ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
శ్రీకాకుళం, బెజవాడ, చల్లపల్లి, మచిలీపట్నం హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశాడు. యల్.యం.ఇ చదువుతున్నపుడే హైదరాబాదు విమోచనోద్యములో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుడి వెలుపలికి వచ్చి సోషలిస్ట్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1948నాటికి రాజకీయ రంగము మీద వ్యామోహము విడనాడి నాటక రంగము ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగమునకు అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డు లో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. యునెస్కో ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థ గా కమలాదేవి చటోపాధ్యాయ భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించాడు. ఆమె ప్రోద్బలముతో కృష్ణ 1952లో "ఇండియన్ నేషనల్ థియేటర్" నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక కార్యదర్శి గా ఎన్నుకోబడ్డాడు.
1954 అక్టొబర్ 1న ఆంధ్రప్రదేశ్ నాట్యసంఘాన్ని స్థాపించి దాని శాఖలను ప్రతిజిల్లాకు వ్యాపింపచేశాడు. ఈ నాట్య సంఘములో ఇండియన్ నేషనల్ థియేటర్, కళామండలి, సాధనసంఘం, నాట్యకళానికేతన్, నవకళాకేంద్రం సమాజాలు అంతర్భాగమయ్యాయి. 1959లో
ఈయన [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] రచించిన మాలపల్లిని, వందమంది కళాకారులు, సహజమైన సెట్టింగులతో నాటకంగా రూపుదిద్ది, భారతదేశమంతటా వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి కృష్ణ ఆద్యునిగా భావిస్తారు.<ref>[http://www.thehindu.com/thehindu/fr/2008/11/21/stories/2008112150080200.htm Stage act] - The Hindu 21/11/2008</ref>
|