కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 73:
అర్జునుడు బాణప్రయోగంతో ఏర్పాటు చేసింది. దయాల్ పూర్ వద్ద ఉన్న రెండవది యుద్ధభూమిలో ఆస్వాల దాహం తీర్చడానికి బాణప్రయోగంతో ఏర్పాటు చేసింది. వైశాఖమాసం, దసరా సమయాలలో ఇక్కడ మేళా ఏర్పాటు చేస్తారు.
* కర్ణుడి ఖేడా :- ఇది బ్రహ్మసరోవరానికి ఒక మైలు దూరంలో ఉంది. యుద్ధసమయంలో కర్ణుడు ఇక్కడ బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడని కథనాలు వివరిస్తున్నాయి.
* ఆప్గా తీర్థం :- కర్ణుడి ఖేడా సమీపంలో ఉన్న అతి పవిత్రమైన సరోవరమే ఆప్గాతీర్ధం సరోవరం. కురుక్షేత్రంలో ప్రవహించిన నదులలో ఒకటైన ఆప్గానది యొక్క వరద ప్రవాహం నుండి ఏర్పడిన సరసు కనుక ఈ సరసుకీ పేరు వచ్చింది. మానస నదికి క్రోశుదూరంలో ఉన్న ఆప్గా నదిని బ్రాహ్మణులు సేవించే వారని వామనపురాణంలో ఉన్నది. ఆప్గానదిలో తర్పణం విడిచిన వారి కోరికలు నెరవేరగలవని విశ్వసించేవారు.
* జ్యోతిసర్:- కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన పాలరాతిశిల్పం ఉంది. అలాగే శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయి. అర్జునుడి రధం ఉన్న ప్రదేశం చుట్టూ ఐదు వృక్షాలు ఉన్నాయి. ఈ ఐదు వృక్షాలు శ్రీకృష్ణుడి గితోపదేశం నేరుగా విన్నాయని విశ్వసిస్తూ ఐదు వృక్షాలను అతి పవిత్రంగా భావిస్తున్నారు. ఈ వృక్షాల ఆకులు కూడా నేలరాలకూడదు అని ఈ వృక్షాలకు పెద్ద వలలుకట్టి ఉన్నాయి. సమీపంలోనే బాణగంగ మరియు విష్ణుసహస్రనామము ఆరంభమైన ఆలయం ఉన్నాయి. ఇక్కడ ఒకప్పుడు జ్యోతిసర్ మహాదేవుడు ఉండేవాడని అందువలనే ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది. ఇక్కడ ఒక ప్రాచీన సరోవరం ఉంది. సరోవరతీరంలో ఉన్న వృక్షం అతిప్రాచీనమైనదని భావించబడుతుంది. దీనిని అక్షయ వటవృక్షమని అంటారు. గితోపదేశం విన్న ఐదు వృక్షాలలో ఇది ఒకటి. థానేశ్వర్ విధ్వంశం జరిగినప్పుడు శిధిలమైన శివాలయం వద్ద అరో వట వృక్షం ఉంది. 1960లో ఇక్కడ శ్రీ కృష్ణ మందిరం నిర్మించబడింది.
* సర్వదమన్ :- ఇది జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రదేశం. ఇక్కడ పెన్నే సూర్యకుండ్ అనే తీర్ధం ఉంది.
|