గాలి పెంచల నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:gali_penchala_narasimha_rao.jpg|thumb|సంగీతోపాధ్యాయ గాలి పెంచల నరసింహారావు]]
'''గాలి పెంచల నరసింహారావు''' తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. ఈయన చివరి చిత్రం [[నేషనల్ ఆర్ట్ థియేటర్|ఎన్.ఏ.టి.]]వారి [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కల్యాణం (1961)]], ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన ''సీతారాముల కళ్యాణం చూతము రారండి'' పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు మరియు పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. 1943లో వచ్చిన [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు, ఆమె ఎవరో కాదు మధుర గాయని [[జిక్కి]]. ఈ చిత్రంలో ఆమె ''ఈ తీరున నిన్నెరిగి పలుకగా నాతరమా'' అనే పాట స్వయంగా నటిస్తూ పాడారు. 1945లో వచ్చిన [[మాయలోకం]] చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు [[పెండ్యాల నాగేశ్వరరావు]]ను తన బృందంలో హార్మోనిస్టుగా చలనచిత్రరంగానికి పరిచయం చేశారు. 1947లో వచ్చిన [[పల్నాటి యుద్ధం (1947 సినిమా)|పల్నాటి యుద్ధం]] చిత్రానికి ఆయనే సంగీతదర్శకుడు. ఆ చిత్రంలోని పాటలు చాలా ప్రాధాన్యత ఉన్నవి, ఎందుకంటే అందులో [[అక్కినేని నాగేశ్వరరావు]] స్వయంగా పాటలు పాడారు, [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఘంటసాల]] కలిసి ఒక పాట పాడారు, [[ఘంటసాల]], [[కన్నాంబ]] కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) - ''[[తెరతీయగరాదా దేవా (పాట)|తెరతీయగరాదా దేవా]]'' ఆలాపించారు మరియు అక్కినేని నాగేశ్వరరావు, [[ఎస్.వరలక్ష్మి]] కలిసి ఒక యుగళగీతం ఆలాపించారు. 1948లో వచ్చిన [[బాలరాజు]] చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణం. ఘంటసాల పాడిన ''చెలియా కనరావా'', [[ఎస్.వరలక్ష్మి]] పాడిన ''ఎవరినే నేనెవరినే'' మొదలైన పాటలు, ఆ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఆ చిత్రంలో కొన్ని పాటలను [[ఘంటసాల]] కూడా స్వరపరిచారు. ఈయనకి ''సంగీతోపాధ్యాయ'' అని బిరుదు. నరసింహారావుగారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి.
 
==చిత్రసమాహారం==