శ్రీకాళహస్తీశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును.
 
అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్త్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది జరించుఁ గాని పరమార్థంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయుఁ జింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వరా!
 
శ్రీకాళహస్తీశ్వరా! ఆలోచించి చూస్తే, మనుజునకు అంతా మాయే అని తెలిసినప్పటికీ, తన కాంతలు (పతులు), పుత్రులు, ధనము, శరీరములే వాస్తవము, శాశ్వతములని తలచి వానికై తపిస్తూ మోహమనెడి సముద్రంలో కొట్టుమిట్టాడుతాడేగానీ, పరమార్థము, పరమాత్మవైన నీయందు చింతాకంతైననూ ధ్యానము నిలుపజాలకున్నాడు గదా.
 
===వనరులు, బయటి లింకులు===