదాలు, పంచపురాణం (పన్నీరు తిరుమురై అని పిలువబడే 12 తమిళ రచనల నుండి ఎన్నిక చేసుకున్న 5 కవితలు) చదువుతూ అందంగా, వివిధ రకాలుగా అలంకరించిన దీపాలతో దీపారాధన చేస్తారు. పూజారి గర్భగుడి తెరను తొలగించి చిదంబర రహస్యాన్ని చూపడంతో పూజ ముగుస్తుంది.
 
రెండవ సారి పూజకు ముందు మామూలుగా స్ఫటిక లింగానికి చేసే సేవలతో పాటు ఒక రత్న [[నటరాజు]] విగ్రహం (రత్న సభాపతి) కూడా సేవలందుకుంటుంది. మూడవ పూజ మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో జరుగుతుంది. తర్వాత ఆలయం మూసివేసి మళ్ళీ సాయంత్రం 4:30 గంటలకు తెరుస్తారు. నాల్గవ పూజ సాయంత్రం 6:00 గంటలకు, ఐదవది రాత్రి 8:00 గంటలకు, చివరి పూజ రాత్రి పది గంటలకు జరుగుతాయి. దీని తర్వాత స్వామివారి పాదుకలను ఆయన విశ్రమించడానికి వీలుగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఐదవ పూజకు ముందు పూజారి చిదంబర రహస్యానికి ప్రత్యేక పూజలు చేసి యంత్రానికి సుగంధ ద్రవ్యాలతో లేపనం చేస్తారు.
 
అర్ధజాము పూజ అని పిలువబడే చివరి పూజను చిదంబరంలో ప్రత్యేకమైన ఉత్సాహంతో చేస్తారు. స్వామివారు రాత్రి విశ్రమించేటప్పుడు విశ్వంలోని దైవిక శక్తి అంతా ఆయనలో విశ్రమిస్తుందని భక్త జనుల నమ్మకం.
== ప్రభుత్వ అధీనంలోకి ==
చిదంబరం ఆలయాన్ని ప్రైవేటు ఆలయంగా ప్రకటించాలన్న స్థానిక దీక్షితుల అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆ ఆలయ నిర్వహణా బాధ్యతలు జిల్లా యంత్రాంగం అధీనంలోకి వచ్చాయి. సుమారు 1500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన చిదంబరం ఆలయంలో న్యాయస్థానం నిర్ణయం కారణంగా ఓ శకం ముగిసినట్త్లెంది. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా స్థానిక దీక్షితుల అధీనంలో ఉంది. వీరి పూర్వీకులు స్వయంగా కైలాసం నుంచి వచ్చి ఈ ఆలయ వ్యవహారాలను చక్కదిద్దేవారని ఈ సాంప్రదాయ బ్రాహ్మణ వంశం గట్టిగా నమ్మేది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం గతవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఆలయం ప్రభుత్వం పరమైంది.(ఈనాడు 9.2.2009)
 
== పండుగలు ==
మానవుల ఒక్క సంవత్సరం దేవుళ్ళకు ఒక్క రోజని ప్రతీతి. రోజుకు ఆరు సార్లు పూజలు చేసినట్లే ప్రధాన దైవమైన [[నటరాజు| నటరాజ]] స్వామికి సంవత్సరంలో ఆరు ప్రత్యేక పూజలు చేస్తారు.
అవి - మొదటి పూజను సూచించే మార్ఘాళి తిరువాధిరై (డిసెంబరు - జనవరి), రెండవ పూజకు సూచనగా మాసి (ఫిబ్రవరి-మార్చి) నెలలో పౌర్ణిమ తర్వాత వచ్చే 14 వ రోజు (చతుర్దశి), మూడవ పూజ లేదా ఉచ్చి కాలం సూచించే చిత్తిరై తిరువోణం (ఏప్రిల్ - మే), సాయంత్రాన్ని లేదా నాల్గవ పూజను సూచించే ఆణి ఉత్తరం (జూన్ - జూలై) లేదా ఆణి తిరుమంజనం, ఐదవ పూజను సూచించే ఆవణి (ఆగష్టు - సెప్టెంబర్) చతుర్దశి మరియు ఆరవ పూజ లేదా అర్ధజాము పూజను సూచించే పురతసి (అక్టోబర్ - నవంబర్) చతుర్దశి.
 
