స్వాతిముత్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==కధ==
సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది. శివయ్య ([[కమలహాసన్]]) కొడుకులు, తమ కుటుంబాలతో తల్లి, తండ్రి దగ్గరకు వస్తారు. లలిత([[రాధిక]]) ఆరోగ్యము బాగుండదు. శివయ్య మనవరాలు కధ రాయటానికి తండ్రి సహాయము కోరగా, తాతగారి కధను రాయమంటాడు.
 
పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్న లలిత భర్తని పోగొట్టుకుని, అన్నగారు చలపతి ([[శరత్ బాబు]]), కొడుకులతో కలిసి అత్తగారింటికి వెడుతుంది. కోటీశ్వరుడైన మామగారు లోపలికి రానివ్వకుండా, బయటికి గెంటేస్తాడు. అన్నగారింటికి చేరిన లలితకి వదినగారి ([[వై.విజయ]]) సాధింపులు మొదలు అవుతాయి. వారు వున్న ఇంటి లోగిలిలోనే శివయ్య తన నాయనమ్మ ([[నిర్మలమ్మ]])తో కలిసి ఉంటుంటాడు. చిన్నపిల్లవాడి మనస్తత్వము గల అమాయకుడు శివయ్య. లలిత పడుతున్న బాధలని తీర్చడానికి తన వంతు సహాయము చేద్దామని అనుకుంటాడు. ఆమెని పెళ్ళి చేసుకుని కొత్త జీవితము ఇవ్వటమే ఎవరైన ఆమెకు చేయగలిగే సహాయము అన్న నాయనమ్మ మాటలకి స్పందించి, శ్రీరామ నవమి పందిళ్ళప్పుడు ఆమె మెడలో తాళి కడతాడు.
పంక్తి 33:
మరణ శయ్య మీద ఉన్న భార్య కోసము తనని, కొడుకుని తీసుకుని వెళ్ళి, శివయ్యను అవమానించి పంపించివేసిన మామగారిని ఎదిరించి, భర్త దగ్గరకు చేరుతుంది లలిత. లలిత మరణము తో, కొడుకులతో కలిసి బయల్దేరుతాడు శివయ్య, ఆమె పూజించిన తులసికోట ను కూడా తీసుకుని. కధ పూర్తి చేసిన మనవరాలు కధకి "స్వాతిముత్యం" అని పెడుతుంది.
 
== సంగీతం ==
అన్నీ పాటలకు [[ఇళయరాజా]] సంగీతం సమకూర్చారు.
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/స్వాతిముత్యం" నుండి వెలికితీశారు