తాతినేని ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==తొలి జీవితం==
తాతినేని ప్రకాశరావు పుట్టింది [[1924]]లో [[నవంబరు‌నవంబరు 24]]. [[కృష్ణాజిల్లా]]లోని [[కపిలేశ్వరపురం]]లో తండ్రి వీరరాఘవయ్య కాంగ్రెస్‌వాది. అయినా విప్లవ భావాలుండేవి. ప్రకాశరావుని దత్తత తీసుకున్న చిన్న తాత సుబ్బయ్య ఈ కారణంగానే ప్రకాశరావుని తండ్రి వద్దకు పంపేసారట. తండ్రి నుంచి రాజకీయం, విప్లవ భావాలు వారసత్వంగా సంక్రమించాయి. అదనంగా సినిమా ఆసక్తి ఏర్పడింది. టూరింగ్‌ టాకీస్‌లో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం కలిగించుకున్నారు చిన్న తనంలోనే. విద్యార్థిగా వుంటూనే రాజకీయాలు వేపు ఆసక్తి చూపడంతో గొడవలు రావడం కూడా ఎక్కువయింది. తను ఉచితంగా సినిమా చూసే టూరింగ్‌ టాకీస్‌లో అసిస్టెంట్‌ ఆపరేటర్‌ వుద్యోగం సంపాదించుకున్నారు. అదీ వదిలేయాల్సి వచ్చింది కొంతకాలానికి. ప్రజానాట్యమండలి వేపు, కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలు వేపు ఆకర్షితులయ్యారు తాతినేని ప్రకాశరావు. ప్రజానాట్యమండలి ప్రదర్శించే కళా కార్యక్రమాలను నిర్వహించే పనిలో పడ్డారు.
 
==చలనచిత్రరంగ జీవితం==
ఏదో మీటింగుకని ప్రకాశరావు [[1946]]లో [[మద్రాసు]] వెళ్ళారు. దర్శకుడు [[ఎల్.వి.ప్రసాద్]]‌తో పరిచయం ఏర్పడగా అది పెంపొందించుకున్నారు. మళ్ళీ కృష్ణాజిల్లాకి తిరిగి వచ్చేసినా, ఏడాది పూర్తి కాకుండానే తను నిర్వహించే రాజకీయ సాంస్కృతిక వ్యవహారాలకు స్వస్తి చెప్పేసి మద్రాసు చేరుకుని ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో [[కె.ఎస్.ప్రకాశరావు]] హీరోగా రూపొందిన [[ద్రోహి (1948 సినిమా)|ద్రోహి]] చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌ అయ్యారు. ఎల్‌.వి.ప్రసాద్‌ వద్దనే [[మనదేశం]], [[సంసారం (1950 సినిమా)|సంసారం]], [[షావుకారు]], [[పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)|పెళ్ళి చేసి చూడు]] చిత్రాలకు. [[కె.వి.రెడ్డి]] వద్ద [[పాతాళభైరవి]] చిత్రానికి సహాయ దర్శకుడుగా పనిచేసారు.
 