వీటిలో మార్ఘాళి తిరువాధిరై (డిసెంబరు - జనవరి), ఆణి తిరుమంజనం (జూన్ - జూలై) అత్యంత ప్రధానమైనవి. ఈ పండుగల సందర్భంగా ప్రధాన దైవాన్ని గర్భగుడి బయటకు ఊరేగింపుగా తెచ్చి, రథోత్సవం జరిపి పెద్ద ప్రత్యేక పూజ చేస్తారు. కొన్ని లక్షల మంది జనం ఈ ప్రత్యేక పూజనూ, గర్భగుడిలోనికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు జరిగే స్వామివారి ఆచారపూర్వకమైన నృత్యాన్నీ చూడటానికి బారులు తీరుతారు.
 
ఉమాపతి శివం యొక్క 'కుంచితాంగ్రిస్తవం' లో మాసి పండుగనాడు కూడా స్వామి ఊరేగింపు ఉన్నట్టు ఉటంకించినా వర్తమానంలో అది జరగటం లేదు.
 
== చారిత్రిక ఉటంకాలు ==
చిదంబరం ఆలయపు అసలు మూలాలు తెలియవు. పురాణాల (ముందు మౌఖికంగా, తర్వాతి కాలంలో వ్రాతపూర్వకంగా అందించబడిన చరిత్ర) ప్రకారం పులికాల్మునివర్ స్వామి సిమ్మవర్మన్ ద్వారా పవిత్రమైన ఆలయ పనుల్లో సింహ భాగాన్ని జరిపించినట్లు తెలుస్తోంది.పల్లవ రాజుల్లో సిమ్మవర్మన్ పేరుగల రాజూలు ముగ్గురున్నారు. భక్త కవి ఐన [[తిరునావుక్కరసర్]] (ఈయన జీవన కాలం కాస్త అటు ఇటుగా సరిగ్గానే లెక్కించబడింది) సమయానికే ఆలయం ప్రశస్తి పొందినందువల్ల సిమ్మవర్మన్ దాదాపు క్రీ.శ. 430-458 మధ్య కాలంలో జీవించి ఉండాలి.
కొట్రావన్ కుడి లోని 'పట్టాయం' లేదా రాగిరేకులతో చేసిన శాసనం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. కానీ తండన్ తొట్ట పట్టాయం ఇంకా ఇతర [[పల్లవ]] కాలపు పట్టాయాలలో ఈయన ప్రసక్తి లేదు. అందువల్ల ఆయన తన హక్కులను త్యజించి చిదంబరానికి వచ్చి జీవించి ఉండవచ్చని నమ్మకం. పులికాల్మునివర్, సిమ్మవర్మన్ సమకాలికులని తెలుస్తుండడం వల్ల ఆలయం ఆ సమయంలో ఉనికిని పొందిందని భావిస్తారు. కానీ భక్త కవి [[మాణిక్కవసాగర్]] భక్త కవి [[తిరునావుక్కరసర్]] కన్నా ఎంతో ముందే చిదంబరంలో జీవించి ముక్తిని పొందినట్లు తెలుస్తుండడం వల్ల, అంతే కాక [[నటరాజ]] స్వామి విగ్రహం, దాని భంగిమ, దాని స్వరూపం అదే కాలపు ఇతర [[పల్లవ]] శిల్పరీతులతో సరిపోలనందువల్ల ఈ ఆలయం సిమ్మవర్మన్ కన్నా చాలాకాలం ముందు నుంచే ఉనికిలో ఉండేదని విశ్వసిస్తున్నారు.
 
