సత్యభామ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Risingstar12 (చర్చ | రచనలు) |
Risingstar12 (చర్చ | రచనలు) |
||
పంక్తి 6:
==శ్యమంతకోపాఖ్యానం==
[[File:The Wedding of Satyabhama and Krishna from Bhagavata Purana.jpg|thumb|300px|సత్యభామ శ్రీకృష్ణునల వివాహము]]
[[వినాయక వ్రత కల్ప విధానము]]లో చదివే వ్రతకథలోని శ్యమంతకోపాఖ్యానం ద్వారా సత్యభామ పరిణయవృత్తాంతం హిందువులకు సుపరిచితం. సత్రాజిత్తు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు (అంతకు పూర్వం కృష్ణుడు ఆ మణిని రాజునకిమ్మని చెప్పినందున). ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించి, జాంబవంతుని ఓడించి, మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు శ్రీకృష్ణుడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. అలా సత్యభామను కృష్ణునికిచ్చి పెళ్ళి చేసినందుకు కోపించిన శతధన్వుడు తరువాత కాలంలో సత్రాజిత్తును సంహరించాడు. (సత్యభామను కృతవర్మ బంధువులకిచ్చి వివాహం చేస్తానని పూర్వం ఇచ్చిన మాటను సత్రాజిత్తు తప్పినందుకు కారణంగా).
|