శివాజీ గణేశన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ശിവാജി ഗണേശൻ
చి లింకు మార్పు
పంక్తి 27:
శివాజీ నేషనల్ పిక్చర్స్ వారి '[[పరాశక్తి]]' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. చిత్రనిర్మాణం సమయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని చివరికి ద్రావిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకులు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కీ.శే.[[అణ్ణాదురై]] అండతో సినిమా పూర్తిచేసి మహానటుడిగా ఎదిగాడు. శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పోటీపడేవారు. తనకంటూ ఒక ప్రత్యేకత కోసం తపించేవారు. అవార్డుల కంటే ప్రజల గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడూ చెప్తుండేవారు.
 
చలనచిత్రరంగంలో మూడువందలకు పైగా చిత్రాలలో నటించిన శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు శివాజీ నటించిన చిత్రాలు ఆంధ్రాలో కూడా విడుదలయ్యేవి. తెలుగులో [[పరదేశి (1953 సినిమా)|పరదేశి]], [[పెంపుడు కొడుకు]], [[మనోహర]], [[పరాశక్తి]], [[బొమ్మలపెళ్ళి]], [[పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం]], [[సంపూర్ణ రామాయణం]], [[రామదాసు]], [[భక్త తుకారాం]], [[జీవన తీరాలు]], [[చాణక్య చంద్రగుప్త]], [[నివురుగప్పిన నిప్పు]], [[విశ్వనాథ నాయకుడు]] చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. తెలుగులో శివాజీ నటనకు కళావాచస్పతి జగ్గయ్య కంఠం సంపూర్ణత్వాన్ని కలిగించేది.
 
తమిళంలో బి.ఆర్.పంతులు తీసిన 'కర్ణన్' చిత్రంలో శివాజీ కర్ణుడి పాత్రలో, [[ఎన్టీఆర్]] శ్రీకృష్ణుడిగా నటించారు. ఆచిత్రంలో శివాజీ నటనను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణా సినీ స్టుడియోస్ బ్యానర్ పై నిర్మించిన [[చాణక్య చంద్రగుప్త]] చిత్రంలో శివాజీని అలెగ్జాండర్ గా నటింపజేశారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు [[ప్రేమ్ నగర్]] చిత్రాన్ని తమిళంలో శివాజీని హీరోగా పెట్టి 'వసంత మాళిగై' పేరుతో రీమేక్ చేసి తమిళ చిత్రరంగంలో సంచలనం సృష్టించారు. దాసరి నారాయణరావు కూడా శివాజీ నటన అంటే చెప్పలేని అభిమానం మూలంగా [[విశ్వనాథ నాయకుడు]] చారిత్రాత్మక చిత్రంలో అతనిని నటింపజేశారు.
"https://te.wikipedia.org/wiki/శివాజీ_గణేశన్" నుండి వెలికితీశారు