సావిత్రి(శ్రీ అరవిందయోగి పుస్తకం)

శ్రీ అరవిందయోగి రచించిన సావిత్రిని తంబిశెట్టి రామకృష్ణ అనువాదం చేశాడు. ఇది ఎమెస్కో బుక్స్, విజయవాడ వారి ద్వారా సెప్టెంబరు, 2009 లో ముద్రితమైంది.[1] శ్రీ అరవింద ఆశ్రమం వారి జాలస్థలిలో లభ్యం.[2]

శ్రీ అరవిందయోగి రచించిన సావిత్రి పుస్తకం ముఖచిత్రం

మహాభారతంలో సావిత్రి-సత్యవంతుల ప్రణయగాథ ఈ పుస్తక విషయం. అడ్లూరు రామరాజు తన పుస్తక పరిచయంలో సాంప్రదాయకమైన కథను మృత్యువుపై విజయంగా వివరించడం అప్పటి వలసవాదం, స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలో ఆంగ్లభాషలో రాయడంతో వివిధ వివాదాలకు కారణమైందని పేర్కొన్నారు. ఇది చాలా పొడుగైన మహాకావ్యమని, అర్థంచేసుకోవటం చాలా కష్టమని పేర్కొన్నాడు. సావిత్రి గాథ మాత్రమే కాక ప్రతీక అయినందున దీనిని అనువదించటం కష్టమైనదని అయినా ఆచార్య తంబిశెట్టి రామకృష్ణ తన విజ్ఞానం, వేదాంతం, కవితాస్వాదన పై పట్టుతో చేసిన కృషి సఫలమైందని అన్నాడు.

వనరులు మార్చు

  1. "ఎమెస్కో జాలస్థలిలో సావిత్రి". Archived from the original on 2013-05-25. Retrieved 2013-11-05.
  2. శ్రీ అరవింద ఆశ్రమం వారి జాలస్థలిలో సావిత్రి పుస్తకం