మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==చివరి అవకాశాలు==
అదే ఏడాది విడుదలైన మరో చిత్రం [[ఆకాశరాజు]]లో కూడా కుమారి నాయికగా నటించారు. [[విశ్వనాథ సత్యనారాయణ]] రచన చేసిన ఈ జానపద చిత్రం కూడా విజయవంతం కాలేదు. ఒప్పందం ప్రకారం [[భక్త పోతన]] చిత్రంలో నటించలేదు కనుక 10 ఏళ్ళ అనంతరం వాహినీ సంస్థ నిర్మించిన [[మల్లీశ్వరి]] చిత్రంలో కుమారి ఒక పాత్రను పోషించాల్సి వచ్చింది. ఇందులో ఆమె మహారాణిగా కనిపిస్తుంది, అదీ కొద్దిసేపే. ఆ తర్వాత [[పెంపుడు కొడుకు]] (1953 తెలుగు, తమిళం) చిత్రంలోనూ, [[కాళహస్తి మహాత్యం]] (1954) చిత్రంలోనూ ఆమె నటించారు. ఆ తర్వాత వేషాలు కరువవడంతో చిత్రరంగానికి శాశ్వతంగా దూరమయ్యారు.
 
==చివరి రోజులు==
తనయుడు గంగాధర్ చదువు పూర్తి కావడంతో 1958లో విజయవాడకు తరలి వెళ్ళారు. 50 ఏళ్ళ పాటు అక్కడే గడిపిన కుమారి తన 87వ ఏట [[మార్చి 3]], [[2008]]న కన్నుమూశారు.
 
==మూలాలు==
*[http://4.bp.blogspot.com/_vDh6VLh0MwE/TS3S3PasYzI/AAAAAAAAEko/XXf0bGMD57U/s1600/maayapilla%2Bnagarajakumari.jpeg నవ్య వారపత్రికలో వ్యాసం - మొదటి భాగం]
*[http://3.bp.blogspot.com/_vDh6VLh0MwE/TS3S2akKjrI/AAAAAAAAEkg/KCpTTMnwAhg/s1600/maayapilla%2Bnagarajakumari%2B1.jpeg నవ్య వారపత్రికలో వ్యాసం - రెండవ భాగం]
 
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:1921 జననాలు]]
[[వర్గం:2008 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు