పరవస్తు చిన్నయ సూరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Srigargeya (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[దస్త్రం:C:\Documents and Settings\All Users\Documents\pcs.jpg]]'''పరవస్తు చిన్నయ సూరి''' ([[1809]]-[[1861]]) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఇతడు [[తమిళనాడు]]లోని [[చెంగల్పట్టు]] జిల్లాలోని [[పెరంబూరు]]లో జన్మించాడు. [[మద్రాసు]] ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీక్ష చేయించి, సమర్థుడని గుర్తించి, "చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు.<ref>మధునాపంతుల 1950</ref> సూరి అనగా పండితుడు అని అర్థం.
చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర [[ఆంధ్రప్రదేశ్]] నుండి [[మద్రాసు]] వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. చిన్నయ [[1809]] (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన [[1806]]లో జన్మించాడని భావిస్తున్నారు..
|