జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:ஜெய பிரகாஷ் நாராயண் మార్పులు చేస్తున్నది: ml:ജയപ്രകാശ് നാരായൺ
చి యంత్రము కలుపుతున్నది: ur:جے پرکاش نرائن; cosmetic changes
పంక్తి 1:
{{Infobox revolution biography
|name=భారత రత్న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్
|lived=[[అక్టోబర్ 11]], [[1902]]–[[అక్టోబర్ 8]], [[1979]]
|placeofbirth=[[శరన్|సితాబ్దియారా, బల్లియా]], [[ఉత్తర్ ప్రదేశ్]], [[భారతదేశం]]
|placeofdeath=
పంక్తి 9:
|organizations= భారత జాతీయ కాంగ్రేసు, జనతా పార్టీ
}}
జె.పి.గా సుప్రసిద్దులైన '''జయప్రకాశ్ నారాయణ్'''(జననం:[[అక్టోబర్ 11]], [[1902]] — మరణం:[[అక్టోబర్ 8]], [[1979]]) భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు. [[1970]] వ దశకంలో అప్పటి భారత ప్రధాని [[ఇందిరా గాంధీ]] కి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు ''[[లోక్ నాయక్]]'' అని సగౌరవంగా పిలుచుకుంటారు.
 
== ప్రారంభ జీవితం ==
జయప్రకాశ్ నారాయణ్ [[ఉత్తర ప్రదేశ్]] లోని [[బలియా]] జిల్లాకు, [[బీహార్]]లోని [[సారన్]] జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. హైస్కూలు విద్యను, కళాశాల విద్యను [[పాట్నా]] లో అభ్యసించాడు. అటుపిమ్మట [[అమెరికా]]లో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి [[1929]]లో [[భారతదేశం]] తిరిగి వచ్చాడు. అమెరికా లో ఉన్న సమయంలో [[మార్క్స్]] సిద్దాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే [[యం.యన్.రాయ్]] రచనల ప్రభావానికి లోనయ్యాడు.
 
[[1920]]లో జయప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సమరయోధురాలు, [[కస్తూరిబా గాంధీ]] అనుచరురాలు అయిన ప్రభావతీ దేవిని వివాహమాడారు.
 
== స్వాతంత్ర్య సమరయోధుడిగా ==
అమెరికానుండి వచ్చిన వెంటనే [[జవహర్‌లాల్ నెహ్రూ]] ఆహ్వానం మేరకు [[ఇండియన్ నేషనల్ కాంగ్రెస్]] లో చేరి త్వరలోనే [[మహాత్మా గాంధీ]] కి ప్రియ శిష్యుడుగా మారాడు.
 
[[1932]]లో [[శాసనోల్లంఘనోద్యమం]] లో పాల్గొని జైలు శిక్ష ననుభవించాడు. విడుదలైన తరువాత కాంగ్రెస్ లో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన [[కాంగ్రెస్ సోషలిష్టు పార్టీ]] కి జెనరల్ సెక్రటరీ గా నియమించబడ్డాడు.
 
[[1942]]లో [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమ]] కాలంలో సీనియర్ కాంగ్రెస్ నేతలంతా అరెష్టు చేయబడిన సమయంలో జయప్రకాశ్ నారాయణ్ [[రాం మనోహర్ లోహియా]], బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఉద్యమాన్ని ముందుండి నడిపాడు.
 
స్వాతంత్ర్యానంతరం జె.పి. [[ఆచార్య నరేంద్ర దేవ్]], బాసవన్ సింగ్ మొదలైన వారితో కలసి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి తమ [[సోషలిస్టు పార్టీ]] ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ [[ప్రజా సోషలిస్టు పార్టీ]] గా మారి [[బీహార్]],[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినది.
 
== సర్వోదయ ==
[[1954]]లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన [[ఆచార్య వినోబా భావే]] యొక్క [[సర్వోదయ]] ఉద్యమానికి మరియు దానిలో అంతర్భాగమైన [[భూదాన్ ఉద్యమం|భూదాన్ ఉద్యమా]] నికి అంకితం చేశాడు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిభాగ్‌లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. జె.పి. త్వరలోనే [[భారతదేశం]] లో [[మహాత్మా గాంధీ]] భావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయా ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందాడు.
 
== సంపూర్ణ క్రాంతి ==
[[1960]] వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి [[బీహార్]] రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనారంభించాడు. [[1974]] లో బీహార్లో జె.పి. నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం త్వరలో ''[[బీహార్ ఉద్యమం]]'' గా ప్రసిద్ది పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారినది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన [[సంపూర్ణ విప్లవం|సంపూర్ణ విప్లవా]] నికి జె.పి. పిలుపునిచ్చాడు.
 
== ఎమర్జెన్సీ ==
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని [[ఇందిరా గాంధీ]] ని దోషిగా పేర్కొంటూ [[అలహాబాద్]] హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి,మిలిటరీకి మరియు పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు.ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలో [[అత్యవసర పరిస్థితి]] ([[ఎమర్జెనీ]])ని విధించారు. జె.పి.ని మరియు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెష్టు చేసినది. ఆఖరికి [[కాంగ్రెస్ పార్టీ]] లోనే ''[[యంగ్ టర్క్‌]]'' లు గా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు.
జె.పి. [[ఛండీఘడ్]] లో డిటెన్యూ గా ఉంచబడ్డాడు. [[బీహార్]] వరదల సమయంలో అచటి పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించినది. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డాడు.
చివరికి ఇందిరా గాంధీ [[జనవరి 18]], [[1977]]న ఎమర్జెన్సీ ని తొలగించి ఎన్నికలను ప్రకటించడంతో ఆమెను ఎదుర్కోవటానికి [[కాంగ్రెస్]] కు వ్యతిరేకంగా జె.పి.మార్గదర్శకత్వంలో [[జనతా పార్టీ]] రూపుదిద్దుకున్నది. చివరికి జనతా పార్టీ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించి, ఇందిర ను గద్దె దింపి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రేసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించినది.
 
== భారత రత్న ==
భారత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అక్టోబర్ 8,[[1979]] లో మరణించాడు. మరణానంతరం [[1998]] లో భారత ప్రభుత్వం ఇతనికి దేశంలో అత్యున్నత పురస్కారమైన ''[[భారత రత్న]] '' ను ప్రకటించినది. ఇదిగాక జె.పి. చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా [[1965]] లో [[మెగసెసే అవార్డు]] ప్రకటించబడినది.
 
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
 
<!-- వర్గాలు -->
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:1902 జననాలు]]
[[వర్గం:1979 మరణాలు]]
 
<!-- ఇతర భాషలు -->
 
[[en:Jayaprakash Narayan]]
పంక్తి 54:
[[de:Jayaprakash Narayan]]
[[mr:जयप्रकाश नारायण]]
[[ur:جے پرکاش نرائن]]
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు