త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 206:
; మధు సూదనునకు త్రినాధ దేవులు దర్శన మిచ్చుట :
అది ఒక గొప్ప మర్రి చెట్టు, పైన ముగ్గురు మనుష్యులు కూర్చుని వున్నారు .వారు వరుసగా బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకుని ,లేచి పోవుచుండగా ,త్రిమూర్తులు బ్రాహ్మణునితో ' ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది ? నీవు ఎక్కడికి వెళ్లుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు " మనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి "అయ్యా !నేను కడు బీదవాడను బిక్ష మెత్తుకుని బ్రతికే వాడను నాకు ఒక ఆవు ఉన్నది .అది కనిపించట్లేదు ఈ దినము శ్రీ పురము సంత అగుచున్నది .ఆ సంతకు వెళ్లి వెతికెదను .ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంత లోనే అమ్ముతారు గదా ! త్రినాధ స్వాములారా ! ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను ."అని తన సంగతి చెప్పెను.
 
అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు యేమి చెప్పుచున్నారంటే " నీ వేలాగూ సంతకు వెళ్లుచున్నావు కనుక ,మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను అని త్రిమూర్తులు అన్నారు . అంత బ్రాహ్మణుడు " యేమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు యిట్లనిరి .ఒక్క పైసా ఆకు చెక్క ,ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి .ఆ మాటలు విని బ్రాహ్మణుడు యేమని చెప్పు చున్నాడంటే " ఓ త్రిమూర్తులారా ! నాకు పైసాలు ఎక్కడ దొరుకును ? నేను బీదవాడను గదా ? బిక్ష మెత్తుకుని జీవించు చున్నాను "అని అనగా ,త్రిమూర్తులు యేమి చెప్పు చున్నారంటే "ఓ బ్రాహ్మణుడా ! విను, అదిగో ఆ గోరంట పొద కనిపించు చున్నది కదా ! దాని మొదట మూడు పైసాలున్నవి " ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్లి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగే సరికి మూడు పైసాలు దొరికినవి .ఇంకా ఉండునేమో నని ఆ చెట్టు నింకను పైకి లాగు చుండెను అది చూచి త్రినాదులవారు " బ్రాహ్మణుడా !నీకు వెర్రి పుట్టినదా ? అందులో పైసలు ఇంకా లేవు ,ఎంత దొరికినదో అంతే యుండును " అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని ,అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికిరి. "ఓ విప్రుడా ! తిరిగి ఎందుకొచ్చావు " అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా నీపై మీద గావంచాలో తెమ్మని త్రినాదులన్నారు .అందులకా బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది ? మీరు జగత్కర్తలు ,నాతో కపటంగా చెబుతున్నారు అనగా "ఓయీ ! నీతో కపటంగా చెప్పలేదు .మమ్ము తలుచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీ పురం సంతలో ప్రవేశించి నాడు .వెళ్లి చూడగా ఆవు కనిపించ లేదు .త్రినాదుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట
 
; త్రినాదుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట :
ఆకులు వక్కలు ,గంజాయి తీసుకుని ,నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో "ఒక్క పైసా నూనె గావంచ లో పోయమన్నాడు అందులకా తెలికలవాడు ఆశ్చర్య పడి , " ఈ బ్రాహ్మణుడు పిచ్చి వాడు కాబోలని నూనేలేదు .అని చెప్పినాడు .అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు అంత ముసలివాడు " దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్ర మిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు " ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు ! వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను " అని ఆలోచించి కొలత పాత్ర తిరగ వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు . విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని అచట నుండి వెడలిపోయెను .
 
"https://te.wikipedia.org/wiki/త్రినాథ_వ్రతకల్పం" నుండి వెలికితీశారు