[[పీపుల్స్‌ ఆర్ట్స్‌]] సంస్థ నిర్మించిన [[పల్లెటూరు (సినిమా)|పల్లెటూరు]] చిత్రంలో దర్శకుడయ్యారు ప్రకాశరావు. [[సంక్రాంతి]] పండుగ సందర్భంగా సంబరాలు, గ్రామాల్లో ఉండే చెడుగుడు ఆట వంటివి అత్యంత సహజంగా చిత్రీకరించడమే కాకుండా సంక్రాంతి పండుగ గురించి ఒక పాట, దేశభక్తిని ప్రబోధించే పాట ఒకటి, తెలుగు తేజం వివరించే ''చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా..'' పాటని చిత్రీకరించారు. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, సావిత్రి, నాగభూషణం ఈ చిత్రాలకి ముఖ్య పాత్రధారులు. పల్లెటూరు అందాలు, ఆనందాలు వర్ణించిన ఈ చిత్రం [[1952]]లో విడుదలై విజయం సాధించింది. 1953లో ఎన్టీఆర్‌ నటించిన [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చి పుల్లయ్య]]ని డైరక్ట్‌ చేసారు.తరువాత 'అన్నాచెల్లెలు' నాటకం ఆధారంగా అక్కినేని, ఎన్టీఆర్‌, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించగా [[పరివర్తన (1954 సినిమా)|పరివర్తన]] చిత్రం రూపొందించారు. ఈ చిత్రం తమిళంలో డబ్‌ అయి ఘన విజయం సాధించింది. 1954లో విడుదలైన ఈ చిత్రంలో నీతి నియమాలు, మానవతా విలువులు ఆదర్శాలు చక్కగా చిత్రీకరించారు. అక్కినేనితో '[[నిరుపేదలు']] చిత్రాన్ని తీసి 1954లోనే విడుదల చేసారు. 1959లో విడుదలైన [[ఇల్లరికం (సినిమా)|ఇల్లరికం]] సాధించిన విజయం అందరికీ తెలిసిందే. 1958లో 'అమర్‌దీప్‌' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా బాలీవుడ్‌లోనూ ప్రవేశించారు. జయం మనదే, మా బాబు, మైనర్‌బాబు, సంసారం, చిరంజీవి రాంబాబు, గాలిపటాలు, గంగాభవాని, పొగరుబోతు, ఆశాజ్యోతి, భారతంలో అర్జునుడు తదితర చిత్రాలకు తెలుగులో దర్శకత్వం వహించారు.
 
==తెలుగుయేతర భాషా చిత్రాలు==
తమిళ చిత్ర సీమలో ప్రవేశించి 'మాతుర్కుల మాణిక్కం' చిత్రం రూపొందించి 1956లో విడుదల చేసారు. తెలుగులో అక్కినేని, ఎన్టీఆర్‌ హీరోలుగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచన ఆధారంగా ప్రకాశరావు డైరక్ట్‌ చేసిన [[చరణదాసి]] చిత్రానికి రీమేక్‌ ఇది. చరణదాసి కూడా తెలుగులో ఘనవిజయం సాధించింది. 1959లో విడుదలైన [[ఇల్లరికం (సినిమా)|ఇల్లరికం]] సాధించిన విజయం అందరికీ తెలిసిందే. 1958లో 'అమర్‌దీప్‌' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా బాలీవుడ్‌లోనూ ప్రవేశించారు. జయం మనదే, మా బాబు, మైనర్‌బాబు, సంసారం, చిరంజీవి రాంబాబు, గాలిపటాలు, గంగాభవాని, పొగరుబోతు, ఆశాజ్యోతి, భారతంలో అర్జునుడు తదితర చిత్రాలకు తెలుగులో దర్శకత్వం వహించారు.
 
తమిళంలో 24 చిత్రాలు డైరక్ట్‌ చేసారు. [[శివాజీ గణేశన్]]‌తో 'అమరదీపం', ఉత్తమ పుత్రన్‌ చిత్రాలు, కతిరుండ్‌ కనకాల్‌, నల్ల తీర్పు, కన్నిరైంధ కన్నవాన్‌, పదకోటై, ఎంగలమం ముదియం, ఎల్లారం ఇన్నట్టు మన్బార్‌, అన్చుమగన్‌ ముఖ్యమైనవి. నన్హా ఫరిస్తా, కాలేజ్‌ గర్ల్‌, బహు భేటీ, సీతంఘర్‌, సూరజ్‌ , దునియా, ఇజ్జత్‌, హమారా సంసార్‌, హమ్‌రాహి, ససురాల్‌, కబ్‌ తక్‌ చుప్‌ రహూఁగీ, ఘర్‌ ఘర్‌ కీ కహానీ, బహు రాణీ, రివాజ్‌ మున్నగు చిత్రాలను హిందీలో దర్శకత్వం వహించారు ప్రకాశరావు.