బంగారు పలకలతో తాపడం చేయబడిన చిత్సబై పైకప్పు చోళ రాజు పరంథక I చేయించినట్లు చెప్పబడుతోంది. పరంథక II, రాజరాజ చోళ I, కులోత్తుంగ చోళ I కూడా ఆలయానికి విలువైన దానాలు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. రాజరాజ చోళుని కుమార్తె కుందవై సైతం బంగారు ఇతర ఆస్తులు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. ఆ తరువాతి కాలపు చోళ రాజు విక్రమ చోళ (క్రీ.శ 1117-1136) కూడా నిత్య పూజలకుగాను నివేదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
ఆలయానికి పుదుకొట్టై మహారాజా, శ్రీ సేతుపతి (పచ్చరాయి ఆభరణం నేటికీ స్వామిని అలంకరిస్తోంది), పరి రాజు, టిప్పు సుల్తాను వంటి అనేకమంది రాజులు, పాలకులు, దాతలు బంగారునూ, ఆభరణాలను ఇచ్చారు.
దీక్షితార్లు ఆలయంపై టిప్పు సుల్తాను దాడి చేసి దోచుకుంటాడని భయపడినట్లు కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి (ఇవి దీక్షితార్లలో ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖికంగా వచ్చినవి). ఎందరో దీక్షితార్లు తమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన దేవాలయం టిప్పు చేతుల్లో నాశనమవడం చూడటం కన్నా మృత్యువే మేలని ఎత్తైన పగోడాల పై నుంచి దూకి ప్రాణత్యాగం చేశారంటారు. ఇంకొందరు దీక్షితార్లు ఆలయానికి తాళం వేసి విగ్రహాలను ఎంతో భద్రంగా [[కేరళ]] లోని అళపుజకు తీసుకు వెళ్ళారంటారు. ఆక్రమణ భయం తగ్గిన తర్వాతనే వారు తిరిగి వచ్చారట. కానీ టిప్పు సుల్తాను ఆలయానికి ఆభరణాలు ఇవ్వటం చూస్తే ఈ మొత్తం కథ ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. లేదా దీక్షితార్ల భయాలు అర్థం లేనివనిపిస్తుంది. దేవాలయాలకు టిప్పు సుల్తాన్ ఆదరణ ఒక్క చిదంబరం ఆలయానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన [[కర్ణాటక]]లోని [[శ్రీరంగపట్నం]] దేవాలయాన్ని కూడా ఆదరించినట్లు తెలుస్తోంది.
 
== విద్యా సంస్థలు ==
* [[అన్నామలై విశ్వవిద్యాలయం]] పుట్టినిల్లు ''' చిదంబరం'''.
 
== మూలాలు ==
* వేదాంతార్థాలు, స్థాపత్య వివరాలు చిదంబరం మరియు [[నటరాజ]] స్వామి గురించిన పేరెన్నికగన్న రచనల సమాహారమైన 'నటరాజస్తవమంజరి'లో వివరించిన శ్రీ ఉమాపతి శివం యొక్క 'కుంచితాంగ్రిస్తవం' నుండి తీసుకోబడ్డాయి.
* చరిత్ర మరియు చిదంబరంలో లయ నృత్యకారుడైన పరమశివుడి వివరాలు అధీన మహావిద్వాన్ శ్రీ ఎస్ ధండపాణి దేశికర్ రచించిన 'Adalvallan - Encyclopaedia of Adalvallan in Puranas, - Yantras, Poojas- Silpa and Natya Sastras' నుండి తీసుకోబడ్డాయి. ఈ పుస్తకాన్ని 'ది త్రివవదుత్తురై అధీనం, సరస్వతీ మహల్ లైబ్రరీ అండ్ రీసర్చ్ సెంటర్, తిరువవదుత్తురై, తమిళనాడు, ఇండియా 609803' వారు ముద్రించారు.
* ఒక అందరికీ అందుబాటులో ఉన్న మూలం [http://85.1911encyclopedia.org/C/CH/CHIDAMBARAM.htm] నుండి సంగ్రహించి, తగిన మార్పులు చేయడమైనది
* http://www.tamilnadutourism.org/chidam.htm
* http://www.templenet.com/Tamilnadu/s122.html లో చూచినది
పంక్తి 137:
<references/>
 
== బయటి లింకులు ==
* [http://www.indiasite.com/tamilnadu/chidambaram/ Chidambaram the Devine Land]
* [http://www.tourism-of-india.com/chidambaram.html Chidambaram]
పంక్తి 152:
[[de:Chidambaram]]
[[fr:Chidambaram]]
[[it:Chidambaram]]
[[new:चिदाम्बरम]]
[[pl:Ćidambaram]]
"https://te.wikipedia.org/wiki/చిదంబరం" నుండి వెలికితీశారు