గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[File:Chennai Museum Entrance.jpg|thumb|right|200px|The entrance sign at the museum]]
గవర్నమెంట్ మ్యూజియం 1851 సంవత్సరం చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో స్థాపించబడింది. భారతదేశంలోని చారిత్రక పురాతన మ్యూజియాలలో రెండవది ఈ మద్రాస్ మ్యూజియం. భారతదేశంలోని చారిత్రక మ్యూజియాలలో మొదటిది కోలకతా లో ఉంది, దీనిని 1814 సంవత్సరంలో స్థాపించారు. దక్షిణ ఆసియాలోని అతిపెద్ద మ్యూజియములలో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇందులో ప్రాధాన్యత కలిగిన పురావస్తు, నాణేల సేకరణలు ఉంటాయి. రోమన్ ప్రాచీనకాలం నాటి ప్రాముఖ్యత గల అతిపెద్ద పురాతన వస్తువులను సేకరించారు. వంద సంవత్సరాల పైబడిన అనేక చారిత్రక భవనాలు ఈ ప్రభుత్వ సంగ్రహాలయం ప్రాంగణంలో ఉన్నాయి. ఈ మ్యూజియం ప్రాంగణంలోనే అందరిని బాగా ఆకట్టుకునే వైజ్ఞానిక థియేటర్ ఉంది. ఈ మ్యూజియం పరిసర ప్రాంతంలోనే ప్రస్తుతం నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఉన్నది. దీనిని ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మించారు. ఈ భవనం నందు [[రాజా రవి వర్మ]] వంటి వారు తయారు చేసిన అరుదైన కళాఖండాలు కలవు.
 
 
==చచ్చిన కాలేజి, బతికిన కాలేజి==
ఈ మ్యూజియం ప్రాంగణంలోని ఒక భవనంలో చనిపోయిన అన్ని జంతువుల శరీరాలను ఇక్కడ భద్ర పరిచారు. ఇక్కడ అన్ని జీవులకు సంబంధించిన కళేబరాలు ఉండటంతో మాట సామెతగా ఈ మ్యూజియంలో ఏముంటాయి బొచ్చు తప్పక అని ఎవరో అన్నారని అప్పుడు నిర్వాహకులు ఒరోరే మన మ్యూజియంలో బొచ్చు లేదే అని అప్పుడు బొచ్చు కూడా ఏర్పాటు చేసారని పెద్దలు చెప్పుతుంటారు. తెలుగువారు అన్ని రకాల చనిపోయిన జంతువుల శరీరాలను భద్ర పరచిన ఈ మ్యూజియాన్ని చచ్చిన కాలేజి అని మద్రాసులోని మరొక ప్రాంతంలో ఉన్న జూపార్కును బతికిన కాలేజి అని చాలా కాలం పాటు ఉపయోగించారు.
 
 
==మ్యూజియము దాని ప్రాంగణంలోని పరిసరాల చిత్రమాలిక==