కన్యకా పరమేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 26:
కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడి కి వర్తమానాన్ని పంపాడు.దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవి ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు.ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ,ధాన,బేధ,దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.
=== కులస్థుల ప్రతిస్పందన===
ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమ శ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు.సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి.102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు,పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది,కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా,మిగిలిన 613 గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.
భాస్క్రరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఈ మాటలు కుశుమ శ్రేష్టి కి ఉత్ప్రేరకాలుగా పని చేసాయి.తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయ రాదని నిశ్చయానికి వచ్చాడు.ఈ సంఘటన తో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది.రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి,తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు.ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండ లో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు.
=== వాసవి దేవి ప్రతిస్పందన ===
|